breaking news
Branch Less banking centers
-
బ్రాంచ్ లేని బ్యాంక్ అకౌంట్లు..
దేశంలో బ్యాంకింగ్ రంగం వేగంగా డిజిటల్ వైపు అడుగులు వేస్తోంది. బ్యాంక్ బ్రాంచ్కు వెళ్లకుండానే, పూర్తిగా ఆన్లైన్ ద్వారా ఖాతా తెరవగలిగే డిజిటల్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు ఇప్పుడు విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఆధార్, పాన్ కార్డులు ఉంటే చాలు వీడియో-కేవైసీ సహాయంతో ఇంటి నుంచే ఖాతా ప్రారంభించే సౌకర్యాన్ని పలు బ్యాంకులు కల్పిస్తున్నాయి.ఏయే బ్యాంకులు అందిస్తున్నాయంటే..ప్రైవేట్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఈ డిజిటల్ సేవలను ప్రధానంగా అందిస్తున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ తన కొటక్ 811 డిజిటల్ సేవింగ్స్ ఖాతా ద్వారా జీరో బ్యాలెన్స్ సౌకర్యాన్ని అందిస్తోంది. అలాగే యాక్సిస్ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి బ్యాంకులు కూడా పేపర్లెస్, బ్రాంచ్లెస్ ఖాతాలను అందుబాటులోకి తెచ్చాయి.ఇదే విధంగా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి బ్యాంకులు మొబైల్ యాప్ ఆధారంగా డిజిటల్ ఖాతా ప్రారంభించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ ఖాతాల ద్వారా యూపీఐ, ఐఎంపీఎస్, నెఫ్ట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వర్చువల్ డెబిట్ కార్డ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటున్నాయి.అంతేకాకుండా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వంటి పేమెంట్స్ బ్యాంకులు కూడా డిజిటల్ సేవింగ్స్ ఖాతాలను అందిస్తున్నాయి. అయితే వీటిపై డిపాజిట్ పరిమితులు ఉండటంతో, వీటిని సంప్రదాయ బ్యాంక్ ఖాతాలకు పూర్తి ప్రత్యామ్నాయంగా పరిగణించలేము.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్ (BSBDA)కు డిజిటల్ సదుపాయాలను ప్రోత్సహిస్తూ, ఆర్థిక చేరికను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది.డిజిటల్ బ్యాంకింగ్ వల్ల గ్రామీణ ప్రాంతాలు, యువత, ఉద్యోగుల్లో బ్యాంకింగ్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఆన్లైన్ మోసాల పట్ల కూడా కస్టమర్లు జాగ్రత్తలు వహించాచాలని బ్యాంకులు సూచిస్తున్నాయి. -
బ్యాంకింగ్ @ ‘స్వయం’ సంఘాలు
చిత్తూరు (అగ్రికల్చర్): స్వయం సహా యక సంఘాల(ఎస్హెచ్జీ) మహిళల ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో బ్రాం చ్లెస్ బ్యాంకింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాలను ‘వన్ స్టాప్ షాప్’ పేరుతో ఆయా గ్రామాలకు చెందిన ఎస్హెచ్జీల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. కేంద్రాల కార్యకలాపాలను వరల్డ్ బ్యాంకు సహకారంతో ఆంధ్రప్రదేశ్ రూరల్ ఇన్క్లూజివ్ గ్రోత్ ప్రాజెక్ట్ కింద స్త్రీనిధి బ్యాంకు ఆధీనంలో బ్రాంచ్లెస్ బ్యాంకింగ్గా నడుపనున్నారు. జిల్లాలో మొదటి విడతగా 12 మండలాల్లో ఏర్పాటుకు చర్యలుతీసుకోవాలని సెర్ఫ్నుంచి డీఆర్డీఏ కార్యాలయానికి ఆదేశాలు అందాయి. వన్స్టాప్ షాప్లద్వారా బ్యాంకు లావాదేవీలు, ఇన్సూరెన్స్, ఉపాధికూలీల పేమెంట్ , సా మాజిక పింఛన్లపంపిణీ తదితరసేవలను నిర్వహిస్తారు. కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న వన్ స్టాప్ షాప్లను పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు డీఆర్డీఏ, స్త్రీనిధి అధికారులు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. జనాభా ప్రాతికపదికన 1500 మందికి ఒకటి చొప్పున వీటిని ఏర్పాటు చేయనున్నారు. కేంద్రాలను పూర్తిగా మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే నిర్వహించేందుకు కస్టమర్ సర్వీస్ కమిటీల సభ్యులుగా మహిళలను నియమిస్తారు. ఆయా గ్రామ సమాఖ్యలు కస్టమర్ సర్వీస్ పాయింట్లుగా, సంఘాల్లోని మహిళలు విలేజ్ లెవల్ ఎంటర్ప్రైజర్లుగా కేంద్రాలను నిర్వహించే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. అనువైన ప్రదేశాలను గుర్తించి జనవరి రెండో వారంలో సెర్ఫ్ అధికారులకు పంపించనున్నారు. మొదటి విడత ఏర్పాటుచేయనున్న మండలాలు ఇవే వన్ స్టాప్ షాప్ల పేరుతో నిర్వహించనున్న బ్రాంచిలెస్ బ్యాంకింగ్ సేవల కేంద్రాలను మొదటి విడతగా తవణంపల్లి, బంగారుపాళ్యం, బెరైడ్డిపల్లి, చౌడేపల్లి, పెద్దమండ్యం, తంబళ్లపల్లి, బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం, చిన్నగొట్టిగల్లు, కేవీ పల్లి, ములకలచెరువు, ఎర్రావారిపాళెం మండలాల్లో ఏర్పాటుకు ఆదేశాలు వచ్చాయి. బ్యాంకింగ్ సేవలు చేరువ చేయడానికి.. గ్రామీణ ప్రాంతంలోని సంఘాల మహిళలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువ చేయాలనే తలంపుతో ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ కేంద్రాల ద్వారా సంఘాల్లోని మహిళలకే కాకుండా సామాజిక పింఛనుదారులు, ఉపాధి కూలీలకు పేమెంట్లు, వికలాంగులకు సదరన్ సర్టిఫికెట్ల జారీ తదితర ప్రభుత్వ సేవలు కూడా అనుసంధానం చేయనున్నాం. మొదటి విడతగా 12 మండలాల్లో అనువైన ప్రదేశాల ఎంపిక ప్రక్రియను రెండు వారాల్లో పూర్తి చేసి జాబితాలను సెర్ఫ్కు పంపిస్తాం. -జి.వెంకటప్రకాష్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, స్త్రీనిధి బ్యాంక్


