-
సినిమాకు డబ్బు ఇవ్వలేదని ఆదరించిన వాడినే అంతమొందించాడు..
ఒంటిమిట్ట: తనకు ఎవరూ లేరు.. అనాథ అని వచ్చిన ఓ యువకుడు ఆదరించిన వ్యక్తినే అంతమొందించి పరారయ్యాడు. దాదాపు 18 నెలల తర్వాత ఎట్టకేలకు పోలీసులు ఆ నిందితుడిని పట్టుకున్నారు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి కల్యాణ వేదికకు సమీపంలో శ్రీ సాయిరాం సిమెంట్ బ్రిక్స్ ఫ్యాక్టరీలో గత ఏడాది ఫిబ్రవరి 29న హత్యకు గురైన వాచ్ మెన్ కత్తి వెంకట రమణ (50) కేసును ఎట్టకేలకు ఒంటిమిట్ట పోలీసులు ఛేదించారు. మంగళవారం ఒంటిమిట్టలో డీఎస్పీ శివభాస్కర్ రెడ్డి విలేకరుల ఎదుట నిందితుడిని హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. శ్రీ సాయిరాం సిమెంట్ బ్రిక్స్ ఫ్యాక్టరీలో వాచ్మెన్గా కత్తి వెంకట రమణ ఉండేవాడు. ఇతనికి రెండు ఆటోలు ఉండేవి. ఒక ఆటోను వెంకట రమణ కుమారుడు భరత్ నడుపుతుండగా.. మరో ఆటోను షబ్బీరుల్లా అనే వ్యక్తి నడిపేవాడు. ఈ క్రమంలో నిందితుడు 20 ఏళ్ల వయసు కలిగిన ధనుష్ (అఖిల్).. షబ్బీరుల్లా వద్దకు వచ్చాడు. తనకు ఎవరూ లేరని.. ఏదైనా పని ఇప్పించాలని కోరాడు. షబ్బీరుల్లా ఆటో తనది కాదని అతన్ని వెంకటరమణ వద్దకు తీసుకెళ్లాడు. ఎవరూ లేరని చెబుతుండడంతో ధనుష్ను వెంకట రమణ తన ఇంటి వద్ద పనిలో పెట్టుకున్నాడు. సినిమాకు డబ్బు ఇవ్వలేదని.. ఈ క్రమంలో ధనుష్ ఓ రోజు సినిమాకు వెళ్లాలి.. రూ. 500 డబ్బు కావాలి అని బ్రిక్స్ ఫ్యాక్టరీ వద్దనున్న వెంకటరమణను అడిగాడు. తన వద్ద డబ్బు లేదని చెప్పాడు. అదే సమయంలో బ్రిక్స్ ఫ్యాక్టరీ యజమాని వెంకటరమణకు డబ్బులు ఇవ్వడాన్ని ధనుష్ గమనించాడు. అదే రోజు రాత్రి తనకు డబ్బు ఇవ్వలేదనే కోపంతో వెంకటరమణను రాడ్తో కొట్టి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన వెంకటరమణ మృతిచెందాడు. గాలించి పట్టుకున్నారు.. వెంకట రమణ కుమారుడు భరత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు విజయవాడ, కైకలూరులో ఉన్నాడన్న సమాచారం రావడంతో ఒంటిమిట్ట పోలీసులు వారం రోజుల పాటు కైకలూరులో గాలించారు. అక్కడ నుంచి కడపకు వచ్చాడని సమాచారం వచ్చింది. దీంతో కడప పాత బస్టాండు రూబి లాడ్జ్ వద్ద సోమవారం ధనుష్ను పట్టుకున్నారు. నిందితుడు పాత నేరస్తుడే... నిందితుడు ధనుష్ స్వస్థలం కృష్ణా జిల్లా మండపల్లి మండలంలోని చావలపాడు గ్రామం. ఇతడు సెల్ఫోన్లు, ఏటీఎం కార్డులు, నగదు, వాహనాలను దొంగలించేవాడు. కాగా వెంకటరమణ హత్యకు ఉపయోగించిన రాడ్తో పాటు 10 సెల్ఫోన్లు, ఒక ద్విచక్రవాహనాన్ని నిందితుడి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్ని రోజులు పరారీలో ఉన్న ధనుష్ను పట్టుకోవడంలో సీఐ హనుమంతనాయక్, ఎస్ఐ సంజీవరాయుడు, హెడ్ కానిస్టేబుళ్లు హరి, రమేష్, కానిస్టేబుల్ సునిల్ కృషి చేశారు. పోలీసులను డీఎస్పీ అభినందించారు. -
