breaking news
Blue Cross
-
వీళ్లసలు మనుషులేనా?
-
వీళ్లసలు మనుషులేనా?
సాక్షి, చెన్నై : తాంబరంలోని ఒక ప్రయివేట్ కాలేజ్లో చదుతున్న ఇద్దరు విద్యార్థులు ఒక వీధికుక్కను అత్యంత కౄరంగా, దారుణంగా హింసించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు విద్యార్థులు కుక్కకు ఊపిరి ఆడకుండా గొంతుకు, నడుముకు తాడు కట్టి.. అటూఇటూ ఇద్దరు రోడ్డు మీదమీద ఈడ్చుకు వెళుతుంటే ప్రాణం కోసం మూగ జంతువు గిలగిలా కొట్టుకుంటోంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసి స్పందించిన బ్లూక్రాస్ వాళ్లు సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ.. చెన్నై పోలీస్ కమిషనర్ను కోరారు. దీనిపై స్పందించిన పోలీసులు.. అనుమానిత వ్యక్తులను అరెస్ట్ చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. -
వీధికుక్కకు పోస్టుమార్టం పూర్తి
► మెదడు భాగాలు విశ్లేషణ కోసం ఇన్స్టిట్యూట్కు ► కళేబరం జంతు పరిరక్షణ బృందానికి అప్పగింత ► కేసు దర్యాప్తులో ఉంది: ఇన్స్పెక్టర్ నరేందర్ గౌడ్ పెద్దఅంబర్పేట: హయత్నగర్లోని భాగ్యలత కాలనీలో వెంకటేశం, మల్లేష్ల చేతిలో ‘హత్య’కు గురైన వీధికుక్క కళేబరానికి పోస్టుమార్టం పూర్తయింది. ఈ ఉదంతంపై జంతు ప్రేమికురాలు ప్రియాంక ఫిర్యాదు మేరకు హయత్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. భాగ్యలత కాలనీ పాతరోడ్డుకు చెందిన వెంకటేశం భార్యను ఓ వీధికుక్క కరిచింది. దీంతో ఆగ్రహం చెందిన ఆయన కుమారుడు మల్లేష్తో కలిసి సోమవారం మధ్యాహ్నం దాన్ని చంపారు. ఆ కళేబరాన్ని వీరు పట్టుకుని వెళ్తుండగా స్థానికంగా ఉండే ప్రియాంక గమనించారు. ఆమె ఈ విషయాన్ని జంతు పరిరక్షణ బృందమైన బ్లూక్రాస్కు తెలిపారు. దీంతో బ్లూక్రాస్ ప్రతినిధి ప్రవళిక కళేబరాన్ని హయత్నగర్ పోలీసుస్టేషన్కు వెళ్లారు. దాన్ని చంపిన వారిపై కేసు నమోదు చేయాలని ఇన్స్పెక్టర్ జె.నరేందర్గౌడ్కు ఫిర్యాదు చేశారు. వెంకటేశం, మల్లేష్లపై పోలీసులు ఐపీసీలోని 428 (ఉద్దేశపూర్వకంగా దుందుడుకు స్వభావంతో జంతువును చంపడం), ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ టు యానిమల్స్ యాక్ట్-1950 లోని సెక్షన్ 11, యానియల్ బర్త్ కంట్రోల్ రూల్స్-2011 కింద కేసు నమోదు చేసి కళేబరాన్ని భద్రపరిచారు. ఆ వీధికుక్కకు వాక్సినేషన్ వేశారని, అది కరిచినా ఎలాంటి ప్రమాదం లేదని, దాన్ని ఎందుకు చంపాల్సి వచ్చిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న సమయంలో ప్రవళిక వాదించారు. వెంకటేశం, మల్లేష్లతో పాటు కొందరు స్థానికులు సైతం ఆ కుక్కకు పిచ్చిపట్టిందని, వరుసగా అనేక మందిని కరుస్తోందని ఆరోపించారు. దీంతో కుక్క కళేబరానికి పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించాలని హయత్నగర్ పోలీసులు నిర్ణయించారు. కళేబరాన్ని పోలీసుస్టేషన్లోనే భద్రపరిచిన అధికారులు మంగళవారం