breaking news
Bodrai festival
-
గ్రామ రక్షకి బొడ్రాయి
గ్రామానికి ఆరు బయట ఉండే నిర్మాణమే బొడ్రాయి. దీనికి దేవాలయం లాంటి ఎలాంటి నిర్మాణం ఉండదు. గ్రామంలో అన్ని వర్ణాల వారూ స్వేచ్ఛగా పూజించుకొనే అవకాశం ఉంటుంది. గ్రామ ప్రజలందరూ కలిసి ఏడాదికి కనీసం ఒకసారైనా బొడ్రాయికి పూజలు, తిరునాళ్ళు జరిపిస్తూ సామూహిక వేడుకలు జరుపుకొంటారు. అయితే బొడ్రాయి అంటే ఏమిటో, ఆ బొడ్రాయికి పూజలు ఎందుకు జరుపుకోవాలో చాలామందికి తెలియకున్నా, పూజలు, తిరునాళ్లు వంటి కార్యక్రమాలను ఎంతో భక్తిశ్రద్ధలతో జరిపిస్తారు.ఈ నేపథ్యంలో బొడ్రాయిపై అవగాహన కోసం... మన గ్రామీణ సంస్కృతిలో బొడ్రాయికి ఉన్న ప్రాముఖ్యత ఎనలేనిది. బొడ్రాయి అసలు రూపం బొడ్డురాయి. సంస్కృతంలో దీనిని నాభిశిల అంటారు. మానవ శరీరానికి గర్భస్థ పిండ దశ నుండీ రక్షణ, పోషణ తల్లి నాభినుండి ఎలా లభిస్తాయో, గ్రామాని కి రక్షణ, పోషణ సమృద్ధులను ప్రసాదించే తల్లి గనుక ఆ శిలా మాతను బొడ్డురాయి అన్నారు. శరీర మధ్యంలో నాభి అమరి ఉన్నట్లు గ్రామానికి మధ్య లో బొడ్రాయిని స్థాపిస్తారు. గ్రామ నిర్మా ణం జరుగుతున్న దశలో వాస్తు ప్రకారం పండితులను సంప్రదించి నలు ది క్కులలో గ్రామం ఎలా విస్తరించాలో, అలాగే వాస్తు శాస్త్ర వర్గులను బట్టి కొత్తగా ఏర్పడే గ్రామంలో అన్ని సౌకర్యాలూ అంటే రహదారులు, కూడళ్ళు, బా వులు, చెరువులు, దేవాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, వ్యవసాయ భూములు, వ్యాపార సముదాయాలు, శ్మశాన వాటిక మొదలుగా అన్నిటికీ నిర్దిష్టమైన స్థల నిర్దేశం చేస్తారు. గ్రామ మధ్యంలో, నాలుగు రహదారులు కలిసే చోటులో బొడ్రాయిని ఏవిధంగా ప్రతిష్ఠించాలో కూడా ప్రణాళిక వేసుకొనేవారు.బొడ్రాయిని ప్రతిష్ఠించే ప్రదేశాన్ని గు ర్తించాక అక్కడ నేలను తవ్వి, శంకుస్థాపన చేసి, మొదట పరమేశ్వరుని అనుగ్రహ శక్తి అయిన శీతలా దేవి చక్రాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేసి అందులో స్థాపిస్తారు. దాని పైన నాలుగు పలకలు కలిగిన చతురస్రాకారపు నిర్మాణాన్ని, దానిపైన ఎనిమిది పలకలుగల నిర్మాణాన్ని, ఆ పై భాగాన లింగాకారం కలిగిన శిలను ప్రతిష్ఠిస్తారు.నాలుగు పలకల నిర్మాణం బ్రహ్మ స్వరూపమని, ఎనిమిది పలకల నిర్మాణం విష్ణు స్వరూపమని, ఆపైన ప్రతిష్ఠించిన లింగాకారపు శిలను శివ స్వరూపమని భావిస్తారు. ఇలా శీతలాదేవి యంత్రం స్త్రీ స్వరూపంగా, ఆ పైన ఉన్న త్రిమూర్త్యాత్మకమైన బొడ్రాయిని పురుష స్వరూపంగా భావిస్తారు. గ్రామానికి పొలిమేరలలో ఎనిమిది మంది అక్కమ్మ దేవతలు అనే స్త్రీ దేవతలకు సంబంధించిన యంత్రాలను కూడా స్థాపిస్తారు. అందువలన గ్రామానికి దుష్ట శక్తులు, చెడు గ్రహాలు, ఆధి వ్యాధుల పీడలు అంటవని విశ్వసిస్తారు.