breaking news
bimavaram
-
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు ‘పేకాట పంచాయితీ’
సాక్షి,విజయవాడ: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు పేకాట పంచాయితీ చేరింది. భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై పవన్కు జనసేన నేతల ఫిర్యాదు చేశారు. సివిల్ వివాదాలలో జయసూర్య జోక్యం చేసుకుంటున్నారని, భీమవరం పరిధిలో పేకాట శిబిరాలు ప్రోత్సహిస్తున్నారని డీఎస్పీపై పవన్కు చేసిన ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. అయితే ఫిర్యాదులపై పవన్ స్పందించారు. కూటమి నేతల నుంచి తమకు ఫిర్యాదులు వచ్చాయన్న ఆయన ..డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను హోంమంత్రి, డీజీపీకి తెలపాలని అధికారులకు ఆదేశాలు చేశారు. డీఎస్పీ జయసూర్య వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని ఎస్పీకి ..పవన్ ఆదేశించారు. -
భీమవరంలో రౌడీషీటర్ దారుణ హత్య
భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా): భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లో సుంకర బద్దయ్యగారి వీధిలో బైసాని రామకృష్ణ అనే రౌడీషీటర్ గురువారం అర్ధరాత్రి సమయంలో దారుణ హత్యకు గురయ్యారు. ప్రత్యర్థులు మాంసం కొట్టే కత్తితో రామకృష్ణను నరికి చంపారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
పవన్ ప్లెక్సీలు ధ్వంసం..ఉద్రిక్తత
-
పవన్ ప్లెక్సీలు ధ్వంసం..ఉద్రిక్తత
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్ అభిమానులు ఆందోళన చేశారు. తమ అభిమాన హీరో ఫ్లెక్సీ చింపారంటూ బీభత్సం సృష్టించారు. పవన్ పుట్టిన రోజు సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఫ్యాన్స్ కట్టిన ఫ్లెక్సీలను ఎవరో చింపేశారు. అయితే హీరో ప్రభాస్ అభిమానులే వాటిని చింపేశారంటూ.... పవన్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తూ.... ప్రభాస్ ఫ్లెక్సీలను చించేసి... రోడ్డుమీద పడేసి నిప్పంటించారు. అంతేకాకుండా రోడ్డు పక్కనున్న షాపులను కూడా ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు పవన్ ఫ్యాన్స్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. రాత్రి సమయంలో రాస్తారోకో చేసి... రోడ్డుపై నిప్పుపెట్టి హంగామా చేశారు. అనుమానితుల ఇళ్లపై ...పవన్ అభిమానులు రాళ్లతో దాడి చేశారు. వీరి ఆందోళనల ఎక్కడికి దారి తీస్తుందోనని ప్రజలు హడలిపోయారు.