ఉదయం హయత్నగర్లోని వెటర్నరీ ఆస్పత్రిలో డాక్టర్ ఆనంద్రెడ్డి ద్వారా పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించారు. తలపై దెబ్బ తగలడం వల్లే కుక్క మరణించిందని వైద్యులు ధ్రువీకరించినట్లు ఇన్స్పెక్టర్ నరేందర్గౌడ్ తెలిపారు. అయితే దానికి ర్యాబిస్ వ్యాధి ఉందా? లేదా? దానికి పిచ్చిపట్టిందా? లేదా? అనేవి నిర్ధారించడం కోసం మెదడు నుంచి ఓ పొరను సేకరించిన వైద్యులు దాన్ని విశ్లేషణ నిమిత్తం రాజేంద్రనగర్లోని వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు పంపారు. ‘పోస్టుమార్టం అనంతరం శునక కళేబరాన్ని ఖననం చేస్తామని కోరడంతో జంతు పరిరక్షణ బృందానికే అప్పగించాం. వెంకటేశం, మల్లేష్లపై నమోదైన కేసు దర్యాప్తులో ఉంది. వెలుగులోకి వచ్చిన వివరాలు, నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని ఇన్స్పెక్టర్ నరేందర్ గౌడ్ ‘సాక్షి’కి తెలిపారు. -
పాలపిట్టను బంధించడం నేరం
హైదరాబాద్: దసరా పండుగ రోజు పాలపిట్టను చూస్తే శుభమని సంప్రదాయాన్ని పాటించడం మంచిదే అయినా మొక్కుకోసం వాటిని బంధించరాదని బ్లూ క్రాస్ అధ్యక్షురాలు అక్కినేని అమల అన్నారు. సోమవారం జూబ్లీహిల్స్లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఎనిమల్ వెల్ఫేర్ ట్రైనింగ్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ దసరా రోజున పాలపిట్టను బంధించి పంజరాల్లో పెట్టుకొని వ్యాపారాలు చేయడం చట్ట విరుద్ధమన్నారు. ఎక్కడైనా వీటిని బంధించినట్లు తెలిస్తే హెల్ప్లైన్ నంబర్లు 7674922044, 9849027601, 3298985, 9966629858 సమాచారం అందించాలన్నారు. -
'హరిత నగరాన్ని నిర్మిద్దాం'
హైదరాబాద్ : పరిశుభ్రమైన నగరాన్ని సృష్టించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని బ్లూక్రాస్ సొసైటీ నిర్వాహకురాలు, నటి అమల అక్కినేని పిలుపునిచ్చారు. ఎర్త్డేను పురస్కరించుకొని బుధవారం బేగంపేట హరిత హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమల మట్లాడుతూ.. ప్రతి ఒక్కరు వారానికి రెండు గంటల పాటు పర్యావరణహిత కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఇంటింటికీ తిరిగి చెత్త సేకరిస్తున్న శుభ్రక్లకు ఈ సందర్భంగా అమల యూనిఫామ్ అందజేశారు. కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు తెరవడానికి కృషి చేస్తున్నట్లు ఎక్స్నోరా నిర్వాహకుడు మేజర్ శివకిరణ్ వెల్లడించారు. పర్యావరణం, పరిశుభ్రత కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు జూన్ 5న క్లీన్ ఇండియా గ్రీన్లీఫ్ అవార్డులను ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ పర్యావరణ, అడవుల శాఖ స్పెషల్ సెక్రటరీ ఎంసీ పరేగాన్, ప్రొఫెసర్ ప్రసన్నకుమార్, జ్యోతికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఓ ముప్ఫైసార్లయినా పాముతో కరిపించుకోవాల్సి ఉంటుంది!
