-
కనీస ప్రైస్బ్యాండ్పై సెబీ ప్రతిపాదన
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ బుక్బిల్ట్ విధానంలో పబ్లిక్ ఇష్యూలకు కనీసం 5 శాతం ప్రైస్బ్యాండ్(ధరల శ్రేణి)ను ప్రతిపాదించింది. అంతేకాకుండా నాన్ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల(ఎన్ఐఐలు)ను సబ్కేటగిరీలోకి చేర్చే యోచనలో ఉన్నట్లు పేర్కొంది. ఈ అంశాలతోపాటు బుక్ బిల్డింగ్ మార్గదర్శకాలపై ప్రతిపాదనలు, వ్యాఖ్యానాలను ఆహ్వానించింది. 2021 అక్టోబర్ 20కల్లా వీటిని దాఖలు చేయవలసిందిగా సూచించింది. ఇటీవల పలు కంపెనీలు ఐపీవోల ధరల శ్రేణిలో కనిష్ట, గరిష్టాలను అతితక్కువగా నిర్ణయిస్తున్న నేపథ్యంలో సెబీ తాజా ప్రతిపాదనలు తీసుకువచ్చింది. పలు అంశాలలో ప్రైమరీ మార్కెట్ సలహా కమిటీ పలు అభ్యంతరాలను లేవనెత్తినట్లు తెలుస్తోంది. ధరల నిర్ణయంలో పారదర్శక, నిజాయితీ విధానాల అమలు కనుమరుగవుతున్నట్లు అభిప్రాయపడినట్లు సెబీ పేర్కొంది. దీంతో బుక్ బిల్ట్ విధానంలో కనీసం 5 శాతం ప్రైస్బ్యాండ్ వ్యత్యాసాన్ని ప్రతిపాదించింది. ఎన్ఐఐలు ఇలా.. ఎన్ఐఐల విభాగంలో కొన్ని అతిపెద్ద సంస్థల నుంచే భారీ అప్లికేషన్లు దాఖలుకావడం ద్వారా రిస్కులు ఎదురవుతున్నట్లు సెబీ పేర్కొంది. 2018 జనవరి– 2021 ఏప్రిల్ మధ్య కాలంలో అత్యధిక స్పందన లభించిన ఐపీవోలను సెబీ విశ్లేషించింది. 29 పబ్లిక్ ఇష్యూలలో సగటున 60 శాతం ఎన్ఐఐలకు షేర్ల కేటాయింపు జరగనట్లు గుర్తించింది. ఏ ఐపీవోలోనైనా అందరికీ అవకాశాలు కల్పించాలని భావిస్తున్నట్లు సెబీ తెలియజేసింది. దీంతో రిటైల్, నాన్ఇన్స్టిట్యూషనల్ స్థాయిలో సమాన కేటాయింపులవైపు దృష్టిసారించినట్లు వెల్లడించింది. వెరసి ఎన్ఐఐలను రెండు కేటగిరీలుగా విభజించేందుకు ప్రతిపాదించింది. తొలి విభాగంలో రూ. 2–10 లక్షల మధ్య ఎన్ఐఐలకు మూడోవంతు కేటాయింపు ఉంటుంది. రెండో కేటగిరీలో రూ. 10 లక్షలకుపైన మూడోవంతు షేర్లకు వీలుంటుంది. చదవండి : కోటీశ్వరులయ్యే మంత్రం చెప్పిన బాబా రామ్దేవ్.. సెబీ సీరియస్ -
నేటి నుంచే పవర్మెక్ ఇష్యూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బుక్ బిల్డింగ్ పద్థతిలో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న పవర్మెక్ యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా రూ. 82 కోట్లు సమీకరించింది. మొత్తం ఈ ఇష్యూ ద్వారా 42.69 లక్షల షేర్లు జారీ చేస్తుండగా అందులో 12.80 లక్షల షేర్లను యాంకర్ ఇన్వెస్టర్లైన వివిధ మ్యూచువల ఫండ్ సంస్థలకు కేటాయించింది. ఇష్యూ ప్రైస్ బాండ్ను రూ. 615 - 640గా నిర్ణయించగా యాంకర్ ఇన్వెస్టర్లకు రూ. 640 చొప్పున ఈ కేటాయింపులు చేసినట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ వాటాలో ఐడీఎఫ్సీ ప్రీమియర్ ఈక్విటీ ఫండ్ అత్యధికంగా ఇన్వెస్ట్ చేయగా, ఆ తర్వాతి స్థానాల్లో డీఎస్పీ బ్లాక్రాక్ టైగర్ ఫండ్, ఎస్బీఐ స్మాల్ అండ్ మిడ్క్యాప్ ఫండ్స్ ఉన్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement