breaking news
bommarillu finance
-
బొమ్మరిల్లు కార్యాలయాలపై దాడులు
నమ్మించి డిపాజిట్దారులకు కుచ్చుటోపీ పెట్టిన బొమ్మరిల్లు సంస్థ కార్యాలయూలపై పోలీస్, రెవెన్యూ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పలు కార్యాలయూల్లోని రికార్డులను శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. సంస్థ ఆస్తులపై ఆరా తీస్తున్నారు. బాధితుల ఫిర్యాదుల మేరకు అన్నికోణాల్లోను దర్యాప్తు ముమ్మరం చేశారు. నందిగాం, న్యూస్లైన్: మండలంలోని బొమ్మరిల్లు సంస్థ ఆస్తులు, రికార్డులను విజలెన్స్ ఎండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీపీ ఇసాక్మహమ్మద్ నేతృత్వంలోని బృందం స్వాధీనం చేసుకుంది. కవిటిఅగ్రహారం సమీపంలోని బెండికొండకు ఆనుకొని సుమారు 19 ఎకరాల్లో బొమ్మరిల్లు సంస్థ వేసిన వెంచర్లను తనిఖీ చేసింది. తహశీల్దార్ పిడుగు వెంకటేశ్వర రావుతో చర్చించి పలు రికార్డులను పరిశీలించింది. ఈ సందర్భంగా ఇసాక్మహ్మద్ విలేకరులతో మాట్లాడుతూ ఆర్బీఐ నిబంధనల మేరకు సంస్థ నడిపి సుమారు రూ.100 కోట్లను ప్రజల నుంచి సేకరించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. జిల్లాలో కంచిలి మండలం డోలగోవిం దపు రం, సీతంపేట మండలం పులిపుట్టి గ్రామాల సమీపంలో కూడా సంస్థ ఆస్తులున్నాయన్నారు. పోలీస్ కమిషనర్ ఆదే శాల మేరకు దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు. ఆయన వెంట సీఐలు ఇమాన్యువల్రాజ్, కొండా ఉన్నారు. ఆందోళనలో స్థల కొనుగోలుదారులు కవిటిఅగ్రహారం సమీపంలోని బెండికొండకు ఆనుకుని సర్వే నెంబరు 174లో సుమారు 19.86 ఎకరాల్లో అన్నిహం గులతో వెంచర్లు వేశారు. సుమారు 400 ఇళ్ల స్థలాలుగా విభజించి ఒక్కోదానిని రూ. 1.20 లక్షల చొప్పున అమ్మకం చేశారు. పంట పొలాలను వాణిజ్య భూములుగా మార్చేందుకు వీరు రెవెన్యూ శాఖకు రూ. 4.90 లక్షలు చలానా రూపంలో చెల్లించినట్లు తెలిసింది. స్థలాలను కవిటిఅగ్రహారం గ్రామస్తులతో పాటు వజ్రపుకొత్తూరు మం డలం మంచినీళ్లపేట, కంబాలరాయడుపేట, అమలపాడు, పూండి, బెండి తదితర ప్రాంతాల వారు అధికంగా కొనుగోలు చేశారు. వీరంతా లబోదిబోమంటున్నారు. కార్యాలయం సీజ్ టెక్కలి: టెక్కలి బొమ్మరిల్లు కార్యాలయంపై రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్తంగా దాడి చేశారు. తహశీల్దార్ ఆర్.అప్పలరాజు, సీఐ ఎమ్.రాంబాబు, ఎస్ఐ జి.శంక రరావుల ఆధ్వర్యంలో బొమ్మరిల్లు సిబ్బంది సమక్షంలో కార్యాలయం తాళాలను పగులగొట్టారు. బొమ్మరిల్లు టెక్కలి బ్రాంచ్లో పనిచేసిన బ్రాంచ్ మేనేజర్ పి.