breaking news
Bhanj Dev
-
వారు నకిలీ గిరిజనులే..
సాలూరు: నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఆర్.పి. భంజ్దేవ్తో పాటు అర కు పార్లమెంటరీ అభ్యర్థి కిషోర్చంద్రదేవ్ గిరిజనులు కాదంటూ గిరిజన ఉద్యోగుల సంఘం న్యాయసలహాదారుడు రేగుమహేశ్వరరావు విడుదల చేసిన కరపత్రాలు హల్చల్ చేస్తున్నా యి. భంజ్దేవ్ తాత, తండ్రి ఒరియా క్ష త్రియగా ప్రభుత్వడాక్యుమెంట్లలో క్లియర్గా ఉందని, 1900 సంవత్సరం నుంచి 1979వరకు క్షత్రియగానే చూపుతున్నాయని పేర్కొన్నారు. అయితే 1979లో భంజ్దేవ్ కొండదొరగా కులధ్రువీకరణ పత్రంపొందారని, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను కరపత్రాల్లో పొందుపరిచారు. గిరిజనులకు కేటాయించిన నియోజకవర్గంలో అసలైన గిరిజనుడికే ఓటేయాలని కోరారు. అలాగే కిషోర్ చంద్రదేవ్ తాత క్షత్రియగా తెలిపే 1901 నాటి రికార్డుల నుంచి కిషోర్చంద్రదేవ్ 1 957 నాటి స్కూల్ రికార్డుల్లో కూడా క్ష త్రియగా నే ఉందని, వీరు చెప్పుకుంటున్న కొండరాజు కులం ఎస్టీ జాబితాలోనే లేదని వివరించారు. -
టీడీపీలో ‘రాజ’ముద్ర
వారంతా రాజులే. అలాగని ప్రజాసంక్షేమమేధ్యేయంగా పాటుపడే పాలకులు కాదు. నిస్వార్థంగా జనానికి సేవ చేసే జవాబుదారీలు కాదు. తమను నిత్యం అంటిపెట్టుకునేవారి సంక్షేమమే వారి లక్ష్యం. స్వార్థ ప్రయోజనం... ఆశ్రిత పక్షపాతం... బంధుప్రీతి... వారి నైజం. అధికారం వారి చేతుల్లోనే ఉండాలి. పదవులు వారే అనుభవించాలి. మిగతా జనమంతా వారి కనుసన్నల్లోనే బతకాలి. అందుకే అత్యధిక బీసీలున్న ఈ జిల్లాలో టీడీపీ హయాంలో వారి ఎదుగుదల నామమాత్రమే. పథకాలన్నీ పెద్దలకే అందుతున్నాయి. బీసీలకు కనీస సౌకర్యాలు కొరవడుతున్నాయి. తెలుగుదేశం పాలనలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై అప్పుడే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసంతృప్తి రాజుకుంటోంది. సాక్షిప్రతినిధి విజయనగరం: రాజంటే... తన రాజ్యంలో సుస్థిర పాలనను అందించడం... తరతమ భేదాలు లేకుండా ప్రజలందరినీ సమానంగా చూడటం... ఎలాంటి పక్షపాతాలకు, రాగద్వేషాలకు తావివ్వకుండా నిరంతరం ప్రజల యోగక్షేమాల గురించే ఆలోచించడం చేయాలి. కానీ అలాంటి రాజవంశ ముద్ర వేసుకున్న మన జిల్లా తెలుగుదేశం పార్టీ నేతల్లో ఈ లక్షణాలు మచ్చుకైనా కనిపించడం లేదు. దీనిని ఆ పార్టీవారే బాహాటంగా అంగీకరిస్తారు. జిల్లాలో అత్యధికంగాఉన్న బీసీ సామాజిక వర్గాన్ని అధికారపార్టీ నేతలు పూర్తిగా విస్మరించారు. కేవలం రాజ సామాజిక వర్గానికి, వారి అనుచర గణానికి మాత్రమే పదవులు, కాంట్రాక్టులు కట్టబెడుతున్నారు. దీనిపై ఆ పార్టీ వర్గాల్లోనే తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గాలిలో కలసిన బీసీలకిచ్చిన హామీలు గత ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి టీడీపీ అధినేత చంద్రబాబు చాలా హామీలు ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 18 లక్షల మంది వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజలు ఆ హామీలను నమ్మి ఓట్లేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకపోగా, బీసీలపై సవతితల్లి ప్రేమ చూపించడం మొదలుపెట్టారు. దానిలో భాగంగానే కేంద్ర మాజీ మంత్రి, విజయనగరం ఎంపీ అశోక్గజపతిరాజు అనుచరులకు విజయనగరం ఏఎంసీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవులను ఇచ్చారు. బొబ్బిలి రాజు, రాష్ట్ర మంత్రి సుజయకృష్ణ రంగారావు తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడాన్ని సుతరామూ అంగీకరించని అక్కడి పార్టీ ఇన్చార్జి తెంటు లకు‡్ష్మనాయుడికి ఆర్టీసీ సంస్థ రీజనల్ చైర్మన్ పదవినిచ్చి కేవలం బుజ్జగించారు. ఈ మూడింటితోనే బీసీలకు ఎంతో చేసేశామని చెప్పుకుంటున్నారు. కానీ ఇవన్నీ నియోజకవర్గ, జిల్లా, రీజనల్ స్థాయి పదవులే కావడం విశేషం. రాష్ట్రస్థాయి పదవులకు నోచనీ బీసీలు ఇక రాష్ట్ర స్థాయి పదవులను మాత్రం బీసీలకు దక్కనివ్వడం లేదు. సుజయ్కు ప్రధాన అనుచరుడు, సొంత సామాజిక వర్గానికి చెందిన తూముల భాస్కరరావును రాష్ట్ర ఆర్థిక మండలి సభ్యుడిగా నియమించుకున్నారు. రాష్ట్ర బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ డైరెక్టర్గా భోగపురపు వాయునందన శర్మను వేసుకున్నారు. తాజాగా అశోక్ ప్రధాన అనుచరుడు, సొంత సామాజిక వర్గానికి చెందిన ఐ.వి.పి.రాజును రాష్ట్ర ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు వైస్ చైర్మన్గా నియమించుకున్నారు. విజయనగరంలో అశోక్గజపతిరాజు, సాలూరులో ఆర్పి భంజ్దేవ్, కురుపాంలో శత్రుచర్ల విజయరామరాజు, బొబ్బిలిలో ఆర్వి సుజయకృష్ణ రంగారావు రాజుల సామాజిక వర్గం నుంచి టీడీపీలో పెత్తనం చెలాయిస్తుండగా త్వరలోనే వీరికి మరోరాజు కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ తోడవ్వనున్నారు. ఇలా విజయనగరం జిల్లా టీడీపీ మొత్తం రాజుల మయంగా మారుతోంది. పోనీ వీరు జనానిమైనా చేస్తున్నారా అంటే..అదీ లేదు. శత్రుచర్ల విజయరామరాజు, ఆర్పి భంజ్దేవ్, వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ ఇప్పటికే కులనిర్థారణ వివాదాల్లో నిత్యం కొట్టుమిట్టాడుతున్నారు. పదవి కోసం శత్రుచర్ల విజయరామరాజు సొంత నియోజకవర్గాన్ని వదిలి పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లాకు వెళ్లి ఎమ్మెల్సీ అయ్యారు. అశోక్ గజపతి, సుజయకృష్ణ రంగారావు, భంజ్దేవ్లు తమ ఆస్తులను కాపాడుకోవడంపై పెడుతున్న శ్రద్ధ ప్రజల సంక్షేమంపై పెట్టడం లేదు. విజయనగరానికి కేంద్ర పథకాలు, విభజన హామీలు తెప్పించుకోవడంలో అశోక్ పూర్తిగా విఫలమవ్వగా, గనుల శాఖలో ఉండి వాటిలో అక్రమాలను నిలువరించడంలో, జిల్లాకు రాష్ట్ర ప్రాజెక్టులు రప్పించడంలో సుజయ్ ఫెయిలయ్యారు. ఇక భంజ్దేవ్ పదవిలో ఉన్నప్పుడూ లేనప్పుడు కూడా తనపై వస్తున్న ఆరోపణల నుంచి తనను తాను కాపాడుకోవడంతోనే సరిపెడుతున్నారు. ఇక ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీలో ఉండి, జిల్లా ప్రజలకు కనీసం దర్శన భాగ్యం కూడా కల్పించని కిశోర్చంద్రదేవ్ ఇప్పుడు సడన్గా ప్రత్యక్షమై పదవి కోసం వీరి పంచన చేరుతున్నారు. వీరివల్ల జిల్లా ప్రజలు ఏ విధమైన ప్రయోజనం పొందలేకపోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. -
రాణాప్రతాప్ + రాణి