రహదారుల విస్తరణ సమయంలో కానీ, కాలక్రమేణా బొడ్రాయి రహదారికంటే చాలా దిగువకు కుంగినప్పు డు కానీ, దానిని శాస్త్రోక్తంగా వెలికితీసి పునః ప్రతిష్ఠ చేస్తారు. గ్రామం వాస్తు పురుషుని నాభి స్థానమే బొడ్రాయి. నేల అనే శయ్య పై ఆసీనుడైన బొడ్రాయి రూప పురుషునికి, మా ఇంట నిత్యమూ ధనధాన్య సమృద్ధి ఉండేలా ఆశీర్వదించమని కోరుతూ భక్తితో నమస్కరిస్తున్నాను అనే అర్థం వచ్చే శ్లోకం చదువుకొని బొడ్రాయిని ప్రార్థించుకోవాలన్నది పెద్దల మాట.నవ వధువులు ఊరిలోకి అడుగు పెట్టినప్పుడు, అలాగే ఊరి నుండి తమ అత్త వారింటికి వెళ్ళేటప్పడు.. తప్పకుండా తొలుత బొడ్రాయికి నమస్కరించి, పసుపు కుంకుమలు, పూలతో బొడ్రాయిని పూజించే సంప్రదాయం ఉంది. అలాగే ఇంటి ఆడ పిల్లలకు వడిబియ్యం పెట్టినప్పుడు బొడ్రాయి వద్ద నమస్కరించి ఆశీస్సులు కోరే ఆచారమూ ఉంది.– డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి -
మహబూబాబాద్: బొడ్రాయి పండుగలో అపశ్రుతి
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలోని కంబాలపల్లిలో బొడ్రాయి పండుగలో అపశ్రుతి చోటుచేసుకుంది. గ్రామ దేవతల ప్రతిష్టాపన సందర్భంగా గ్రామస్థులు బోనాలు నిర్వహించారు. బోనాలతో గ్రామస్థులు బొడ్రాయి వద్దకు చేరుకోగ.. బోనంపై ఉన్న దీపం పైన పందిరి గడ్డిని తగలగడంతో మంటలు చెలరేగాయి. దీంతో యాగశాల పూర్తిగా దగ్గమయ్యింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. ఎగిసిపడిన మంటలను గ్రామస్థులు బిందెలతో నీళ్లు చల్లి అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే గడ్డి, తడకల పందిరి పూర్తిగా దగ్ధమయ్యింది. భక్తులకు ఎలాంటి హాని జరగకపోవడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. బొడ్రాయి పండుగలో నరదృష్టి పోయిందని గ్రామస్థులు భావిస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చాక ఎంపీ మాలోతు కవిత ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బొడ్రాయి ప్రతిష్టాపన వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చదవండి: మృత్యు ఘంటికలు!.. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు -
బొడ్రాయి ప్రతిష్టాపన @ 5 కోట్లు!
గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మచ్చాపూర్ గ్రామంలో నాలుగు రోజులుగా జరిగిన బొడ్రాయి ప్రతిష్టాపన, వనభోజనాల కార్యక్రమంలో ఏకంగా రూ.5 కోట్ల మేర ఖర్చయిందనే విషయం చర్చనీయాంశమైంది. గ్రామ సర్పంచ్ బోడకుంట్ల ప్రకాశ్ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా గ్రామస్తులకు ఇచ్చిన మాట మేరకు సొంతంగా రూ.15 లక్షలు ఖర్చు చేశారని అంటున్నారు. అలాగే ప్రతీ ఇంటికి కొత్త బట్టలు, పూజ సామగ్రి, యాట పోతుల కొనుగోలు, వంటకాలు, బంధువులకు మర్యాదలు, భోజనాలు, విందు కోసం మందు, ఇలా ప్రతీ ఖర్చును లెక్కలోకి తీసుకుంటే సుమారు రూ. 5 కోట్ల మేర ఖర్చయిందని గ్రామస్తులు చెబుతున్నారు. -
పండుగ కోసం తిరిగి.. తిరిగిరానిలోకాలకు..
నల్లగొండ: బొడ్రాయి పండుగ తెచ్చిన తంటా ఇంతా అంతా కాదు.. అనారోగ్యంతో మృత్యువాత పడ్డ మృతదేహాన్ని బోనాలు పూర్తయ్యే వరకు గ్రామానికి తీసుకురావద్దని గ్రామస్తులు చెప్పడంతో ఒక కుటుంబం మొత్తం మృతదేహంతో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వద్ద సుమారు 14 గంటలకు పైగా రోదిస్తూ నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్తే అరిష్టం జరుగుతుందని గ్రామస్తులు అనడంతో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు రోదిస్తూ కాలం వెల్లదీసిన తీరు అందరినీ కలిచి వేసింది. మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామానికి చెందిన ఉప్పర శంకరయ్య(34) గురువారం బొడ్రాయి పండుగును పురస్కరించుకుని పనుల నిమిత్తం ఎండలో తిరిగాడు. రాత్రి ఆయన తీవ్ర ఆస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శంకరయ్య ఆర్ధరాత్రి చనిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గ్రామానికి తరలించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో పెద్ద తంటా వచ్చి పడింది. గ్రామంలో బొడ్రాయి పండుగను నిర్వహిస్తున్నందున మృతదేహాన్ని తీసుకువస్తే అరిష్టం జరుగుతుందని.. మృతదేహాన్ని తీసుకురావొద్దని గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. ఉదయం కూడా తీసుకురావొద్దని... గ్రామం పొలిమేర చుట్టూ పొత్తిపోస్తాం.. కాబట్ట్టి ఇతర గ్రామస్తులు గ్రామానికి రారని, కల్వలపల్లి గ్రామస్తులు కూడా గ్రామం విడిచి వెళ్లవద్దని సూచించారు. దీంతో మృతుడిని కడసారి చూసేందుకు అతడి తల్లి కూడా బయటకు రాని దీన పరిస్థితి ఏర్పడింది. అమృతదేహాన్ని వార్డులో ఉంచే అవకాశం లేకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది మార్చిరీ ఆవరణలో ఉంచారు. అటు గ్రామానికి వెళ్లలేక మృతుడి భార్య, పిల్లలు, బంధువులు అర్ధరాత్రి నుంచి మార్చురీ వద్ద రోదిస్తూ గ్రామస్తుల అనుమతి కోసం మధ్యాహ్నం వరకు వేచి చూశారు. బోనాల కార్యక్రమం పూర్తయిందని గ్రామం నుంచి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సమాచారం రావడంతో మృతదేహాన్ని అంబులెన్స్లో గ్రామానికి తీసుకెళ్లారు. మా అమ్మకు ఏమైనా అయితే ఎవరు బాధ్యులు - సునిత, మృతుడి సోదరి అన్న శంకరయ్య ఆర్ధరాత్రి చనిపోతే పండుగ ఉందని గ్రామానికి తీసుకురావద్దని చెప్పారు. అమ్మ ముత్తమ్మ ఆరోగ్యం బాగా లేదంట. ఆమెను దావఖానాకు తీసుకురావడానికి ఎవ్వరూ గ్రామం నుంచి వెళ్లొద్దని అంటున్నారంట. ఆమెకు ఏమైనా అయితే ఎవరిది బాధ్యత? అని ఆమె గ్రామస్తులను ప్రశ్నించింది.