స్తంభాలకు ముగ్గుర్ని కట్టి.. పేల్చేశారు
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ కూరత్వం పరాకాష్టకు చేరుకుంది. అత్యంత అమానుష పద్ధతుల్లో బందీలు చంపుతున్న ఆ గ్రూప్ తాజాగా ముగ్గురిని అత్యంత కిరాతకంగా హతమార్చింది. సిరియాలోని పాల్మిరా నగరంలో ఒక ప్రాచీన కట్టడం స్తంభాలకు ముగ్గురు వ్యక్తుల్ని కట్టేసి.. ఆ స్తంభాలను పేల్చేసింది. దీంతో వారు ముక్కలుముక్కలు అయ్యారు. ఈ ఘటన గురించి నగరంలోని స్థానిక వర్గాలు తమకు సమాచారం ఇచ్చాయని లండన్కు చెందిన సిరియా అబ్జర్వేటరీ ఫర్ హ్యుమన్ రైట్స్ తెలిపింది. గత మే నెల నుంచి ప్రాచీన పాల్మిరా నగరం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల ఆధీనంలో ఉంది. ఇలా ముగ్గురిని స్తంభాలకు కట్టివేసి ఎందుకు హతమార్చారో.. వారు ఏ నేరం చేశారో కారణాలు తెలియదు. కానీ చిన్నచిన్న నేరాలకు సైతం ఐఎస్ఐఎస్ అత్యంత కిరాతకమైన రీతిలో హత్యలకు పాల్పడుతున్నది. కొందరికి మరణశిక్షలు విధించి.. వారే తమ గోతిని తవ్వుకొని.. అందులో తమకుతామే సజీవ సమాధి అయ్యేలా వ్యవహరిస్తున్నది. ఇరాక్, సిరియాలో పెద్దమొత్తంలో భూభాగాన్ని తమ అధీనంలోకి తీసుకున్న ఐఎస్ఐఎస్ ఇక్కడ కఠినమైన ఇస్లామిక్ షరియా చట్టాన్ని అమలుచేస్తున్నది. ధ్వంసమవుతున్న ప్రాచీన పాల్మిరా నగరం ప్రస్తుతం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అధీనంలో ఉన్న పాల్మిరా నగరం అత్యంత ప్రాచీనమైనది. ఈశాన్య డామస్కస్కు సమీపంలోని ఈ నగరంలో ఎన్నో అందమైన ప్రాచీన కట్టడాలు ఉన్నాయి. వీటి కారణంగా ఈ నగరాన్ని 'ఎడారి పెళ్లి కూతురు'గా పిలుస్తారు. ఒకప్పుడు ఈ నగరం మీదుగా పర్షియా, ఇండియా, చైనా, రోమన్ సామ్రాజ్యానికి వాణిజ్య మార్గం ఉండేది. నగరానికే వన్నె తెచ్చెలా ఇక్కడ 'ఆర్క్ ఆఫ్ ట్రయంఫ్' పేరిట పెద్ద ప్రాకార నిర్మాణం ఉంది. ప్రపంచంలోని ప్రాచీన నగరాలలో ఒకటిగా పేరొందిన ఈ నగరానికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపునిచ్చింది. ఈ ఏడాది మే 20న ఈ నగరాన్ని సిరియా భద్రతాదళాల చేతుల్లో నుంచి తమ అధీనంలోకి తీసుకున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు.. ఇక్కడున్న ప్రాచీన కట్టడాలను పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడున్న పురాతత్వశాస్త్ర నిపుణులను ఉగ్రవాదులు తలనరికి చంపేశారు. అంతేకాకుండా గత ఆగస్టులో సాంస్కృతికంగా ప్రాధాన్యమున్న బెల్, బాల్షామిన్ ఆలయాలను నేలమట్టం చేశారు. ఇలా ప్రాచీన సంపదను ధ్వంసం చేయడంపై ప్రపంచవ్యాప్తంగా నిరసన, ఆగ్రహం వ్యక్తమయ్యాయి. ప్రాచీన కట్టడాలను నామరూపాలు లేకుండా చేస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల తీరుపై పురాతత్వ, చరిత్ర పరిశోధకు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement