breaking news
Buchi Babu Invitation Cricket Tournament
-
బుచ్చిబాబు టోర్నీ ఫైనల్: పటిష్ట స్థితిలో హైదరాబాద్
చెన్నై: ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు తమ జోరు కొనసాగిస్తోంది. ఛత్తీస్గఢ్ జట్టుతో జరుగుతున్న ఫైనల్లో హైదరాబాద్ ప్రత్యర్థి జట్టుకు 518 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. మ్యాచ్ మూడో రోజు హైదరాబాద్ తమ రెండో ఇన్నింగ్స్లో 70.2 ఓవర్లలో 281 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రాహుల్ సింగ్ (68; 8 ఫోర్లు, 2 సిక్స్లు), రాహుల్ రాధేశ్ (41; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.రోహిత్ రాయుడు భారీ సెంచరీఛత్తీస్గఢ్ బౌలర్ జీవేశ్ ఆరు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఛత్తీస్గఢ్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 70.2 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటవ్వడంతో హైదరాబాద్కు 236 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. హైదరాబాద్ బౌలర్లలో అనికేత్ రెడ్డి నాలుగు వికెట్లు తీయగా... రోహిత్ రాయుడు, తనయ్ త్యాగరాజన్లకు మూడు వికెట్ల చొప్పున లభించాయి. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 118.4 ఓవర్లలో 417 పరుగులు చేసింది. రోహిత్ రాయుడు (155; 8 ఫోర్లు, 8 సిక్స్లు) భారీ సెంచరీ సాధించాడు. అభిరత్ (85; 10 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ రాధేశ్ (48; 7 ఫోర్లు) ఆకట్టుకున్నారు.టీమిండియా స్టార్లు సైతంకాగా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్లలో టీమిండియా స్టార్లు శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం శ్రేయస్, సర్ఫరాజ్ దులిప్ ట్రోఫీ-2024తో బిజీగా ఉండగా.. సూర్య, ఇషాన్ గాయాల బారిన పడ్డారు. చదవండి: DT 2024: భారత ‘ఎ’ జట్టులోషేక్ రషీద్.. టీమిండియాతో చేరని సర్ఫరాజ్ ఖాన్! -
‘బుచ్చిబాబు’ విజేత హైదరాబాద్
ఫైనల్లో తమిళనాడు ఎలెవన్ చిత్తు చెన్నై: సొంతగడ్డపై ఇటీవలే మొయినుద్దౌలా గోల్డ్ కప్ గెలిచి ఊపు మీదున్న హైదరాబాద్ జట్టు చెన్నైలోనూ అదే జోరు కొనసాగించింది. శుక్రవారం ఇక్కడ ముగిసిన ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ విజేతగా నిలిచింది. ఫైనల్లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్సీఏ) ఎలెవన్ను చిత్తు చేసింది. మ్యాచ్ తొలి రోజు గురువారం తమిళనాడు 200 పరుగులకే ఆలౌట్ కాగా... ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ వికెట్ నష్టానికి 76 పరుగులు చేసింది. రెండో రోజు హైదరాబాద్ 56.4 ఓవర్లలో 2 వికెట్లకు 201 పరుగులు సాధించి విజయాన్నందుకుంది. కొల్లా సుమంత్ (115 బంతుల్లో 77 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ రాయుడు (100 బంతుల్లో 47 నాటౌట్; 7 ఫోర్లు) మూడో వికెట్కు అభేద్యంగా 113 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ 35, అక్షత్ రెడ్డి 30 పరుగులు చేశారు. టోర్నీలో మొత్తం 299 పరుగులు సాధించిన కొల్లా సుమంత్కు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు దక్కింది. 12 వికెట్లు తీసి టోర్నీలో రెండో స్థానంలో నిలిచిన హైదరాబాద్ లెఫ్టార్మ్ స్పిన్నర్ మెహదీ హసన్ కూడా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.