breaking news
Bus management
-
గ్రేటర్ ఆర్టీసీకీ నిధుల వెల్లువ
రూ.198 కోట్లు చెల్లించిన జీహెచ్ఎంసీ ఇక నుంచి నష్టాలన్నీ జీహెచ్ఎంసీయే భరిస్తుంది నగరంలో అదనపు బస్స్టేషన్లు, వాణిజ్యకేంద్రాల ఏర్పాటు శంషాబాద్ ఎయిర్పోర్టుకు 30 ఓల్వో బస్సులు సీఎం సమీక్షతో నగర ఆర్టీసీకి ఊరట సిటీబ్యూరో గ్రేటర్ ఆర్టీసీకి గొప్ప ఊరట. నగరంలో బస్సుల నిర్వహణపై ఇక నుంచి పూర్తిగా జీహెచ్ఎంసీయే బాధ్యతవహించనుంది. శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు స్పష్టం చేశారు. అంతేకాదు...ఇప్పటి వరకు నమోదైన సుమారు రూ.338 కోట్లకు పైగా నష్టాల్లో రూ.198 కోట్ల నిధులను జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి చెక్కు రూపంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణకు అందజేశారు. దీంతో పీకల్లోతు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న నగర ఆర్టీసీకి ఊరట లభించినట్లయింది. మరోవైపు నగరంలో ప్రజారవాణాను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా ఆర్టీసీ ఎదుర్కొనే నష్టాలన్నింటినీ జీహెచ్ఎంసీయే భరించనుంది. టిక్కెట్టేతర ఆదాయంపైన దృష్టి సారించాలని, నగరంలో ప్రజల అవసరాలకు తగినవిధంగా బస్సులను పెంచాలని సమీక్షా సమావేశంలో సీఎం దిశానిర్ధేశం చేశారు. నగరంలోని 28 డిపోల ద్వారా ప్రతి రోజు సుమారు 3550 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. 33 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారు. బస్సుల నిర్వహణ, విడిభాగాలు, ఇంధనం కొనుగోళ్లు, ఉద్యోగుల జీతభత్యాలు తదితర ఖర్చుల వల్ల ఏటేటా నష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి రోజు రూ.2.5 కోట్ల ఆదాయం లభిస్తుండగా, బస్సుల నిర్వహణ కోసం రూ.3.5 కోట్ల మేర ఖర్చు చేయవలసి వస్తోంది. దీంతో రోజుకు రూ.కోటి మేర నష్టం వాటిల్లుతోంది. గ్రేటర్ ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు జీహెచ్ఎంసీ గత సంవత్సరం రూ.100 కోట్ల మేర అందజే సింది. తాజాగా రూ.198 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇక నుంచి నమోదయ్యే ప్రతి రూపాయి నష్టాన్ని సైతం జీహెచ్ంసీయే భరించనుంది. అర్బన్ ట్రాన్స్పోర్టేషన్లో భాగంగా ఈ నిధులను వెచ్చించనుంది. అదనపు బస్స్టేషన్లు, వాణిజ్య కేంద్రాలు... ప్రయాణికుల రద్దీ, ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడున్న మహాత్మాగాంధీ, జూబ్లీబస్స్టేషన్లకు తోడు మరో రెండు బస్స్టేషన్లను కొత్తగా నిర్మించాలని సీఎం సూచించారు. బస్స్టేషన్లు, బస్సుల్లో వ్యాపార ప్రకటనల ద్వారా అదనపు ఆదాయాన్ని సముపార్జించుకోవాలి. అలాగే నగరం నడిబొడ్డున ఉన్న రాణిగంజ్, కంటోన్మెంట్ డిపోలను షాపింగ్మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్లుగా అభివృద్ధి చేయాలని, ప్రస్తుతం అక్కడ ఉన్న డిపోలను శివార్లకు తరలించాలని నిర్ణయించారు. టిక్కెట్లపైనే కాకుండా టిక్కెట్టేతర ఆదాయంపైన ప్రధానంగా దృష్టి సారించాలని సీఎం పేర్కొన్నారు. మరోవైపు విద్యార్థులు, వికలాంగులు, జర్నలిస్టులు, ఉద్యోగులు తదితర వర్గాలకు అందజేసే