breaking news
bannar
-
వైరల్: మా ఇంటికి రాకండి.. మీ ఇంటికి రానివ్వకండి!
సాక్షి, కోల్సిటీ(రామగుండం): కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ప్రజలు అప్రమత్తమయ్యారు. ‘దయచేసి మా ఇంటికి రాకండి.. మీ ఇంటికి రానివ్వకండి..’ అంటూ ఇళ్లముందు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. రామగుండం నగరపాలక సంస్థ 31వ డివిజన్లోని ఎల్బీనగర్ వాసులు ‘కలిసికట్టుగా పోరాడుదాం.. కరోనా మహమ్మారిని ఖతం చేద్దాం.. మాస్క్ ధరిద్దాం, భౌతికదూరం పాటిద్దాం’అంటూ తమ ఇళ్ల ముందు ఏర్పాటు చేసుకున్న బ్యానర్లు ఆలోచింపజేస్తున్నాయి. గేటు దాటి రావొద్దు.. సాక్షి, జడ్చర్ల టౌన్: ‘నాతో పని ఉందా.. అయితే సెల్ నంబర్కు ఫోన్ చేయండి. ఎన్నికల ప్రచారమా.. కరపత్రాలు పక్కన బ్యాగులో వేసి వెళ్లండి. ఇంట్లోకి మాత్రం రావద్దు..’అంటూ తాళం వేసిన ఇంటిగేటుకు బోర్డు పెట్టాడు ఓ వ్యక్తి. కరోనా రోజురోజుకూ విజృంభిస్తుండటంతో మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని హౌసింగ్బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న క్రాంతి ఈ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. జడ్చర్లలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకోవడంతో అభ్యర్థులు, వారి అనుచరులు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ఈ మేరకు ఏర్పాటు చేశానని అతను చెప్పారు. కరోనాతో తండ్రీకొడుకుల మృతి రాయికల్ (జగిత్యాల): జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కట్కాపూర్కు చెందిన తండ్రీకొడుకులు కరోనా బారిన పడి తొమ్మిది రోజుల వ్యవధిలో మృతిచెందారు. కొడుకు గంట రంజిత్ (30) ఈ నెల 9న మృతి చెందగా.. తండ్రి గంట మల్లారెడ్డి (63) ఆదివారం ప్రాణాలు వదిలారు. కరోనాతో తండ్రీకొడుకులు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సామాజిక కార్యకర్తలు ఎనగందుల రమేశ్, కట్ల నర్సయ్య, సతీశ్ పీపీఈ కిట్లు ధరించి తండ్రీకొడుకుల అంత్యక్రియలు నిర్వహించారు. చదవండి: రికార్డు స్థాయిలో కరోనా: కొత్తగా 2,73,810 పాజిటివ్ కేసులు -
మట్టి వినాయకుని బ్యానర్ ఆవిష్కరణ
ఖమ్మం కల్చరల్ : పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టితో చేసిన వినాయకుడి విగ్రహాలను మాత్రమే వాడాలని జేసీ దివ్య అన్నారు. వాతావరణ కాలుష్యంతో కూడిన, నీటిలో కరగని ప్లాస్టర్ ఆఫ్ పారిస్, జిప్సమ్తో తయారు చేసిన విగ్రహాలను నిషేధించాలని రోటరీక్లబ్ ఆఫ్ స్తంభాద్రి ఆధ్వర్యంలో స్థానిక నాగసాయి ఇండియన్గ్యాస్, నాగుబండి డెంటల్ క్లినిక్ వారు ముద్రించిన ‘మట్టి వినాయక విగ్రహాలు’ వాడాలనే క్లాత్ బ్యానర్ను జాయింట్ కలెక్టర్ దివ్య చేతుల మీదుగా బుధవారం కలెక్టరేట్లో ఆవిష్కరింపజేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ స్తంభాద్రి అధ్యక్షుడు శ్రీనివాస్, దశాబ్ది ఉత్సవ కన్వీనర్ ప్రవీణ్కుమార్, నాగేష్, వేములపల్లి సీతారాంబాబు పాల్గొన్నారు.