-
రైతులకు అండగా వైఎస్సార్ సీపీ
సీతానగరం: వైఎస్సార్ సీపీ రైతులకు అండగా నిలుస్తుందని, ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. సీతానగరం మండలం అంటిపేటలో నియోజకవర్గ సమన్వయకర్త అలజింగి జోగారావు అధ్యక్షతన వేలాదిమంది కార్యకర్తలతో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధాలను తిప్పి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ ప్రాంత రైతులు వాణిజ్యపరంగా ఎంపిక చేసుకున్న చెరకు పంటకు గిట్టుబాటు ధర లేక, సకాలంలో బిల్లులు చెల్లించక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. రైతులు, బడుగుబలహీన వర్గాలకు, వ్యవసాయ కూలీలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దశాబ్దకాలంగా చెరకు రైతులకు బిల్లులు అందక, ఇళ్ల బిల్లులు చెల్లించక అవస్థలు పడుతున్నా పాలకులకు పట్టడంలేదని విమర్శించారు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు తమవంతు కృషిచేస్తామన్నారు. ఆశలతో చంద్రబాబు, ఆశయం కోసం జగన్మోహన్రెడ్డి పని చేస్తున్నారన్నారు. అనేక సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకు భరోసా ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర చేస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మాట్లాడుతూ చెరకు రైతులకు బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరిజవహర్లాల్కు విన్నవించామన్నారు. జూలై 9 లోగా ప్రభుత్వం స్పందించి యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే పార్వతీపురం ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా చేస్తామన్నారు. చెరకు రైతుల బిల్లులు రూ.12 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు మాట్లాడుతూ మహానేత వైఎస్సార్ ఆశయాలను పుణికిపుచ్చుకున్న జగన్హన్రెడ్డి పదవుల కోసం పాకులాడడం లేదని, ప్రజలకు సేవలందించేందుకు తాపత్రయపడుతున్నారన్నారు. టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి... మండలంలోని అంటిపేటలో నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త అలజింగి జోగారావు ఆధ్వర్యంలో టీడీపీ నుంచి సీతానగరం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అంబటి క్రిష్ణంనాయుడు, సుమిత్రాపురం సర్పంచ్ అరసాడ అమ్మడమ్మ, పణుకుపేట మాజీ సర్పంచ్ బంకురులక్ష్మి, సుమిత్రాపురం, రంగంపేట పంచాయతీ ఉపసర్పంచ్లు ఎం.గణేష్, శనపతి తిరుపతిరావు, రంగంపేట టీడీపీ గ్రామకమిటీ అధ్యక్షుడు బొంగుభాస్కరరావులు వైఎస్సార్ సీపీలో చేరారు. వారందరినీ భూమన, చిన్నశ్రీనులు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట కార్యదర్శి అవనాపు విజయ్, జెడ్పీ మాజీ చైర్మెన్ వాకాడ నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు జమ్మాన ప్రసన్నకుమార్, గర్బాపు ఉదయభాను, పార్టీ మండల కన్వీనర్ పోల ఈశ్వరనారాయణ, పార్వతీపురం, సీతానగరం మండలాల నాయకులు బలగ శ్రీనివాసరావు, తోడబండి సూర్యనారాయణ, బోను రామినాయుడు, కౌన్సిలర్లు మంత్రి రవికుమార్, ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, కొండపల్లి బాలకృష్ణ, బి.తమ్మినాయుడు, ఆర్వీ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. పార్టీ గెలుపేధ్యేయంగా పనిచేయాలి బొబ్బిలి: పార్టీ గెలుపే ధ్యేయంగా ప్రతీనాయకుడూ, కార్యకర్త పనిచేయాలని వైఎస్సార్ సీపీ కేంద్ర కమిటీ సభ్యులు భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ స్థానిక కార్యాలయానికి శనివారం వచ్చిన ఆయనకు నాయకులు మజ్జి శ్రీనివాసరావు, శంబంగి వెంకటచినఅప్పలనాయుడు తదితరులు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా పట్టణ, పార్టీ మండల నాయకులను ఆయనకు పరిచయం చేశారు. అనంతరం కరుణాకరరెడ్డి మాట్లాడుతూ జగన్ చాలా కష్టపడుతున్నారని, మనందరం ఆయనవెంట మరింత కష్టపడితే మంచి ఫలితం ఉంటుందన్నారు. అనంతరం నియోజకవర్గంలో పరిస్థితి, పార్టీ అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. తను కొద్దిరోజుల్లో మూడునెలల పాటు జిల్లాలో అందుబాటులో ఉంటానని, ప్రజాసంకల్పయాత్ర ఏర్పాట్లు పరిశీలిస్తామని చెప్పారు. సమావేశంలో వాసిరెడ్డి వరదరామారావు, వాకాడ నాగేశ్వరరావు, శత్రుచర్ల పరీక్షిత్రాజు, జమ్మాన ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
20న వైఎస్సార్సీపీ జిల్లాస్థాయి ప్లీనరీ
►ప్రభుత్వ అవినీతిని ఎండగట్టేందుకే సమావేశాలు ►ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటైనా నెరవేర్చారా బాబూ? ►ఎన్టీఆర్ ఫొటో లేకుండా ఎన్నికలకు వెళ్లగలరా ►విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే నారాయణస్వామి తిరుపతి మంగళం: ఈనెల 20వతేదీన తిరుపతిలో వైఎస్సార్సీపీ జిల్లాస్థాయి ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షులు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూ రు నారాయణస్వామి తెలిపారు. తిరుపతి ప్రెస్క్లబ్లో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తిరుపతిలో ఏఐఆర్ బైపాస్రోడ్డులోని పీఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఉదయం 9గంటలకు జిల్లా స్థాయి ప్లీనరీ ప్రారంభమవుతుందని తెలిపారు. ముఖ్య అతిథులుగా పార్టీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి పాల్గొంటారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి, అక్రమాలను ఎండగట్టడం, ప్రజాసమస్యలపై ఉద్యమాలు, వైఎస్సార్సీపీ బలోపేతానికి కార్యచరణ వంటి అంశాలపై చర్చిస్తామన్నారు. ఎన్టీఆర్ ఫొటోలేకుండా ఎన్నికలకు వెళతారా బాబూ? చంద్రబాబూ.. మీకు దమ్ముంటే రాబోయే ఎన్నికల్లో ఎన్టీ ఆర్ ఫొటో లేకుండా గెలవగలరా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి సవాల్ విసిరారు. ఎన్టీఆర్ ఫొటో లేకుండా నాలుగు సీట్లు గెలిచినా తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. మహానుభావుడు ఎన్టీఆర్ చివరి దశలో చంద్రబాబుపై చెప్పిన వాస్తవాలను ప్రతి ఒక్కరు వింటే చంద్రబాబు ఎన్టీఆర్కు చేసిన మోసాలు బయటపడుతాయన్నారు. 2014 ఎన్నికల్లో ఎలాగైనా అధి కారంలోకి రావాలన్న దురాలోచనతో చంద్రబాబు నోటికొచ్చిన వందలాది హామీలను గుప్పించారన్నారు. రాష్ట్ర ప్రజలకు, రైతులకు, యువతకు, మహిళలకు ఇచ్చిన హామీల్లో ఇంతవరకు ఏ ఒక్కటైనా నెరవేర్చావా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు మూడున్నరేళ్ల పాలనలో పేదలకు సెంటు భూమి ఇచ్చిన పాపానపోలేదని మండిపడ్డారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి పాలనలో 65.48లక్షల మందికి ఇళ్లు మంజూరుచేశారని, అందులో 25వేల మందికి ఇళ్లు పూర్తిచేసి ఇచ్చారని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆశయసాధన కోసం నిరంతరం శ్రమిస్తున్న వైఎస్.జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తేనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు పాలగిరి ప్రతాప్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కె.ఇమామ్, పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు చెలికం కుసుమమ్మ, విద్యార్థి విభాగం నగర అధ్యక్షులు నరేంద్ర, పుష్పలత, పుణీత, సాయికుమారి పాల్గొన్నార
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్లో పలువురి చేరిక
చిరు జల్లులతో ఉపశమనం
మత్స ్య సంపద ౖపైపెకి..
దాబా పైనుంచి పడి యువకుడి దుర్మరణం
నేటినుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు
ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
పీఆర్సీ వేతన సవరణ అంశాలపై వివరణ
ఇండియా కూటమిని గెలిపించాలి
వారికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం..
ఎన్నికలప్పుడే గుర్తొస్తాయి!
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement