breaking news
Boya RAMANJANEYULU
-
‘బాబూ పరిటాల శ్రీరామ్.. మా నాన్న ఇన్ని రోజులకు గుర్తుకొచ్చాడా?’
రాప్తాడు రూరల్: ‘బాబూ శ్రీరామ్.. మా నాన్న ఇన్ని రోజులకు గుర్తుకొచ్చాడా?’ అని పరిటాల శ్రీరామ్ను కనగానపల్లి మండలం తగరకుంట గ్రామానికి చెందిన బోయ రామాంజనేయులు కూతురు రామాంజనమ్మ ప్రశ్నించారు. పరిటాల శ్రీరాములుకు కుడి భుజంగా ఉన్న తన తండ్రి బోయ రామాంజనేయులు అప్పట్లో పరిటాల శ్రీరాములుతో పాటు హత్యకు గురైన వైనాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. మంగళవారం తాను మాట్లాడిన వీడియో సందేశాన్ని ఆమె పత్రికలకు విడుదల చేశారు. సందేశంలోని అంశం ఆమె మాటల్లోనే... ‘మీ నాన్న పరిటాల రవీంద్ర, మీ అమ్మ పరిటాల సునీత మంత్రులుగా పని చేసిన సమయంలో తగరకుంట రామాంజనేయులు కుటుంబం మీకు గుర్తుకు రాలేదా? మీ తాత పరిటాల శ్రీరాములు కోసం మా నాన్న బోయ రామాంజనేయులు 1975లో ప్రాణాలిచ్చాడు. బాబూ శ్రీరామ్... మీ తాత కోసం మానాన్న ప్రాణాలిచ్చాడని ఈ రోజు గుర్తించావా? ఇన్నేళ్లలో ఈ మాట ఎప్పుడైనా చెప్పావా? ఏ రోజైనా మా గురించి ఆలోచించావా? మమ్మల్ని పకలరించావా? మాకేమైనా సాయం చేశావా? మా నాన్న చనిపోయినప్పుడు నేను అమ్మ కడుపులో ఉన్నా. నాకు జన్మనిచ్చిన తర్వాత మా అమ్మ ఎన్ని కష్టాలు ఎదుర్కొందో మాకు తెలుసు. ఈ రోజు మీ స్థాయి ఎలా ఉందో... మాస్థాయి ఎలా ఉందో ఆలోచించు. మమ్మల్ని గుర్తించింది ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఒక్కరే. ఆయన ఎంతో సాయమందించారు. భూమి ఇప్పించారు. బోరు వేయించారు. ఈ రోజు ప్రకా‹Ùరెడ్డి అన్న రూ. 500 కోట్లు సంపాదించాడని అంటున్నావు. మీ తాత ఉన్నప్పుడు మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉందో జనాలకు తెలుసు. నువ్వు అక్రమంగా ఎంత సంపాదించావో, ప్రకాశ్రెడ్డి ఎంత సంపాదించారో ప్రజలకు తెలుసు. మీ నాన్న, మీ అమ్మ మంత్రులుగా పని చేశారు. బోయ కులస్తులను గుర్తించి ఏ ఒక్క పదవైనా ఇచ్చారా? తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి బోయ కులస్తులను గుర్తించి అనేక పదవులు ఇచ్చి ప్రాధాన్యత ఇస్తున్నారు. మీ సొంత మండలం రామగిరిలో బోయ కులస్తులకు మీరు ఎన్ని పదవులు ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎంతమందిని బెదిరించి ఎంత సంపాదించావో అందరికీ తెలుసు. మీ అవినీతి అంతా ప్రజలకు తెలుసు’ అని స్పష్టం చేశారు. -
సర్పం..భయం
