breaking news
bcbhavan
-
‘పంచాయతీ’లో బీసీ రిజర్వేషన్లు తగ్గొద్దు
హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34% నుంచి 23%కు తగ్గకుండా సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవాలని 14 బీసీ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. విద్యానగర్ బీసీభవన్లో శనివారం జరిగిన 14 బీసీ సంఘాల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య పాల్గొని ప్రసంగించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నందున దీనికి రాజ్యాంగ సవరణ చేయడమే శాశ్వత పరిష్కారమన్నారు. ఇందుకోసం టీఆర్ఎస్ ఎంపీల ద్వారా కేంద్రంపై సీఎం కేసీఆర్ ఒత్తిడి పెంచి రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని కోరారు. సీఎం అ«ధ్యక్షతన అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని మోదీని కలిసి రాజ్యాంగ సవరణకోసం చొరవ తీసుకోవాలని కోరారు. బీసీ రిజర్వేషన్లు జనాభా ప్రకారం 34% నుంచి 56%కు పెంచాలని బీసీలు డిమాండ్ చేస్తుంటే కోర్టులు, ప్రభుత్వాలు మాత్రం 34% నుంచి 23%కు తగ్గించడం సరికాదన్నారు. సీఎం కేసీఆర్కు అభినందనలు తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన కేసీఆర్కు బీసీ సంఘాల సమావేశం అభినందనలు తెలిపింది. ఈసారైనా బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ అ«ధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, బీసీ నేతలు సి.రాజేందర్, మల్లేశ్యాదవ్, నీల వెంకటేశ్, టీఆర్.చందర్ పాల్గొన్నారు. -
9న ఐక్య వాల్మీకి ముఖ్యకార్యకర్తల సమావేశం
కల్లూరు (రూరల్): ఏపీ రాష్ట్ర ఐక్య వాల్మీకి పోరాట కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఈనెల 9 వ తేదీన బీ క్యాంపులోని బీసీ భవన్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు బి. ఈశ్వరయ్య అన్నారు. మంగళవారం చైతన్యపురి కాలనీలోని ఆ సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 తాలుకాల్లోని ఐక్య వాల్మీకి పోరాట కమిటీ అధ్యక్ష, కార్యదర్శులను త్వరలో జరిగే సమావేశంలో ఎన్నుకుంటామన్నారు.అలాగే వాల్మీకి జయంతి నిర్వహణపై చర్చించనున్నామని, వివిధ రంగాల్లో స్థిరపడిన వాల్మీకులందరూ హాజరు కావాలని కోరారు. సమావేశంలో ఐక్య వాల్మీకి పోరాట కమిటీ ట్రస్ట్ చైర్మన్ సుబ్రమణ్యం, జిల్లా ఉపాధ్యక్షుడు చిత్రసేనుడు పాల్గొన్నారు.