breaking news
bramaravathi booklet
-
Bhuvaneshwari : కలలకు రెక్కల వెనక అసలు కథేంటీ.?
కుప్పంలో పోటీ చేయాలని భువనేశ్వరీ కలగన్నారు. నేరుగా కుప్పానికే వెళ్లి చంద్రబాబుకు విశ్రాంతి ఇవ్వాలని ప్రజలను కోరారు. ఇక్కడ నాకు పోటీ చేయాలని ఉందని, ఇది నా కల అని కూడా చెప్పుకొచ్చారు. ఆమె స్వప్నం ఎందుకు సాకారం కాలేదో.. అన్నది వేరే సంగతి కానీ.. ఇప్పుడు కలలకు రెక్కలంటూ మళ్లీ ప్రజల ముందుకొచ్చారు. చంద్రబాబు కోసం భువనేశ్వరి ప్రకటనలు చేశారా.? లేక చంద్రబాబే చేయించారా అన్నది పక్కనబెడితే.. భువనేశ్వరీకి తెలియాల్సిన కొన్ని విషయాలున్నాయి. అమ్మాయిల కలలకు రెక్కలు అన్న కాన్సెప్ట్ ఎలా ఉన్నా.. ఇప్పటివరకు మీరు చూపించిన భ్రమరావతి మహిళలందరికి పీడ కలలు మిగిల్చాయి. ఒక సారి 2014 లో చంద్రబాబు మహిళలకు చేసిన వాగ్దానాలు చూడండి. ఇందులో ఏ ఒకటి అయినా తీర్చాడా? అన్నది భువనేశ్వరీనే చెప్పాలి. చంద్రబాబు 2014-19లో మహిళలకు ఇచ్చిన హామీలు మహాలక్ష్మి పథకంలో భాగంగా పుట్టిన ప్రతి ఆడబిడ్డకు 25 వేలు డిపాజిట్ చేస్తా గర్భిణులకు రూ.10 వేలు ఇస్తాం ప్రతి పేద మహిళకు స్మార్ట్ఫోన్లు ఇస్తా ఏడాదికి ఒక కుటుంబానికి 12 గ్యాస్ సిలిండర్లు 100 సబ్సిడీతో ఇస్తా 14 వేళా కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ ఇవేవీ అమలు చేయలేక మ్యానిఫెస్టోను మాయం చేసిన ఘనత చంద్రబాబుది. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు భార్యగా మీది. ఇప్పుడు కొత్తగా మీరు వచ్చి మళ్లీ కాకమ్మ కథలు చెప్పడం బాగోలేదని ప్రజలంటున్నారు. ఏ పని చేయలేడనే చంద్రబాబును చిత్తుగా ఓడించిన ప్రజలు 23 సీట్లకు పరిమితం చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఈ 58 నెలల్లో వివిధ పథకాల ద్వారా (డీబీటీ, నాన్ డీబీటీ ) కింద కేవలం మహిళలకు అందించిన లబ్ధి అక్షరాల రూ.2 .78 లక్షల కోట్లు అందించారు. సంక్షేమ పథకాల ద్వారా జగన్ ప్రభుత్వం అందించిన తోడ్పాటుతో 18.38 లక్షల మంది మహిళలు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించి స్థిరమైన ఆదాయం పొందుతున్నారు. అందుకే భువనేశ్వరీ గారు, మళ్లీ కలలకు రెక్కలంటూ కాకమ్మ కబుర్లు చెప్పొద్దని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుప్పంలో పోటీ చేయాలని కల గంటున్నారు కదా.. మీ కలలకు రెక్కలు తెచ్చుకోండి. ధైర్యంగా నామినేషన్ వేయండి, చంద్రబాబు తప్పుకుంటారు. కల సాకారం అవుతుందా లేదా పక్కనబెట్టి కనీసం ప్రయత్నం చేశారన్న గౌరవం ఉంటుంది. -
'అమరావతి కాదు.. భ్రమరావతి'
* రాజధాని ముసుగులో జరుగుతున్న అక్రమాలపై విచారణకు సిద్ధమా? * సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ ఉండవల్లి సవాల్ సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నట్లుగా రాజధాని అమరావతి కాదని.. భ్రమరావతి అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అభివర్ణించారు. రాజధాని నిర్మాణం ముసుగులో సాగుతోన్న అక్రమాలు, అవినీతిపై ‘భ్రమరావతి’ పేరుతో రచించిన పుస్తకాన్ని ఆయన శనివారం హైదరాబాద్ ప్రెస్క్లబ్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. సింగపూర్ దేశాన్ని భూతల స్వర్గంగా, అవినీతి రహిత దేశంగా సీఎం చంద్రబాబు చెప్పడంలో వాస్తవం లేదన్నారు. వివిధ దేశాల్లో దోచుకున్న సొమ్మును దాచుకోవడానికి మాత్రమే సింగపూర్ స్వర్గధామమని చెప్పారు. యూని బ్యాంక్ను దోచేసిన సుకాన్టో టనాటోకూ అనే వ్యక్తితో పాటు పలువురికి సింగపూర్ ఆశ్రయమిచ్చిందని తెలిపారు. ప్రపంచంలోని ఏ దేశంలోనూ సింగపూర్ సంస్థలకు మంచి పేరు లేదని చెప్పారు. బ్రెజిల్ దేశాన్ని సంక్షోభంలోకి నెట్టిన ‘పెట్రోబార్స్ కుంభకోణం’లో సింగపూర్కు చెందిన సెంబ్ కార్ప్ పాత్రధారి అని ఆ దేశ విచారణ సంస్థలు తేల్చాయన్నారు. ఇప్పుడు ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధికి స్విస్ చాలెంజ్ పద్ధతిలో ప్రతిపాదనలిచ్చిన కన్సార్టియంలో సెంబ్ కార్ప్ కూడా ఉందన్నారు. సింగపూర్ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు ఉద్దేశించిన స్విస్ ఛాలెంజ్ను అమలు చేసేందుకు సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను కూడా చంద్రబాబు తుంగలో తొక్కారని విమర్శించారు. సీబీఐ విచారణ జరిపితే రాజధాని ముసుగులో జరుగుతున్న అక్రమాలు వెలుగులోకి వస్తాయన్నారు. అక్రమాలను ప్రశ్నించినా, కోర్టులకు వెళ్లిన వారిని అభివృద్ధి నిరోధకులుగా చిత్రీకరించడం చంద్రబాబు శైలి అని విమర్శించారు. రాజధాని ముసుగులో సాగుతోన్న అక్రమాలపై చర్చకు సిద్ధమా అని సీఎం చంద్రబాబుకు ఉండవల్లి సవాల్ విసిరారు. -
'అమరావతి.. భ్రమరావతిలా కనిపిస్తోంది.'