పాకిస్తాన్ టూర్.. అజ్ఞాతం వీడిన యూట్యూబర్ సన్నీ యాదవ్!
తెలుగు యూట్యూబర్, ట్రావెల్ వ్లాగర్ బయ్యా సన్నీయాదవ్(Bayya Sunny Yadav) కిడ్నాప్ డ్రామాకు తెరపడింది. నెల రోజులుగా కనిపించకుండా పోయిన సన్నీ యాదవ్ తాజాగా ఆంధ్రప్రదేశ్లోని సింహాచలంలో ప్రత్యేక్షమయ్యాడు. నెల క్రితం బైక్పై పాకిస్తాన్ వెళ్లి వచ్చిన అతను..చెన్నై ఎయిర్ పోర్ట్ నుంచి కనిపించకుండా పోయాడు. ఎయిర్పోర్ట్లో దిగగానే ఎన్ఐఏ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. పాకిస్తాన్కు వెళ్లి వచ్చిన సన్నీ యాదవ్.. అక్కడి ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐకి స్పైగా పని చేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఎన్ఐఏ అధికారులు అతన్ని అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదని సన్నీ యాదవ్ తండ్రి చెప్పడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో మరో యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్..సన్నీ దేశ ద్రోహి అంటూ పలు వీడియోలు చేయడంతో సన్నీ యాదవ్ ని కిడ్నాప్ చేశారేమోననే అనుమానాలు వచ్చాయి. అయితే తాజాగా సన్నీ యాదవ్ సింహాచలం వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి సస్పెన్స్కి తెర దించాడు. ‘నేను వచ్చేశా’ అంటూ సింహాచలం ఆలయం ముందు దిగిన ఫోటోని ఇన్స్టాలో షేర్ చేశాడు.అలాగే తనపై ఆరోపణలు చేసిన నా అన్వేష్ను లక్ష్యంగా చేసుకొని ఇన్స్టా స్టోరీలో వరుస పోస్టులు పెట్టాడు. ' అన్నయ్య నేనొచ్చేశా.. వైజాగ్ వెళ్తున్నా.. మీ ఇంటికెళ్తా.. అమ్మానాన్నకి ధైర్యం చెబుతా.. నువ్వు టెన్షన్ పడకు' అని వ్యంగ్యంగా పోస్ట్ పెట్టాడు. తనను గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని, ఇప్పుడే విడిచిపెట్టారని చెబుతూ.. రాబోయే నాలుగు రోజులు తనకు ఎంతో కీలకమని, ఇది హనీమూన్ కాదంటూ.. ఏదైనా ఎదుర్కొవడానికి రెడీగా ఉన్నానని’ రాసుకొచ్చాడు. ప్రస్తుతం సన్నీ యాదవ్ పోస్ట్ వైరల్గా మారింది. నెల రోజులుగా సన్నీ ఎక్కడ ఉన్నాడు? ఎన్ఐఏ అధికారులు నిజంగానే అదుపులోకి తీసుకున్నారా? లేదా? అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. View this post on Instagram A post shared by BAYYA SUNNY YADAV 🇮🇳 (@bayyasunnyyadav)