breaking news
beerkur
-
'ఆసరా' కోసం రాస్తారోకో
బీర్కూర్ (నిజామాబాద్ జిల్లా) : గడచిన కొన్ని నెలలుగా ఆసరా ఫించన్ అందకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన బాట పట్టారు. సోమవారం బీర్కూర్ మండల కేంద్రంలో దాదాపు గంటసేపు రోడ్డుపై బైఠాయించి తమ ఫించన్ను అందించాలని రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోలో సుమారు 50 మంది పాల్గొన్నారు. -
వ్యక్తి ఆత్మహత్య
బీర్కూర్: మానసిక స్థితి సరిగాలేని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన అంబయ్య (28) భార్య అనారోగ్యంతో కొద్ది రోజుల క్రితమే మృతి చెందింది. అప్పటి నుంచి అంబయ్య మానసిక స్థితి సరిగా లేదు. సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, అంబయ్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
అధికారులు ఏం చేస్తున్నారు?
బీర్కూర్, న్యూస్లైన్ : గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించకుండా అధికారులు ఏం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న మండల స్థాయి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా తహశీల్ కార్యాలయాన్ని సందర్శించి, ఆయా శాఖల అధికారులతో మాట్లాడారు. మండలంలో వ్యక్తిగత మరుగుదొడ్ల పథకం ఎంతవరకు వచ్చిందని ఉపాధి హామీ అధికారులను ప్రశ్నించారు. ప్రతి గ్రామంలో వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అనంతరం కలెక్టర్ పొతంగల్ గ్రామం నుంచి బీర్కూర్ గ్రామానికి రాగా, రోడ్లు అధ్వానంగా ఉండడంతో స్థానిక తహశీల్దార్ అంజ య్యపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రోడ్లు ఇలా ఉం టే వాహనాలు ఎలా వస్తాయన్నారు. వారంలో ఒకరోజు ‘ఇందిరమ్మ ఇళ్ల’కు ఇసుక మండలంలోని బరంగేడ్గి గ్రామం నుంచి రాత్రి వేళ ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్థానిక తహశీల్దార్ను పిలిపించి, ఇసుక రవాణా జరుగుతుంటే పట్టించుకోవడం లేదా అని ప్రశ్నించారు. వెంటనే ట్రాక్టర్లు సీజ్ చేయాలని ఆయన ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు వారంలో ఒక రోజు ఇసుక తీసుకువెళ్లడానికి అనుమతులు మంజూరు చేయాలని అన్నారు. దోషులను గుర్తించారా...? మండలంలోని బరంగేడ్గి గ్రామంలోని పాఠశాలలో విషపు గుళికలు కలిపిన సంఘటనకు బాధ్యులైన వారిని గుర్తించారా అని ఎంఈఓ గోపాల్రావును కలెక్టర్ ప్రద్యుమ్న ప్రశ్నించారు. దీనిపై పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారని ఎంఈఓ బదులిచ్చారు. అనంతరం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న వ్యక్తిగత మరుగుదొడ్లను పరిశీ లించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదా రులతో మాట్లాడారు. ఫీల్డ్ అసిస్టెంట్ తొలగింపు తిమ్మాపూర్ గ్రామంలో ఉపాధి హామీలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ రాజయ్య పని తీరు సరిగా లేదని, బిల్లులు సకాలంలో చెల్లించడం లేదని పలువురు గ్రామస్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో అతన్ని విధుల నుంచి తొలగించి, మరొకరిని నియమించాలని అధికారులను ఆదేశించారు.