కృష్ణారావు, డేటా ఆపరేటర్లు త్రివేణి, రాము తదితరుల నుంచి కార్యాల యంలో కీలకమైన రికార్డులను సేకరించారు. సుమారు 35 రికార్డులు, 6 కంప్యూటర్ సీపీయూలు, 5 మోనిటర్లను స్వాధీనం చేసుకుని కార్యాలయాన్ని సీజ్ చేశారు. అధికారుల సోదాల్లో కేవలం 527 రూపాయల మిగులు నగదు దొరికింది. బ్రాంచి పరిధిలో సుమారు 13,316 మంది ఖాతాదారులు సుమారు రూ.5 కోట్లను పొదుపు చేసినట్టు ప్రాథమిక సమాచారం. సంస్థ నుంచి సుమారు 21 లక్షలు నష్టపోరుునట్టు ఇప్పటివరకు 25 ఫిర్యాదులు అందాయని ఎస్ఐ శంకరరావు తెలిపారు. కేంద్రమంత్రిని కలసిన బాధితులు బొమ్మరిల్లు సంస్థ నుంచి మోసపోయిన ఖాతాదారులు, ఏజంట్లు టెక్కలిలో గల కేంద్రమంత్రి కిల్లి కృపారాణిని తన నివాసంలో కలసి గోడు వినిపించారు. ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. లబోదిబోమంటున్న బాధితులు నరసన్నపేట: బొమ్మరిల్లు సంస్థ బోర్డు తిరగేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. నరసన్నపేట పరిధిలో సుమారు *3 కోట్లకు పైగా ప్రజలు డిపాజిట్ చేశారు. వీరంతా స్థానిక కార్యాలయం వద్దకు చేరుకుని శుక్రవారం ఆందోళనకు దిగారు. పోలీసులు చొరవచూపి బాధితులకు నరర్యాయం చేయూలని కోరారు. వెలుగు చూస్తున్న అక్రమాలు జలుమూరు: మండలంలోని జోనంకి, సుబ్రమణ్యపురం, హుస్సేన్ పురం, తమ్మయ్యపేట, తమ్మయ్యపేట కాలనీ, జలుమూరు, కొమనాపల్లి, శ్రీముఖలింగం, అల్లాడతో పాటు మరో ఐదు గ్రామాలకు చెందిన ఖాతాదారులు రూ.1.50 కోట్లకు పైగా బొమ్మరిల్లు సంస్థలో డిపాజిట్ చేశారు. ఆయా గ్రామాల్లో సుమారు 50 మంది ఏజెంట్ల ద్వారా సొమ్ము పొదుపు చేశామని బాధితులు కె.మోహన రావు, బి.విశ్వనాథం, బి.అప్పన్న, టి.వెంకటరత్నం, బి.కనకమ్మలు తెలిపారు. అందర మూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రూ.12 లక్షలు డిపాజిట్ చేయి ంచా బొమ్మరిల్లు కార్యాలయం ఏర్పాటు చేసిన తరువాత ఏజెంట్గా చేరి ప్రజల నుంచి రూ.12 లక్షలు డిపాజిట్ చేరుుంచాను. డిపాజిట్ దారులందరూ పేద, మధ్యతరగతి కుటుంబాల వారే. సంస్థ ఆస్తులు సీజ్ చేసి బాధితులకు న్యాయం చేయూలి. -మెండ చిన్నికృష్ణ, ఏజెంట్, శివనగర్కాలనీ రోజుకు రూ.50 చొప్పున చెల్లించా పొదుపు చేయడం ద్వారా కాస్తంత డబ్బు లు కనిపిస్తాయన్న ఆశతో కూలిచేసిన డబ్బులు రోజుకు *50 చొప్పున చెల్లించా. గత 8 నెలలుగా చెల్లిస్తున్నాను. డబ్బులు వస్తాయన్న సమయంలో సంస్థ ఎత్తేశారు. డబ్బులు ఎవరిని అడగాలో తెలియడంలేదు. -రేగిపాడు విజయ, బాధితురాలు, నరసన్నపేట 16న తెరుస్తామన్నారు.. పండుగ ముందు బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసర్రావును కలిశాం. పండుగ సెలవులు అనంతరం 16న కార్యాలయం తెరుస్తామని మరి కనిపించలేదు. ఫోన్లు చేస్తున్నా పనిచేయడం లేదు. -అల్లు సింహాచలం, బాధితుడు, నక్కవీధి -
‘బొమ్మరిల్లు’ డైరెక్టర్ల అరెస్ట్
రూ.30 కోట్ల ఆస్తుల గుర్తింపు.. 300ఎకరాల భూముల డాక్యుమెంట్లు స్వాధీనం పరారీలో కీలక నిందితుడు ఆర్ఆర్ రాజా.. సాక్షి, విశాఖపట్నం/ అల్లిపురం న్యూస్లైన్: బొమ్మరిల్లు ఫైనాన్స్, రియల్ఎస్టేట్ సంస్థకు చెందిన నలుగురు డెరైక్టర్లు, ఒక మానవవనరుల మేనేజర్ను విశాఖపట్నం సెంట్రల్ క్రైం పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వీరి ద్వారా రూ. 