breaking news
British indian MP
-
బ్రిటన్ మంత్రిగా ప్రవాస భారతీయురాలు
లండన్: బ్రిటన్ మంత్రిగా ప్రవాస భారతీయురాలు ప్రీతి పటేల్ నియమితులయ్యారు. ప్రధాని డేవిడ్ కామెరూన్ కేబినెట్లో ప్రీతి ఉపాధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన బ్రిటన్ ఎన్నికల్లో కామెరూన్ సారథ్యంలోని కన్సెర్వేటీవ్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కామెరూన్ రెండో సారి ప్రధానిగా ప్రమాణం చేశారు. 43 ఏళ్ల ప్రీతి విథమ్ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించింది. ఆమె తొలిసారి 2010లో బ్రిటన్ పార్లమెంట్కు ఎన్నికయిన ప్రీతి పలు పదవులు చేపట్టారు. బ్రిటన్, భారత్ మైత్రికి గట్టి మద్దతుదారు. వరుసగా రెండో సారి ఎంపీగా ఎన్నికై కేబినెట్ బెర్తు సంపాదించారు. -
బీబీసీలో మోడీకిచ్చే కవరేజి ఇదేనా?
భారత ప్రధాని నరేంద్రమోడీని బీబీసీ అస్సలు పట్టించుకోలేదా? ఆయన భారీ మెజారిటీ సాధించిన రోజున.. అంటే ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు దాదాపు ప్రపంచమంతా మోడీవైపే చూస్తున్నా, బీబీసీ మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించిందా? సరిగ్గా ఇదే అంశంపై బ్రిటన్లో భారత సంతతి ఎంపీ ప్రీతి పటేల్ ఘాటుగా విరుచుకుపడ్డారు. తీవ్ర స్థాయిలో తన అసంతృప్తిని వెళ్లగక్కుతూ బీబీసీ డైరెక్టర్ జనరల్ లార్డ్ టోనీ హాల్కు ఆమె లేఖ రాశారు. మే 16వ తేదీన భారత సార్వత్రిక ఎన్నికల ఫలితాలను బీబీసీ సరిగ్గా ఇవ్వలేదని బ్రిటన్లో భారత జాతీయులు, ముఖ్యంగా గుజరాతీలు చాలామంది తనకు ఫిర్యాదు చేశారని ఆమె అన్నారు. అంతేకాదు.. ఈ ఫలితాలను టీవీలో ప్రజెంట్ చేసిన యాల్దా హకీమ్ అయితే.. మోడీని వివాదాస్పద వ్యక్తిగా అభివర్ణించారని కూడా ఆమె మండిపడ్డారు. కేవలం ఆయన రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే మోడీని అలా అంటారని, ఈ మాట ఉపయోగించడం ద్వారా బీబీసీ నిష్పాక్షికతను వదిలేసి ఆయన రాజకీయ ప్రత్యర్థి పాత్రలోకి మారిపోయినట్లయిందని ప్రీతి పటేల్ అన్నారు.