breaking news
banglore accident
-
ఇదీ బెంగళూరు రోడ్ల పరిస్థితి.. ఇప్పుడు నా వంతు.. రేపు ఎవరివంతో?
సాక్షి,బెంగళూరు: దేశ ఐటీ రాజధాని, సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో రోడ్ల దుస్థితి మరోసారి తీవ్ర విమర్శలకు దారితీసింది. రోడ్డుపై కనిపించకుండా ఉన్న ఓ పెద్ద గుంత టెక్కీ పాలిట శాపంగా మారింది. ఈ ప్రమాదంలో ఆమె కాలు చీలమండలం తీవ్రంగా గాయపడగా, అత్యవసర శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది.ఐటీ ఉద్యోగిణి ఐషాని ఖన్నా గత నెలలో తన స్కూటర్పై ఆఫీసుకు బయలుదేరారు. వైట్ఫీల్డ్-వర్తూర్ రోడ్డులోని నెక్సస్ మాల్ సమీపంలో వెళ్తున్న సమయంలో భారీ వర్షం కారణంగా రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. అది గమనించని బాధితురాలు గుంతలో పడి అదుపుతప్పి కిందపడ్డారు.ఈ సంఘటనపై ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను వర్షంలో చాలా జాగ్రత్తగా స్కూటర్ నడుపుతాను. కానీ నీటితో నిండి ఉన్న ఆ గుంత నా కంటికి కనిపించలేదు. ఒక్కసారిగా స్కూటర్తో సహా కిందపడ్డాను. నా ఎడమ కాలి చీలమండలంపై తీవ్ర గాయాలయ్యాయి. అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరగా.. ప్లాస్టిక్ సర్జరీతో పాటు ఇతర వైద్య సేవల కోసం రూ. 1.97 లక్షల బిల్లు అయింది. గాయాలు పూర్తిగా తగ్గడానికి భవిష్యత్తులో మరో సర్జరీ కూడా చేయించుకోవాల్సి రావొచ్చు. కేవలం శారీరక నొప్పే కాకుండా, ఊహించని ఈ పరిణామం వల్ల తీవ్రమైన మానసిక వేదనకు, ఆర్థిక భారానికి గురయ్యామని వాపోయారు.గత 30 ఏళ్లుగా బెంగళూరులోనే ఉంటున్నానని, నగరంలో రోడ్ల పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోందని ఐషాని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ నేను అనుభవిస్తున్న నరకం రేపు మరెవరికైనా జరగవచ్చు. ఇప్పటికైనా రోడ్లను బాగు చేయండి అంటూ ఆమె అధికారులను, మంత్రులను ట్యాగ్ చేస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ ఘటనపై నగరవాసులు, రాజకీయ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోడ్ల అభివృద్ధి కోసం కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.hidden pothole on Varthur road cost me a crushed ankle, emergency plastic surgery, 5 days in hospital, and₹1.97L.This could happen to ANY of us tomorrow.Fix the roads now!@BBMPCOMM @GBA_office @krishnabgowda @BangaloreMirror @BangaloreTimes1 @BangaloreBuzz #bloreroads @gkcs_ pic.twitter.com/b5z4X2akmr— Aishani Khanna (@Aishani_Khanna) September 4, 2026 -
ఊపిరి తీసిన ఉపాధి
– బెంగళూరులో ప్రమాదవశాత్తు కిందపడ్డ వలస కూలీ –చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి కళ్యాణదుర్గంరూరల్: ఉపాధి కోసమని కర్ణాటక ప్రాంతానికి వెళ్లిన వలస కూలి మృత్యువాత పడిన సంఘటన ఆదివారం బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. మండల పరిధిలోని తూర్పు కోడిపల్లి ఎస్టీ కాలనీకి చెందిన నాగన్న(50) తనకున్న 3.80 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబ పోషణ సాగించే వాడు. ఈ క్రమంలో కొంత కాలంగా వర్షాలు పడక పంటలు పండక పోవడంతో కుటుంబ పోషణ భారమైంది. కనీసం గ్రామంలో ఉపాధి పనులు లేక పోవడంతో బెంగళూరుకు వలస వెళ్లాడు. కుటుంబ సభ్యులతో కలిసి రూపే నగర్ హెచ్ఎస్ఆర్ లే అవుట్ వద్ద ఉంటూ కూలి పనికి వెళ్లేవాడు. భవనంపైనుంచి కిందపడి.. మార్చి 26న అక్కడ ఇంటి నిర్మాణానికి నీరు పెడుతుండగా ప్రమాదవ శాత్తు మూడంతస్తుల మేడ పైనుంచి కిందకు పడ్డాడు. తలకు, నడుము, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని కుటుంబీకులు అక్కడే ఓ ప్రైవేట్ ఆస్పత్రికు తరలించారు. ఆదివారం అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామమైన తూర్పు కోడిపల్లి ఎస్టీ కాలనీకి తీసుకొచ్చారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఇక మాకు దిక్కెవరంటూ బోరున విలపించారు. అతడికి ఇద్దరు కుమారులు,ఒక కుమార్తెలు ఉన్నారు.