పాములంటే అందరికీ భయమే. కానీ నటుడు సాయికిరణ్ మాత్రం స్నేక్లతో స్నేహం చేస్తారు. హైదరాబాద్లోని ‘ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ’లో కీలక సభ్యుడాయన. ఎక్కడ పాము కనపడ్డా దాన్ని ఒడుపుగా పట్టుకుని ఏ అడవిలోనో వదిలేసి వస్తారు. ఈ స్నేక్ల స్నేహితుడు చెప్పిన స్వీయానుభవాలు ఆసక్తికరం... ఓ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఫోన్ మోగింది. ఏదో కొత్త నెంబర్... లిఫ్ట్ చేయగానే ‘హలో... సాయికిరణా? నేను నాగార్జునను మాట్లాడుతున్నాను’ అన్నారు. ఎవరో మిమిక్రీ చేసి ఆటపట్టిస్తున్నారనుకున్నాను. ‘ప్లీజ్ బాస్....మీరెవరో చెప్పండి’ అన్నాను. ‘నేనేనయ్యా...అక్కినేని నాగార్జునను’ అని అన్నారు. షాక్ నుంచి తేరుకుని ‘చెప్పండి సార్...’ అన్నాను. ‘కారులో పాము ఉంది. శ్రీహరి ఇంటికి ఎదురుగా రోడ్డుపై పక్కనే ఆపాను. వెంటనే రాగలవా?’ అన్నారు. పావుగంటలో అక్కడున్నాను. బ్లూక్రాస్ పని మీద అమలగారు ఎక్కడికో వెళితే అక్కడ ఒక త్రాచుపాము కనిపించిందట. ఎవరైనా చంపేస్తారని, దాన్ని పట్టించి, ఒక బ్యాగులో వేసుకుని నాకు ఇద్దామని తెచ్చారట. ఆ బ్యాగుని అమలగారు కారులో వదిలి లోపలికి వెళ్లడం. ఇంతలో ఆ కారు తీసుకుని నాగార్జునగారు బయటకి రావడం జరిగింది. ఆ బ్యాగు ముడి సరిగ్గా వేయకపోవడంతో, పాము కాస్తా బయటకు వచ్చి కారు వెనకసీట్లో పడగ విప్పి ఆడుతోంది. నాగార్జునగారు వెంటనే అమలగారికి ఫోన్ చేస్తే, ఆవిడ నా నెంబర్ ఇచ్చారు. తీరా కారులో పాము కనిపించలేదు. మెకానిక్ని పిలిచి, కారు సీట్లు, కార్పెట్...అన్నీ విప్పేయించాం. ఆ పాము కారు బాడీలోకి దూరిపోవడంతో పట్టుకోవడం కష్టమైంది. పట్టుకున్న తర్వాత అందరం ఊపిరి పీల్చుకున్నాం. ఏడేళ్ల వయసులో... చిన్నప్పుడు సైన్స్టీచర్ వానపాముల్ని పట్టుకుని మొక్కల మొదలు దగ్గర వేస్తే మొక్కలు బాగా పెరుగుతాయని చెప్పేవారు. అది విని, వానపాముల్ని పట్టుకోవడంతో మొదలైంది నా పాముల వేట (నవ్వుతూ...). ఒకసారి నా ఏడేళ్ల వయసులో ఇంటి పెరట్లో స్క్రూడ్రైవర్తో మట్టి తవ్వుతుంటే చాలా వానపాములతో పాటు ఇంకో పాము కూడా వచ్చింది. దాన్ని పట్టుకోగానే నా బొటనవేలుకి చుట్టేసుకుని పడగ విప్పి చూస్తోంది. ఈ పామేదో భలేగా ఉందని అమ్మమ్మను పిలిచి చూపిస్తే, పనివాళ్లను పిలిచి చంపేయించింది. నాకు చాలా బాధ అనిపించింది. ‘పామును మొక్కల మొదలు దగ్గర వేసి మట్టి పోయాలి కానీ, అలా కొట్టకూడదని ఏడవడం మొదలెట్టాను. ‘అది గనక కరిస్తే చచ్చిపోతావ్...’ అంది అమ్మమ్మ. ‘అది నన్ను కరవలేదు కదా!’ అన్నాను. దానికి సమాధానం లేదు. అంతే! ఆ రోజు నుంచి రెండేళ్ల వరకూ నన్ను మొక్కల్లోకి వెళ్లనిస్తే ఒట్టు. పాములకు దూరం చేశారు కానీ వాటిపై నాకున్న ప్రేమకు మాత్రం దూరం చేయలేకపోయారు. దానికి తోడు నేను శివభక్తుణ్ణి. దేవుణ్ణి పూజిస్తున్నంతసేపు ఆయన మెడలోని పామునే చూస్తుంటాను. ‘యాక్సిడెంట్’ కలిపింది చిన్నప్పటి నుంచి పాములపై నాకున్న అభిమానం మనసులోనే ఉండిపోయింది. చదువు, ఆ తర్వాత నటన.... చాలా బిజీ అయిపోయాను. ‘నువ్వే కావాలి’ షూటింగ్ సమయంలో అనుకోకుండా ‘ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ’ వాళ్లతో పరిచయం ఏర్పడింది. పాముల సంరక్షణ కోసం వారు చేస్తున్న సేవ గురించి తెలియగానే వెంటనే ఆ సొసైటీలో సభ్యుడిగా చేరిపోయాను. మొదటి కాటు ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు... ‘ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ’ సభ్యుల్లో ఎవరు దగ్గరగా ఉంటే వారు వెంటనే స్పందిస్తారు. ప్రస్తుతం ఆ సొసైటీలో 60 మంది సభ్యులున్నారు. ఒకరోజు పొద్దునే హైదరాబాద్లోని మహేంద్రాహిల్స్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అప్పటికి ముందు రోజు సాయంత్రం మా ఇంటి దగ్గర ఒక త్రాచుపామును పట్టుకున్నాను. దాన్ని సొసైటీ దగ్గర వదిలిపెడదామనుకుని బయలుదేరే ముందు మహేంద్రాహిల్స్ దగ్గర నుంచి ఫోన్కాల్. సరేనని ఈ పామును కూడా తీసుకుని అక్కడికి బయలుదేరాను. అక్కడి పాము జెర్రిగొడ్డు. దాన్ని పట్టుకుని త్రాచుపామున్న బ్యాగులోనే వేశాను. సాధారణంగా ఒక బ్యాగులో మూడు నాలుగు పాములు పడతాయి. అయితే ఈ రెండు పాములు బాగా పెద్దవి కావడం వల్ల జెర్రిగొడ్డును బ్యాగులోకి వేస్తుంటే స్థలం సరిపోక, అందులో ఉన్న త్రాచుపాము బయటకు వచ్చేస్తోంది. ఆ సంగతి సరిగ్గా గమనించుకోకుండా రెండో పామును లోపలికి తోస్తుంటే త్రాచుపాము నా చేతిపై కాటేసింది. వెంటనే కారెక్కి దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి వెళ్లిపోయాను. అరగంట కారు ప్రయాణం...చాలా ఆందోళనతో గడిచింది. చేతి మణికట్టుపై నుంచి విషం మెల్లగా భుజంవరకూ పాకడం చాలా స్పష్టంగా తెలిసింది. అన్ని పాముల విషం తెలియదు కానీ త్రాచుపాము విషం పైకి వెళ్లడం తెలుస్తుంది. ఆ నొప్పి చాలా భయంకరంగా ఉంటుంది. నిప్పుతో చేతిపై మెల్లగా రాస్తున్నట్టు ఉంటుంది. పాముకాటు బాధితులు ఆసుపత్రికి వెళ్లగానే ముందుగా బ్లడ్ టెస్ట్ చేస్తారు... ఎందుకంటే మన రక్తంలో విషం ఉందో లేదో నిర్ధారించుకోవడం కోసం. లేదంటే వారిచ్చే విరుగుడు ఇంజెక్షన్ వల్ల మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక నా విషయంలో ఆ బ్లడ్టెస్ట్ అవసరం లేదని చెప్పాను. ఎందుకంటే అప్పటికే చాలా సమయం గడిచిపోయింది. ఓ పక్క కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ‘మిమ్మల్ని కరిచింది త్రాచుపామేనని గ్యారెంటీ ఏంటి’ అని డాక్టర్ అడగ్గానే...‘కరిచిన పాము నా దగ్గరే ఉంది. చూపించమంటారా...’ అని గట్టిగా చెప్పేసరికి వెంటనే వైద్యం మొదలుపెట్టారు. ఆ రోజు మాత్రం చావు దగ్గరి వరకూ వెళ్లిన ఫీలింగ్ కలిగింది. మూడువేల పాములు ఇప్పటివరకూ ‘ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ’ సభ్యుడిగా 3 వేల పాముల్ని పట్టుకున్నాను. పట్టిన ప్రతి పామునూ వెంటనే సైనిక్పురిలో ఉన్న ‘ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ’లో ఉంచుతాం. ఓ ఇరవై పాములయ్యాక అటవీ అధికారుల సూచనల మేరకు అడవులకు తీసుకెళ్లి వదిలిపెట్టేస్తాం. మేము ఎక్కువగా శ్రీశైలం అడవుల్లో మనుషులు సంచరించని ‘పులిచెరువు’ ప్రాంతంలో ఈ పాముల్ని వదిలేస్తాం. - భువనేశ్వరి