breaking news
bhagawadgita
-
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మహిళ
దిబ్రుఘడ్ : తలుచుకుంటే మనిషి సాధించలేనిది ఏమీ లేదని మరోసారి రుజువైంది. భాష రాకపోయినా అస్సాంకు చెందిన ఓ మహిళ వస్త్రంపై భవద్గీతను నేసి వార్తల్లో నిలిచింది. గతేడాది డిసెంబర్లో దిబ్రుఘడ్కు చెందిన హేమప్రభ ఈ ప్రయత్నం మొదలుపెట్టారు. సంస్కతం భాషలో భవద్గీతలోని 500 శ్లోకాలు... ఆంగ్ల భాషలో ఓ అధ్యయనాన్ని ఆమె నేశారు. ఇందుకోసం ఆయా భాషల పండితుల సహకారం ఆమె తీసుకున్నారు. ఇంతకు ముందు ఆమె 80 అడుగుల పొడవు, 17 ఇంచుల వెడల్పు ఉన్న సిల్క్ క్లాత్ పై శంకర్దేవ్ గుణమాలను నేశారు. ఇందుకుగానూ ఆమెకు 9 నెలల సమయం పట్టిందంట. తన కళలతో ఓ మ్యూజియం ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో తాను ప్రభుత్వాన్ని కోరుతున్నానని ఆమె చెబుతున్నారు. -
ముంబై స్కూళ్లలో భగవద్గీత బోధన
ముంబై: ముంబై మున్సిపల్ స్కూళ్లలో ఇకపై భగవద్గీత బోధించనున్నారు. విద్యార్థుల్లో ఏకాగ్రత పెంచడానికి, వారిలో నైపుణ్యాలను పెంపొందించడానికి, వారిని ఆధ్యాత్మికతవైపు నడిపించడానికి భగవద్గీత ఎంతో ఉపకరిస్తుందని గ్రేటర్ ముంబై మున్సిపల్ అధికారి ఒకరు పేర్కొన్నారు. భగవద్గీత ద్వారా పిల్లల్లో విఙ్నానం అభివృద్ధి చెందుతుందని, తద్వారా వారి నిర్ణయాత్మక శక్తి పెరుగుతుందని ఆయన తెలిపారు. అంతర్జాతీయ కృష్ణ సొసైటీ (ఇస్కాన్) నిర్వహించిన 'గీతా ఛాంపియన్స్ లీగ్' కార్యక్రమంలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మన పిల్లలే మన భవిష్యత్తు అని ఆయన తెలిపారు. మనం వారిలోని నైపుణ్యాలను పెంపొందించాలి. టీవీ, సినిమా, ఇంటర్నెట్ లు పిల్లలను హింస, అపరిశుభ్రతవైపు నడిపిస్తాయి. అంతేకాకుండా వాటివల్ల పిల్లల ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయని ఇస్కాన్కు చెందిన రాధాగోపీనాథ్ దేవాలయ ఆధ్యాత్మిక గురువు రాధానాథ్ స్వామి తెలిపారు.