breaking news
Beaten By Public
-
పశువుల దొంగకు దేహశుద్ధి
అశ్వారావుపేట: పశువులను అపహరించి విక్రయిస్తున్న దొంగకు దేహశుద్ధి జరిగింది. మండలంలోని కొత్త గంగారం గ్రామం పూర్తిగా వ్యవసాయాధారిత గ్రామం. అందరూ రైతులే. మంగళవారం తెల్లవారుజామున ఈ ఊరికి ఆగంతకుడు వచ్చాడు. అతడిని దొంగగా భావించిన గ్రామస్తులు వెంబడించారు. కత్తిని చేబూనిన అతడు తిరగబడ్డాడు. ఎట్టకేలకు అతడిని గ్రామస్తులు పట్టుకుని కట్టేశారు. మండలంలోని జమ్మిగూడెం గ్రామానికి చెందిన అతడి పేరు పెన్నాడ శ్రీను. అదే గ్రామంలో ఇదే పేరుతో ఓ పెద్ద మనిషి కూడా ఉన్నారు. ఆయనేమో రైతు. పట్టుబడ్డ ఇతడేమో పశువుల దొంగ. ఇతడు గతంలో వందకు పైగా పశువులను దొంగిలించి సమీప సంతల్లో విక్రయించినట్టుగా పోలీసులు నిర్థారించారు. ఇతడిని పోలీసులు గతంలో ఓసారి పట్టుకుని జైలుకు పంపారు. విడుదలై వచ్చిన తరువాత కూడా దొంగ బుద్ధి మానలేదు. కొత్తగంగారం గ్రామానికి సోమావారం సాయంత్రమే వచ్చాడు. మంచి పశువులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ రాత్రి వరకు చూసుకున్నాడు. వెళ్లిపోయాడు. మినీ ట్రక్, టూవీలర్, తాళ్లు తీసుకుని తన మనుషులతో కలిసి మంగళవారం తెల్లవారుజామున తిరిగొచ్చాడు. పశువులను విప్పి మినీ ట్రక్కులో ఎక్కిస్తున్నాడు. ఆ పశువులు గట్టిగా అరవడంతో గ్రామస్తులు మేల్కొన్నారు. దొంగలొచ్చారని గ్రహించి గట్టిగా కేకలు వేస్తూ గ్రామం మొత్తాన్ని అప్రమత్తం చేశారు. ఇంతలో పెన్నాడ శ్రీనుతోపాటు వచ్చిన ఇద్దరు వ్యక్తులు టూవీలర్తో పరారయ్యారు. పెన్నాడ శ్రీను ఒక్కడే మిగిలాడు. తన వద్దనున్న కత్తితో ఆ గ్రామస్తులపై దాడికి యత్నిస్తూ తప్పించుకునేందుకు యత్నించాడు. అతడిని గ్రామస్తులంతా కలిసి పట్టుకుని దేహశుద్ధి చేసి, అతడు తీసుకొచ్చిన ట్రక్కుకు తాళ్లతో కట్టేశారు. కొద్దిసేపటి తరువాత అక్కడకు అశ్వారావుపేటకు చెందిన ఓ మహిళ వచ్చింది. ‘‘ఇది నా వ్యాన్. ఇక్కడికెవరు తెచ్చారు..?’’అంటూ కేకలు వేసింది. ఆమెను కూడా అదే వ్యాన్కు గ్రామస్తులు కట్టేశారు. పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్ఐ వేల్పుల వెంకటేశ్వరరావు వచ్చారు. ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. పరారైన వారిని రామకృష్ణ, రాంబాబు గా అనుమానిస్తున్నారు.వారికోసం గాలిస్తున్నారు. -
మత్తులో ఉన్నట్లుగా నటించి..
డి.హిరేహాళ్: వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువకుడిని ఆమె భర్త దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించిన ఘటన సోమలాపురంలో జరిగింది. గ్రామంలోని ఓ మహిళ తన భర్త మద్యం మత్తులో ఉన్న సమయంలో రామాంజనేయులు అనే యువకుడిని పిలిపించుకుని వివాహేతర సంబంధం కొనసాగించేది. భార్య ప్రవర్తనపై అనుమానం కలిగిన ఆ భర్త గురువారం రాత్రి మద్యం మత్తులో ఉన్నట్లుగా నటించాడు. నిజంగా మత్తులో ఉన్నాడనుకున్న భార్య యథా ప్రకారం ఆ యువకుడిని పిలిపించుకుంది. ఇంట్లోకి రాగానే రామాంజనేయులును ఆమె భర్త పట్టుకుని, విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేయనున్నట్లు ఎస్ఐ వెంకటరమణ తెలిపారు. -
యువతి కిడ్నాప్కు యత్నం: నిందితులకు దేహశుద్ధి
పశ్చిమగోదావరి జిల్లా టి. నరసాపురం మండలం శ్రీరామవరంలో ఈ రోజు తెల్లవారుజామున కొంత మంది యువకులు ఓ యువతిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. అయితే ఆ యువతి బిగ్గరగా అరవడంతో స్థానికులు వెంటనే స్పందించి కిడ్నాప్నకు యత్నించిన యువకులను పట్టుకున్నారు. అనంతరం స్థానికులు యువకులను చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని యువకులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అలాగే యువకుల చెందిన వాహనాలను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.