పాములు పగబట్టి కాటేయడం సినిమాల్లో చూస్తుంటాం. నిజంగా అవి అలా చేస్తాయా అనేందుకు శాస్త్రీయంగా ఆధారాలు లేవు. అయితే పల్లెల్లో కాకతాళీయంగా జరిగే సంఘటనలు ఇలాంటివే అని నమ్మేవారు చాలా మంది ఉంటారు. డోన్ మండల పరిధిలోని మల్లెంపల్లె గ్రామంలో అదే జరిగింది. ఈ గ్రామంలో 19 మంది పాము కాటుకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున కూడా ఏడేళ్ల బాలుడ్ని పాము కాటేసింది. దీంతో తొలగించిన నాగుల కట్టను పునరుద్ధరించే పనుల్లో నిమగ్నమయ్యారు ఆ ఊరి ప్రజలు. మల్లెంపల్లె (డోన్ రూరల్) : డోన్ మండలం మల్లెంపల్లె గ్రామంలో సిమెంటు రోడ్డు నిర్మాణం కోసం ఈ నెల 18వ తేదీన నాగుల చవితి రోజున నాగుల కట్టను తొలగించారు. అయితే నాగులకట్టను తొలగించిన మరుసటి రోజే గ్రామానికి చెందిన బోయ రామాంజనేయులును పాము కాటేసింది. పాము కాటుతో రామాంజనేయులు కోలుకున్నప్పటికీ, ఆ మరుసటి రోజే చిన్న మద్దిలేటిని కూడా పాము కాటేసింది. గమనించిన బంధువులు అతనిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా కోలుకోలేక మృతి చెందాడు. దీంతో గ్రామస్తుల్లో ఒకింత ఆందోళనలో నెలకొంది. నాగులకట్టను తొలగించిన రోజు నుంచి వరుసగా పాముకాట్లు చోటు చేసుకుంటుండడంతో గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు రావాలన్నా, పొలంలో పనులు చేయాలన్న భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటి వరకు గ్రామంలో 19 మంది పాము కాటుకు గురవగా.. మూడు నాగుపాములను, ఒక రక్తపింజరిని చంపేశారు. ఆదివారం తెల్లవారుజామున కూడా ఏడేళ్ల బాలుడు రంజిత్ కూడా పాముకాటుకు గురయ్యాడు. దీంతో గ్రామస్తులు నాగులకట్ట పునర్నిర్మాణానికి సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా.. విషపూరితమైన పాము కాటుకు వైద్యం అందుబాటులో లేకపోవడంతో గ్రామస్తులకు నాటువైద్యులు ఇచ్చే ఆకుపసురే శరణ్యమవుతోంది. అధికారులు స్పందించి గ్రామస్తులకు పాముకాటు వైద్యాన్ని అందుబాటులో ఉంచాల్సి ఉంది. అలాగే పాముల గ్రామంలోకి రాకుండా చర్యలు తీసుకోవాలి. పాములపై గ్రామస్తుల్లో అవగాహన కల్పించాల్సి ఉంది. పొలం పనులు చేస్తుండగా ఈ నెల 29వ తేదీ సాయంత్రం పొలం పనులు చేస్తుండగా పక్కనే ఉన్న నాగుపాము చేయికి కాటేసింది. దీన్ని గమనించిన బంధువులు పక్క గ్రామమైన లక్ష్ముంపల్లెకు ఆమెను తీసుకెళ్లి ఆకు పసురు తాపించారు. - బోయ లింగమ్మ, గ్రామస్తురాలు సేద్యం పని చేస్తుండగా పొలంలో సేద్యం పనులు చేస్తుండగా ఈ నెల 24వ తేదీ పాము కాటు వేసింది. దీంతో లక్షుంపల్లెకు వెళ్లి ఆకు పసరు తీసుకున్నాను. 12 రోజులుగా ఏక్షణంలో ఎవరిని పాములు కాటేస్తాయోనని భయం గుప్పిట్లో జీవిస్తున్నాం. - కె.మాధవరావు, గ్రామస్తుడు గతంలో ఇలాంటివి జరగలేదు గతంలో ఏడాదికి ఒకటి లేదా రెండు పాములు మాత్రమే కాటేసివి. ఇలా వరుసగా పాములు కాట్లు వేయడం మేమన్నడూ చూడలేదు. - రామచంద్రుడు