రాయితీ బస్పాస్లపైన ప్రభుత్వం చెల్లించవలసిన నిధులను ఇక నుంచి బడ్జెట్లోనే కేటాయించనున్నారు. రూ.30 కోట్లతో ఎయిర్పోర్టుకు ఓల్వో బస్సులు... ప్రస్తుతం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తున్న 25 పుష్పక్ బస్సుల స్థానంలో సుమారు రూ.30 కోట్లతో అత్యాధునిక ఓల్వో బస్సులను ప్రవేశపెట్టనున్నారు. విశ్వనగరం స్థాయి ప్రతిష్టకు అనుగుణంగా అత్యాధునిక బస్సులను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ప్రస్తుతం జేఎన్టీయూ, సికింద్రాబాద్, జేబీఎస్, పర్యాటక భవన్ల నుంచి పుష్పక్ బస్సులు ఎయిర్పోర్టుకు రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వివిధ మార్గాల్లో బస్సుల సంఖ్యను పెంచేందుకు మరో 160 కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేశారు. -
అక్రమ మార్గం.. వక్రభాష్యం
‘బస్సు’ దగ్ధం కేసు నుంచి తప్పించుకొనేందుకు యత్నాలు ‘జబ్బార్’ ట్రావెల్స్ను ముందు పెట్టి వ్యవహారం నడిపిస్తున్న జేసీ బ్రదర్స్? చట్టంలోని లొసుగులను వినియోగించుకునే ప్రయత్నం బెంగళూరు-హైదరాబాద్ ప్రయాణం 8 గంటలేనట.. రెండో డ్రైవర్ అవసరం లేదట ఇరుకు వంతెన కారణంగానే ప్రమాదం జరిగిందంటూ బుకాయింపు మహబూబ్నగర్, సాక్షి ప్రతినిధి: చట్టంలోని లొసుగులను సాకుగా చూపుతూ కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రమాదానికి గురైన బస్సు యాజమాన్యం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం చట్టంలోని నిబంధనలకు వక్రభాష్యం చెబుతూ తప్పు తమదికాదని వాదిస్తోంది. అయితే ఈ కేసు తమ మీదికి వచ్చే అవకాశం ఉండడంతో.. జబ్బార్ ట్రావెల్స్ను ముందుపెట్టి ‘జేసీ’ బ్రదర్స్ తెరవెనుక వ్యవహారం నడిపిస్తున్నట్లు సమాచారం. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న జబ్బార్ ట్రావెల్స్ బస్సు బుధవారం తెల్లవారుజామున మహబూబ్నగర్ జిల్లా పాలెం శివార్లలో దగ్ధమై 45 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బస్సు డ్రైవర్తో పాటు మేనేజర్ను కూడా అరెస్టు చేశారు. అయితే, అసలు ఈ కేసులో తమ తప్పేమీ లేదనేందుకు నిబంధనల్లోని లొసుగులను వాడుకొనేందుకు బస్సు యాజమాన్యం ప్రయత్నిస్తోంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకునేందుకు ఎనిమిది గంటలు మాత్రమే పడుతుందని.. దాంతోపాటు ప్రమాదానికి గురైన బస్సుకు జాతీయ రహదారి పర్మిట్ లేనందున ఇద్దరు డ్రైవర్లు అవసరం లేదని, నిబంధనల ప్రకారం ఒక్కరే సరిపోతారని ట్రావెల్స్ యాజమాన్యం అధికారులతో చెప్పినట్లు తెలుస్తోంది. దీనికితోడు పాలెం సమీపంలో కల్వర్టు జాతీయ రహదారిపైకి చొచ్చుకువచ్చిందునే ప్రమాదం జరిగిందని వారు వాదిస్తున్నట్లు సమాచారం. ఏడో నంబర్ జాతీయ రహదారి విస్తరణ సమయంలో పాత కల్వర్టును తొలగించి.. కొత్త కల్వర్టు నిర్మించకపోవడం వల్ల అక్కడ రహదారిపైకి కల్వర్టు నిర్మాణం కొంత చొచ్చుకువచ్చినట్లుందని.. అందువల్లే దుర్ఘటన జరిగిందని వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. కాగా.. బస్సు ఢీ కొన్న కల్వర్టు నిర్మాణాన్ని ఢిల్లీకి చెందిన జాతీయ రహదారి శాఖ అధికారులు వచ్చి పరిశీలించారు.