breaking news
bangkok tour
-
థాయ్లాండ్ వెళ్లేవారికి కొత్త రూల్స్.. ముఖ్యంగా ‘క్యాష్’
భారతీయ పర్యాటకులకు అత్యంత ఇష్టమైన విదేశీ గమ్యస్థానాల్లో థాయ్లాండ్ ఒకటి. అయితే తాజాగా అక్కడి ప్రవేశ నిబంధనలు కఠినతరం కావడంతో ప్రయాణానికి ముందు అవసరమైన పత్రాలు, వీసా, ఇతర షరతులను తప్పనిసరిగా పరిశీలించాలని బ్యాంకాక్లోని భారత రాయబార కార్యాలయం సూచించింది. జూలై 2న విడుదల చేసిన తాజా అడ్వైజరీలో భారతీయులు థాయ్లాండ్కు బయలుదేరే ముందు పాటించాల్సిన కీలక మార్గదర్శకాలను వెల్లడించింది. ఇటీవల భారతీయ పాస్పోర్ట్దారులకు అమల్లో ఉన్న వీసా-రహిత ప్రవేశ విధానంలో మార్పులు వచ్చిన నేపథ్యంలో ఈ సూచనలు జారీ చేసినట్లు పేర్కొంది.రాయబార కార్యాలయం సూచనల ప్రకారం.. థాయ్లాండ్ చేరుకునే తేదీ నుంచి కనీసం ఆరు నెలల గడువు ఉన్న చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ తప్పనిసరి. అలాగే కన్ఫర్మ్ అయిన రిటర్న్ విమాన టికెట్, హోటల్ బుకింగ్, స్పష్టమైన ట్రావెల్ ఇటినరరీ (ప్రయాణ ప్రణాళిక) వెంట ఉండాలి. ప్రయాణికులు దేశంలో అడుగుపెట్టే 72 గంటల ముందు థాయ్లాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్ (TDAC)ను ఆన్లైన్లో తప్పనిసరిగా పూర్తి చేయాలి. దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ను ఇమ్మిగ్రేషన్ తనిఖీల సమయంలో చూపించాల్సి ఉంటుంది.వీసా, నగదు నిబంధనలుప్రయాణ ఉద్దేశానికి అనుగుణంగా సరైన వీసా పొందాలని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ముఖ్యంగా వీసా ఆన్ అరైవల్ (VOA) లేదా వర్తించే ప్రవేశ సదుపాయాన్ని వినియోగించే ప్రయాణికులు ఒక్కొక్కరు కనీసం 20,000 థాయ్ బాట్లు (సుమారు రూ.57,000–58,000) నగదు వెంట ఉంచుకోవాలని సూచించింది. అవసరమైతే దీనికి సంబంధించిన ఆధారాలను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడిగే అవకాశం ఉందని హెచ్చరించింది.ఉద్యోగం కోసం వెళ్తుంటే జాగ్రత్తథాయ్లాండ్లో ఉద్యోగం పొందిన వారు పర్యాటక వీసా లేదా వీసా ఆన్ అరైవల్పై దేశంలోకి ప్రవేశించకూడదని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఉపాధి కోసం వెళ్లేవారు ముందుగానే తగిన వర్క్ లేదా సంబంధిత వీసా తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే స్థానిక ఇమ్మిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణించే అవకాశం ఉంది. అలాగే థాయ్లాండ్ మీదుగా మరో దేశానికి వెళ్లే ట్రాన్సిట్ ప్రయాణికులు తమ తుది గమ్యస్థానానికి అవసరమైన వీసాలు, టికెట్లు, ఇతర పత్రాలను కూడా వెంట ఉంచుకోవాలని సూచించింది.ముఖ్యమైన చెక్లిస్ట్ ఇదే..చేరుకునే తేదీ నుంచి కనీసం 6 నెలల గడువు ఉన్న పాస్పోర్ట్.కన్ఫర్మ్ అయిన రిటర్న్ టికెట్.ధ్రువీకరించిన హోటల్ బుకింగ్.పూర్తి ప్రయాణ ప్రణాళిక.ప్రయాణానికి 72 గంటల ముందు పూర్తి చేసి TDAC క్యూఆర్ కోడ్ప్రయాణ ఉద్దేశానికి తగిన వీసావెంట కనీసం 20,000 థాయ్ బాట్ల నగదు.ఇమ్మిగ్రేషన్ కౌంటర్కు వెళ్లే ముందు అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోవడం.గ్రూప్గా వెళ్లినా ప్రతి ప్రయాణికుడు తన సొంత పత్రాలు కలిగి ఉండడం.ఉద్యోగం కోసం వెళ్తుంటే టూరిస్ట్ ఎంట్రీ సదుపాయాలను ఉపయోగించకపోవడం.ట్రాన్సిట్ ప్రయాణికులు తుది గమ్యస్థానానికి సంబంధించిన అన్ని పత్రాలు వెంట ఉంచుకోవడం.ప్రయాణానికి ముందు తాజా ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, వీసా అర్హతలు, అవసరమైన పత్రాలను మరోసారి ధ్రువీకరించుకోవాలని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులకు సూచించింది. దీంతో థాయ్లాండ్లో ప్రవేశ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా, ప్రయాణం సాఫీగా సాగుతుందని పేర్కొంది.Advisory for Indian nationals visiting Thailand. pic.twitter.com/wEAMyH7H0D— India in Thailand (@IndiainThailand) July 2, 2026 -
ఇట్స్ ఫ్యామిలీ టైమ్
‘ఉన్న ఒక్క లైఫు.. గాలి పటం టైపు.. ఎగిరితేనే సంబరం. ఓసారి ట్రై చేయ్...’ అంటూ ‘నేల టిక్కెట్టు’ చిత్రంలో జీవితంలోని ప్రతీ మూమెంట్ని ఆనందంగా ఎలా గడపాలో చెప్పారు రవితేజ. ప్రస్తుతం ఫ్యామిలీతో కలసి అలానే ఎంజాయ్ చేస్తున్నారాయన. ఒకేసారి రెండు సినిమా షూటింగ్స్లో బిజీగా ఉన్న రవితేజ షూటింగ్కి బ్రేక్ ఇచ్చి ‘ఇట్స్ ఫ్యామిలీ టైమ్’ అన్నారు. పిల్లలు మహాధన్, మోక్షదలతో కలసి బ్యాంకాక్ ట్రిప్కు వెళ్లారు. ‘‘ఈ ఆనందపు క్షణాలే జీవితకాలపు జ్ఞాపకాలు’’ అంటూ పిల్లలతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు రవితేజ. -
రాహుల్ వెళ్లింది ఎక్కడికి?
కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏకంగా 57 రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా అదృశ్యం అయిపోయి ఎట్టకేలకు తిరిగి వచ్చారు. ఢిల్లీ వచ్చిన తర్వాత కూడా ఆయన ఎక్కడా బయటకు రాలేదు. ఆయన తల్లి సోనియాగాంధీయే స్వయంగా రాహుల్ ఇంటికి వెళ్లి చూసి వచ్చారు. అయితే ఇన్నాళ్లూ రాహుల్ గాంధీ ఎక్కడకి వెళ్లారు.. ఏం చేశారన్న విషయం మాత్రం ఇంతవరకు ఎవరికీ స్పష్టంగా తెలియలేదు. అయితే ఆయన ప్రయాణించారని చెబుతున్న ఓ విమాన టికెట్ మాత్రం సంచలనం సృష్టిస్తూ నెట్ ప్రపంచంలో చక్కర్లు కొడుతోంది. అందులో వివరాలను బట్టి చూస్తే మాత్రం ఆయన ఫిబ్రవరి 16వ తేదీన బ్యాంకాక్ వెళ్లి, ఏప్రిల్ 16వ తేదీన అదే బ్యాంకాక్ నుంచి తిరిగి వచ్చినట్లు ఉంది. 'రాహుల్ఎంఆర్ గాంధీ' అనే పేరు మీద ఆ టికెట్ బుక్ అయి ఉంది. బ్యాంకాక్లోని సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయన దిగారు, అక్కడినుంచే మళ్లీ బయల్దేరారు. రెండుసార్లూ ఆయన థాయ్ ఎయిర్వేస్ విమానాన్నే తన ప్రయాణాలకు ఉపయోగించుకున్నారు. దాన్ని బట్టి చూస్తే, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో సెలవు తీసుకుంటానని వెళ్లిన రాహుల్ గాంధీ.. దాదాపు రెండు నెలల పాటు థాయ్లాండ్లోనే విశ్రాంతి తీసుకున్నారా, లేక అక్కడినుంచి ఇంకా ఎక్కడికైనా వెళ్లారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


