breaking news
building inspection
-
సచివాలయం తరలింపు పనులు షురూ..
హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం తరలింపు పనులు వేగవంతమయ్యాయి. ఇందుకు అవసరమైన ప్రత్యామ్నాయ భవనాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ గురువారం పరిశీలించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన వివిధ శాఖలకు అనువైన భవనాలను పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా కొత్త సచివాలయ పనులను ప్రారంభించే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. భవనాలను పరిశీలించిన వారిలో సీఎస్తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మున్సిపల్ భవనంలోనే జనగామ కలెక్టరేట్
సమీకృత బాలుర వసతి గృహంలో ఐదు శాఖలు పరిశీలించిన జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ జనగామ : జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని పురపాకల సంఘంలో నూతనంగా నిర్మిస్తున్న భవనంలో ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. దసరా పండుగ రోజున కొత్త జిల్లాల పరిపాలన ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించగా అధికారులు పనులు వేగవంతం చేస్తున్నారు. ఈమేరకు పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు భవనాలను పరిశీలించేందుకు కలెక్టర్ వాకాటి కరుణ గురువారం జనగామకు వచ్చారు. జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్రావు, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, ఆర్డీవో వెంకట్రెడ్డితో కలిసి చంపక్హిల్స్లో నూతనం గా నిర్మిస్తున్న వంద పడకల ప్రసూతి ఆస్పత్రి, పెంబర్తి ప్రగతి ఫార్మసీ, వడ్లకొండ ఇరిగేషన్ క్వార్టర్లు, ఆర్డీవో క్వార్టర్లను కలెక్టర్ పరి శీలించారు. అన్ని హంగులతో నిర్మాణం పూర్తి చేసుకుంటున్న మున్సిపల్ భవనంలోనే కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం ద్వారా తమకు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ధర్మకంచలోని సమీకృత బాలుర వసతిగృహంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీతోపాటు మరోశాఖకు కేటాయిస్తామని చెప్పారు. మూడు రోజుల్లో 19 శాఖలకు చెందిన భవనాలను గుర్తించి ఫర్నీచర్ పంపుతామని తెలిపారు. మున్సిపల్ భవనంతోపాటు సమీకృత వసతిగృహంలో టాయిలెట్స్, నీటి వసతి, విద్యుత్, ఎలక్టిక్రల్ పనులు త్వరతగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా వచ్చింది.. చాలా సంతోషంగా ఉందా.. జనగామ జిల్లా సాధించుకున్నారు.. చాలా సంతోషంగా ఉందా.. అంటూ కలెక్టర్ కరుణ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. మేడమ్ జిల్లా సాధించుకున్నాం.. మీరే కలెక్టర్గా రావాలంటూ ఓ నాయకుడు అనడంతో చిరునవ్వుతో సమాధానం చెప్పారు. వారి వెంట జేఏసీ చైర్మన్ ఆర్టుల దశమంతరెడ్డి, కౌన్సిలర్లు కన్నారపు ఉపేందర్, ఎంపీపీ యాదగిరి, సర్పంచ్ బాల్దె సిద్దులు, డాక్టర్ లక్షి్మనారాయణనాయక్, ఆకుల సతీష్, మహంకాళి హరిశ్చంద్రగుప్తా ఉన్నారు. -
ఏడీఎం కార్యాలయ భవన పరిశీలన
మానుకోట ఏఎంసీ భవనంపై కార్యాలయం బోర్డు ఏర్పాటు మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పడనున్న తరుణంలో స్థానికంగా జిల్లాస్థాయి అధికారుల కార్యాలయాల ఏర్పాటుకు కసరత్తు ఊపందుకుంది. ఇందులో భాగంగా మార్కెటింగ్ శాఖకు సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. తాజాగా బుధవారం వరంగల్ మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ ప్రవీణ్రెడ్డి మహబూబాబాద్కు వచ్చారు. స్థానిక ఏఎంసీ సెక్రటరీ వి.సుచిత్ర, సూపర్వైజర్ శ్రీనివాసరాజుతో కలిసి ఏడీఎం కార్యాలయ ఏర్పాటుకు ఎంపిక చేసిన భవనాన్ని పరిశీలించారు. అక్టోబర్ 1కల్లా ఏడీఏం కార్యాలయ ఫర్నీచర్ మహబూబాబాద్కు చేరుతుందని ప్రవీణ్రెడ్డి తెలిపారు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ భవనంపైన జిల్లా మార్కెటింగ్ కార్యాలయం బోర్డును కూడా ఏర్పాటు చేయించడం గమనార్హం.