breaking news
boxer mary kom
-
కల చెదిరింది
మేరీకోమ్ ‘రియో’ ఆశలు ఆవిరి! అస్తానా (కజకిస్థాన్): వరుసగా రెండోసారి ఒలింపిక్స్లో బరిలోకి దిగాలని ఆశించిన భారత మహిళా మేటి బాక్సర్ మేరీకోమ్కు నిరాశ ఎదురైంది. ‘రియో’కు చివరి అర్హత టోర్నమెంట్ అయిన ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో మేరీకోమ్ పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. శనివారం జరిగిన 51 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో మేరీకోమ్ 0-2తో అజిజి నిమాని (జర్మనీ) చేతిలో ఓడిపోయింది. ఈ పోటీల్లో సెమీఫైనల్ చేరుకున్న వారికి మాత్రమే ‘రియో’ బెర్త్ ఖాయమవుతుంది. ఈ ఓటమితో ‘రియో’లో పాల్గొనే అవకాశం మేరీకోమ్ చేతుల్లో లేకుండా పోయింది. ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా ఇప్పటికే ‘రియో’కు అర్హత సాధించిన రెన్ కాన్కాన్ (చైనా), లిన్ యు టింగ్ (చైనీస్ తైపీ) గనుక ఈ పోటీల్లో పతకాలు సాధిస్తేనే మేరీకోమ్కు ఒలింపిక్స్లో బరిలో దిగే ఆశలు సజీవంగా ఉంటాయి. మరోవైపు 60 కేజీల విభాగంలో భారత్కే చెందిన లైష్రామ్ సరితా దేవి కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్ర్కమించింది. సరిత 0-3తో విక్టోరియా టోరెస్ (మెక్సికో) చేతిలో ఓడిపోయి రియో ఒలింపిక్స్ అర్హత అవకాశాలను కోల్పోయింది. -
ఒలింపిక్స్ తర్వాత గుడ్బై
బాక్సర్ మేరీకోమ్ న్యూఢిల్లీ: వచ్చే ఏడాది రియో డి జనీరోలో జరిగే ఒలింపిక్స్ అనంతరం ప్రఖ్యాత బాక్సర్ మేరీ కోమ్ తన కెరీర్కు గుడ్బై చెప్పనుంది. 32 ఏళ్ల ఈ మణిపూర్ క్రీడాకారిణి కొన్ని రోజులుగా ఈ విషయంపై ఆలోచిస్తున్నా తాజాగా అధికారికంగా ప్రకటించింది. '2016 ఒలింపిక్స్ తర్వాత బాక్సింగ్కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను. అవే నా చివరి పోటీలు. ఆ తర్వాత ఇక ఏ టోర్నీలోనూ నేను పాల్గొనదలుచుకోలేదు. నా మూడో కుమారుడికి ఇప్పుడు రెండేళ్లు. ఇక బాక్సింగ్ చాలనిపిస్తోంది. ముగ్గురు సంతానం కలిగాక కూడా హోరాహోరీగా సాగే బౌట్లో ఎవరు పాల్గొంటారు? రియోలో స్వర్ణం సాధించి దేశ ప్రజలకు సంతోషం కలిగించాలని కోరుకుం టున్నాను. అందుకే ఒలింపిక్స్ వరకు కొనసాగుతా. రిటైరయ్యాక ఇంఫాల్లోని నా అకాడమీపైనే పూర్తిగా దృష్టి పెడతా. దీన్ని ప్రధాని మోదీతో ప్రారంభింపజేస్తాను’ అని మేరీ కోమ్ తెలిపింది. -
బాక్సర్గా మారిన మిస్ వరల్డ్