30 కోట్ల విలువచేసే ఆస్తులను గుర్తించారు. వివిధ జిల్లాల్లో 300 ఎకరాల ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లు, విశాఖ పీఎం పాలెంలో రూ.కోటి ఖరీదు చేసే పచ్చళ్ల ఫ్యాక్టరీ మిషనరీ, రూ.20 వేల నగదు, పలు బంగారు ఆభరణాలు, ఐదు ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. సంస్థకు కొత్తవలస, ఎస్.కోట, డెంకాడ, పలాస, కంచిలి, పాలకొండ, యాదగిరిగుట్ట, కోదాడ ప్రాంతాల్లో 300 ఎకరాల వరకు భూములు ఉన్నట్లు తేల్చారు. రూ. 100 కోట్ల వరకు వసూలు చేసిన సంస్థ ఇంకా ఖాతాదారులకు రూ.60 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని పోలీసులు గుర్తించారు. కరీంనగర్, మచిలీపట్నం, సామర్లకోట, శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, కాశిబుగ్గ ఒడిశాలోని బరంపురం తదితర ప్రాంతాల్లోనూ శాఖలు ప్రారంభించినప్పటికీ.. అక్కడి ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు అందలేదని పోలీసులు వెల్లడించారు. మోసానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే సంస్థకు ఇటీవలి వరకు చైర్మన్గా వ్యవహరించిన ఆర్ఆర్ రాజాను అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆయన కర్ణాటకలో ఉన్నాడన్న సమాచారం ఉందన్నారు. సంస్థకు చెందిన భూములను అటాచ్ చేసే ఆలోచనలో ఉన్నామని, ఈ దిశగా సంబంధిత సబ్ రిజిస్ట్రార్లకు లేఖలు రాస్తామన్నారు. మోసం ఇలా... పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రాయల రాజా(ఆర్ఆర్ రాజా), అతని భార్య స్వాతి రాజా, బావమరిది లక్ష్మీనారాయణలు బోర్డు ఆఫ్ డెరైక్టర్లుగా హైదరాబాద్లో రాజా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు. 2011 ఆగస్టులో బొమ్మరిల్లు పేరుతో విశాఖపట్నం కేంద్రంగా కార్యాలయం ప్రారంభించారు. దీంతోపాటు బొమ్మరిల్లు రియల్ ఎస్టేట్స్, బొమ్మరిల్లు ఫుడ్స్, బొమ్మరిల్లు కన్స్ట్రక్షన్స్, బొమ్మరిల్లు ఫిలింస్, బొమ్మరిల్లు ఫైనాన్స్ పేరిట కంపెనీలను ప్రారంభించారు. అప్పటినుంచి నిబంధనలకు విరుద్ధంగా పలు స్కీముల పేరుతో డిపాజిట్లు సేకరించారు. రోజువారీ, నెలవారీ, ఫిక్స్డ్ డిపాజిట్, రియల్ ఎస్టేట్ అవసరాలకోసం మూడు వేల మంది ఏజెంట్ల ద్వారా సుమారు 40వేల మంది నుంచి రూ.100 కోట్ల మేర డిపాజిట్లు సేకరించారు. అయితే కంపెనీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోవడంతో సంస్థ వ్యవస్థాపకుడు, చైర్మన్ ఆర్.ఆర్. రాజా రాజీనామా చేసి అప్పటికే డెరైక్టర్లుగా వ్యవహరిస్తున్న వానపల్లి వెంకటరావు, సావు శ్రీనివాసరావు, కమ్మెల బాపూజీ, గోవిందు యర్రయ్య, మానవవనరుల మేనేజర్ కాపుగుంట సత్యనారాయణలకు అప్పగించి వెళ్లిపోయాడు. దీంతో సంస్థ తీవ్ర కష్టాల్లో పడింది. టీడీపీలో క్రియాశీలకంగా.. ఆర్ఆర్ రాజా పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. దీనిని దృష్టిలో పెట్టుకుని గత పంచాయతీ ఎన్నికల్లో కొంత మంది టీడీపీకి చెందిన సర్పంచ్ల కోసం రూ.3 కోట్ల వరకు ఆయన ఖర్చు చేశారని తెలిసింది.