లారీ - బస్సు ఢీ: ఆరుగురికి గాయాలు


పెనుకొండ: అనంతపురం జిల్లా పెనుకొండ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం నుంచి హిందూపురం వెళ్తున్న బస్సు ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని  6 మంది ప్రయాణికులు గాయపడ్డారు.  వెంటనే క్షతగాత్రులను పెనుకొండ ఆసుపత్రికి తరలించారు.  ప్రమాదానికి గురైన బస్సు హిందుపురం డిపోకు చెందినది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top