BMTC drivers negligence
-
యువతిని గుద్ది చంపేందుకు ఆర్టీసీ బస్సు డ్రైవర్ యత్నం?.. వీడియో వైరల్
బెంగళూరు,సాక్షి: బస్సు డ్రైవర్లతో గొడవ పడతున్నారా? అయితే,తస్మాత్ జాగ్రత్త. ఓ యువతి తనతో గొడపడిందని బస్సుతో ఢీకొట్టి ప్రాణాలు తీసేందుకు ఓ బస్సు డ్రైవర్ ప్రయత్నించాడు. ఈ ఘటనలో యువతి తృటిలో ప్రాణలు దక్కించుకుంది. ప్రస్తుతం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.బెంగళూరులో బీఎంటీసీ (బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్) డ్రైవర్ అరాచకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది. నగరంలోని ఓ సిగ్నల్ దగ్గర యువతిపైకి బస్సును పోనిచ్చాడు. యువతి తనతో గొడవ పడిందన్న కారణంతో డ్రైవర్ కర్కశంగా వ్యవహరించాడు. బస్సు ముందు యువతి ఉందని తెలిసినా ఆమెను తోసుకుంటూ బస్సును నడిపాడు డ్రైవర్. అయితే, ఆ ప్రమాదం నుంచి యువతి తృటిలో తప్పించుకుంది. వివరాల్లోకి వెళితే.. కేఏ57ఎఫ్2046 నంబర్ గల బస్సు డ్రైవర్ మే 23న చినస్వామి స్టేడియం సిగ్నల్ వద్ద ఓ యువతిని ఢీకొట్టేందుకు ప్రయత్నించాడు. మ్యూజియం రోడ్ నుంచి ఎంజీ రోడ్ వైపు వెళ్తున్న సమయంలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనకు ముందు బస్సు డ్రైవర్,యువతి మధ్య వాగ్వాదం జరిగింది. అందుకు కారణాలేంటనేది తెలియాల్సి ఉండగా.. బస్సు డ్రైవర్తో గొడవ జరిగిన తర్వాత యువతి సిగ్నల్ వద్ద ఆందోళన చేపట్టేందుకు ప్రయత్నించింది.డ్రైవర్ ఆ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేయలేదు. లేదంటే పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. పైగా, యువతిని ఢీకొట్టేందుకు బస్సు నడపడంతో ఉద్దేశపూర్వకంగానే సదరు బస్సు డ్రైవర్ యువతి ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించాడనే స్పష్టంగా తేలింది. మరోవైపు, ఈ దుర్ఘటనపై బెంగళూరు వాసులు నిత్యం ప్రాణ భయంతోనే కాదు, సురక్షితమైన బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కోరుతున్నారు. వీడియోతో ఆధారంగా బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
బీఎంటీసీ డ్రైవర్ల నిర్లక్ష్యమే..
సాక్షి, బెంగళూరు: ఇద్దరు బీఎంటీసీ డ్రైవర్ల నిర్లక్ష్యం ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. ఒక బీఎంటీసీ డ్రైవర్ బ్రేక్ డౌన్ అయిన బస్సును నిర్లక్ష్యంగా రోడ్డుపై పార్క్ చేస్తే, మరో బీఎంటీసీ డ్రైవర్ నిర్లక్ష్యంగా, వేగంగా బస్సును నడుపుతూ ఓ టెక్కీ మృతికి కారణమయ్యారు. వివరాలు....రామమూర్తి నగర్లో నివసించే ఎం.శ్రీనివాసులు బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. బీఎంటీసీ బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షి వెంకట్ చెబుతున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లో ....‘మారతహళ్లిలోని ఇన్నోవేటివ్ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్’ వద్ద ఉన్న రోడ్డు పై ఓ బీఎంటీసీ బస్సు బ్రేక్ డౌన్ అయి నిలబడి ఉంది. అదే దారిలో వస్తున్న శ్రీనివాసులు టర్న్ తీసుకొని వెళ్లేందుకు బ్రేక్ డౌన్ అయిన బస్సు వెనకాల తన బైక్ నిలబెట్టారు. ఇంతలోనే వెనుకగా మరో బీఎంటీసీ బస్సు వేగంగా వచ్చి శ్రీనివాసులను ఢీ కొట్టింది. దీంతో శ్రీనివాసులు రెండు బస్సుల మధ్య ఇరుక్కొని గాయపడ్డారు. శ్రీనివాసులను బయటికి తీసుకువచ్చేందుకు 20 నిమిషాల సమయం పట్టిం ది. అక్కడి నుంచి ఎంతో మంది వెళుతున్నప్పటికీ సహాయం చేసేందుకు ముం దుకు రాలేదు. ఆ సమయంలో ఓ ఉద్యోగిని ముందుకొచ్చి బాధితుడిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లడంలో సహాయం చేశారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు’ అని చెప్పారు. ఇక ఈ ఘటనకు కారణమైన బీఎంటీసీ డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాసులు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆ డ్రైవర్లకు శిక్ష పడేవరకు న్యాయపోరాటం చేస్తామని చెబుతున్నారు. శ్రీనివాసులకు భార్య, ఎనిమిదేళ్లు, ఐదేళ్ల వయస్సున్న ఇద్దరు పిల్లలు ఉన్నారని వారికి నష్టపరిహారాన్ని సైతం బీఎంటీసీ చెల్లించాలని కోరుతున్నారు.