సాలూరు, న్యూస్లైన్ : తెలుగుదేశం పార్టీ సాలూరు నియోజకవర్గ ఇన్చార్జి గుమ్మిడి సంధ్యారాణికి మాజీ ఎమ్మెల్యే రాణాప్రతాప్ భంజ్ దేవ్ సెగ తగిలింది. ఎస్టీ కుల వివాదంతో పదవిని పోగొట్టుకున్న భంజ్దేవ్ ఇప్పుడు అసెంబ్లీ టిక్కెట్ కోసం తీవ్రంగా లాబీయింగ్ జరుపుతూ.. తనదే పైచేయని ముమ్మరంగా ప్రచారం జరుగుతుండడంతో సంధ్యారాణి వర్గీయుల్లో ఆందోళన మొదలైంది. తనకే టిక్కెట్టు వస్తుందని గత కొంతకాలంగా చెబుతూ వస్తున్న భంజ్దేవ్ వ్యాఖ్యలను లైట్గా తీసుకున్న సంధ్యారాణి వర్గీయులు నేడు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. క్యాడర్ లేని భంజ్దేవ్కు టిక్కెట్ ఇస్తే నష్టపోతామని సంధ్యారాణి వర్గీయులు చెబుతుండగా, మూడుసార్లు ఎమ్మెల్యే పదవిని చేపట్టిన తమ నాయకుడికి ఎన్నికలు ఎలా ఫేస్ చేయాలో తెలియంది కాదని భంజ్దేవ్ వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ క్యాడర్లో అయోమయం నెలకొంది.ఐదేళ్లగా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు చూస్తూ, సమర్థంగా పార్టీని నడుపుతున్న గుమ్మడి సంధ్యారాణిని కాదని ఆఖరు నిమిషంలో మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్దేవ్కే అసెంబ్లీ టిక్కెట్టని అధిష్టానం సంకేతాలివ్వడంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా 2004 ఎన్నికల్లో సంధ్యారాణి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ను ఆశించి భంగపడిన తర్వాతనే ఎన్నికలకు వారం రోజుల ముందు టీడీపీలో చేరారని, ఆ సమయంలో ఆమెకు భంజ్దేవ్ బాసటగా నిలిచారని ఆయన వర్గీయులు, అభిమానులు గుర్తుచేస్తున్నారు. అదే స్ఫూర్తితో ఈసారి భంజ్దేవ్కు ఆమె సహకరించాలని కోరుతున్నారు. 1999లో కాంగ్రెస్ తరఫున, 2004లో టీడీపీ తరఫున పోటీ చేసి చేదు అనుభవాన్ని సంధ్యారాణి మూటగట్టుకున్నారని, మరోమారు ఆ పరిస్థితి తలెత్తకుండా భంజ్దేవ్కు సహకరించడమే ఉత్తమమంటున్నారు. అసలైన గిరిజనుడు కాదన్న ముద్రపడిన భంజ్దేవ్ను ఎన్నికల బరిలో దింపితే నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న గిరిజనుల ఓట్లు దక్కవని సంధ్యారాణి వర్గీయులతో పాటు తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. భంజ్దేవ్ అసలైన గిరిజనుడు కాదని జనం పూర్తిగా విశ్వసిస్తున్నందున ఆయనకు టిక్కెట్ ఇస్తే పార్టీకి నష్టం తప్పదని బాహాటంగానే పార్టీ అభిమానులు చెబుతున్నారు. ఎలాగోలా ఎస్టీ కులధ్రువీకరణ పత్రాన్ని భంజ్దేవ్ పొందినా మరోమారు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర రూపంలో ముప్పు తప్పదని గుర్తుచేస్తున్నారు. భంజ్దేవ్ ఎమ్మెల్యే పదవిని పోగొట్టుకున్న తర్వాత నుంచి నేటివరకూ పార్టీ అభివృద్ధికి అవిశ్రాంతం కృషి చేసిన సంధ్యారాణికి బీజేపీతో పొత్తుకారణంగా కనీసం అరుకు ఎంపీ టిక్కెట్టు కూడా ఇచ్చే అవకాశం లేకుండా పోతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. పార్టీని నమ్ముకుని పనిచేసిన నాయకులకే న్యాయం జరగకపోతే ఇక సామాన్య కార్యకర్తలకు ఏమేరకు న్యాయం చేస్తుందని పార్టీ అధినాయకత్వాన్ని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనా సంధ్యారాణి, భంజ్దేవ్ల నడుమ టిక్కెట్ విషయంలో నెలకొన్న పోటీ ఆపార్టీ నాయకుల్లో విభేదాలు బట్టబయలయ్యేలా చేస్తున్నాయి. సాలూరు అసెంబ్లీ స్థానం నుం చి 1999 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఆర్.పి.భంజ్దేవ్, కాంగ్రెస్ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి పోటీ చేశారు. ఇప్పుడు ఒకే పార్టీలో ఉంటూ సీటు కోసం పోటీ పడుతున్నారు.