breaking news
Bandhan
-
ఇన్వెస్టర్లూ.. ఇదిగో ఈ ఫండ్ చూశారా?
లార్జ్క్యాప్ల స్థిరత్వంతో పాటు మిడ్క్యాప్ల వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకునే ఇన్వెస్టర్లకు ‘లార్జ్ అండ్ మిడ్క్యాప్’ ఫండ్లు ఆకర్షణీయమైన ఎంపిక. ఈ విభాగంలో ‘బంధన్ లార్జ్ అండ్ మిడ్క్యాప్ ఫండ్’ దీర్ఘకాలిక రాబడులు, వైవిధ్యమైన పోర్ట్ఫోలియోతో ప్రత్యేకతను చాటుతోంది. లార్జ్, మిడ్క్యాప్లతో పాటు ఎంపిక చేసిన స్మాల్క్యాప్ షేర్ల ద్వారా అదనపు వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫండ్ మూడు, అయిదు, ఏడు, పదేళ్ల కాలంలో కేటగిరీ సగటు, బెంచ్మార్క్ కంటే మెరుగైన ఎస్ఐపీ రాబడులను నమోదు చేసింది.పెట్టుబడి వ్యూహం సెబీ నిబంధనల ప్రకారం లార్జ్ అండ్ మిడ్క్యాప్ ఫండ్లు కనీసం 35 శాతం చొప్పున లార్జ్క్యాప్, మిడ్క్యాప్ షేర్లలో పెట్టుబడి పెట్టాలి. ఈ ప్రాతిపదికన బంధన్ ఫండ్ పోర్ట్ఫోలియోను అధిక వృద్ధి సామర్థ్యం, నాణ్యమైన కంపెనీలు (54%), థీమాటిక్–సైక్లికల్ అవకాశాలు (31%), వాల్యూ ఆధారిత పెట్టుబడులు (11%) అనే మూడు విభాగాలుగా నిర్మిస్తోంది. లార్జ్, మిడ్క్యాప్లతో పాటు ఎంపిక చేసిన స్మాల్క్యాప్ షేర్లలో పెట్టుబడుల ద్వారా బెంచ్మార్క్ కంటే అదనపు రాబడులను సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. మార్కెట్ పరిస్థితులు, వాల్యుయేషన్లు, వ్యాపార సైకిళ్లకు అనుగుణంగా రంగాలు, షేర్ల కేటాయింపులను ఎప్పటికప్పుడు మార్చుకోవడం దీని ప్రత్యేకత.రిస్క్ విశ్లేషణ గత ఐదేళ్లలో మిడ్, స్మాల్క్యాప్ షేర్ల ఉమ్మడి వాటా 57 శాతానికి పైగా పెరగడంతో ఫండ్ మరింత వృద్ధి ఆధారితంగా మారింది. దీంతో దీర్ఘకాలంలో అధిక రాబడులకు అవకాశం ఉన్నప్పటికీ, స్వల్పకాలంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉండొచ్చు. గత దశాబ్దంలో ఈ ఫండ్ రెండుసార్లు 18–19 శాతం, ఒకసారి దాదాపు 40 శాతం మేర క్షీణించింది. అందువల్ల 5–7 ఏళ్ల పెట్టుబడి కాలపరిమితితో ఎస్ఐపీ మార్గంలో పెట్టుబడి పెట్టడం సముచితం.ఎవరికి అనుకూలం కనీసం 5–7 ఏళ్ల పెట్టుబడి కాలపరిమితి ఉన్న ఇన్వెస్టర్లకు ఈ ఫండ్ అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఎస్ఐపీ ద్వారా క్రమబద్ధంగా పెట్టుబడి పెట్టేవారికి ఇది మెరుగైన ఎంపిక. అయితే, మిడ్, స్మాల్క్యాప్ కేటాయింపులు అధికంగా ఉండటంతో ఒక్కసారిగా భారీ మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం కంటే దశలవారీగా పెట్టుబడి కొనసాగించడం శ్రేయస్కరం. అలాగే, ఈ ఫండ్ను ఒక్క ఈక్విటీ ఫండ్పైనే ఆధారపడకుండా, లార్జ్క్యాప్ లేదా ఫ్లెక్సీక్యాప్ ఫండ్తో కలిపి పోర్ట్ఫోలియోలో భాగంగా ఉంచుకుంటే రిస్క్ బ్యాలెన్స్ అవుతుంది. పోర్ట్ఫోలియో కేటాయింపులుజూన్ 2026 నాటికి ఫండ్ పోర్ట్ఫోలియోలో లార్జ్క్యాప్లకు 38.5%, మిడ్క్యాప్లకు 35.6%, స్మాల్క్యాప్లకు 21.4% కేటాయింపులు ఉన్నాయి. మిగిలిన 4.5% నగదు, ఇతర ఈక్విటీయేతర ఆస్తుల్లో ఉంది. మిడ్, స్మాల్క్యాప్ల ఉమ్మడి వాటా 57 శాతానికి పైగా ఉండటం పోర్ట్ఫోలియోలో వృద్ధి ఆధారిత ధోరణిని సూచిస్తోంది. టాప్–10 హోల్డింగ్స్ వాటా 26.7 శాతానికే పరిమితం కావడం కొన్ని షేర్లపై అధికంగా ఆధారపడకుండా పోర్ట్ఫోలియోను వైవిధ్యంగా ఉంచుతోంది.రాబడుల పనితీరు దీర్ఘకాలిక ఎస్ఐపీ రాబడుల్లో ఈ ఫండ్ మూడు, ఐదు, ఏడు, పదేళ్ల కాలాల్లోనూ కేటగిరీ సగటు, బెంచ్మార్క్ను అధిగమించింది. రోలింగ్ రాబడులు: గత ఏడేళ్ల ఎన్ఏవీ చరిత్ర ఆధారంగా లెక్కించిన రోలింగ్ రాబడుల్లోనూ ఈ ఫండ్ నిలకడైన పనితీరును ప్రదర్శించింది. మూడేళ్లు, ఐదేళ్ల రోలింగ్ రాబడుల్లో కనిష్ట, సగటు, గరిష్ట మూడు ప్రమాణాల్లోనూ బెంచ్మార్క్ను అధిగమించడం దీర్ఘకాలిక పనితీరుకు నిదర్శనం. -
కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్.. 100 ఏళ్ల వరకూ బీమా రక్షణ
బంధన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వినూత్నమైన బీమా ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఇందులో 100 ఏళ్ల వయసు వరకు జీవిత బీమాను తీసుకోవచ్చు. పాలసీ కాలవ్యవధిలోపు పాలసీదారు మరణించినట్టయితే వారసులకు ఏక మొత్తం బీమా పరిహారాన్ని చెల్లిస్తుంది. అంతేకాదు అక్కడినుంచి క్రమం తప్పకుండా ఆదాయాన్ని చెల్లిస్తుంటుంది. గడువు తీరిన మెచ్యూరిటీ ప్రయోజనాలు కూడా లభిస్తాయి.కనీసం మూడు నెలల వయసు నుంచే ఈ పాలసీ తీసుకోవచ్చు. ఇలా తల్లిదండ్రులు, సంరక్షకులు చిన్న వయసు నుండే తమ పిల్లల కోసం ఆర్థిక రక్షణ కల్పించేందుకు వీలుంటుంది. విద్య, వివాహం లేదా ఇల్లు కొనుగోలు వంటి అవసరాలకు ఈ పాలసీ సహాయపడుతుంది. ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ అనువైన చెల్లింపు ఎంపికలతోపాటు మహిళా పాలసీదారులకు అదనపు రాబడిని కూడా అందిస్తుంది.స్వల్ప, దీర్ఘకాలిక ఆర్థిక అవసరాలను తీర్చేలా ఈ ప్లాన్ను రూపొందించారు. కస్టమర్లు తమకు సౌకర్యవంతమైన ఆదాయ చెల్లింపు ఎంపికలను ఎంచుకోవచ్చు లేదా తరువాతి దశలో ఆదాయాన్ని కూడబెట్టి ఉపసంహరించుకోవచ్చు. రోజువారీ ఖర్చులను నిర్వహించడం, అత్యవసర నిధిని నిర్మించడం లేదా భవిష్యత్తు లక్ష్యాల కోసం పొదుపు చేయడం, ప్రణాళిక వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. -
‘రాఖీ’ బంధన్
-
సిమ్ రీచార్జ్తో రెండో సిమ్కూ టాక్టైం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో క్రియాశీల మొబైల్ కనెక్షన్ల సంఖ్య దాదాపు 80 కోట్లు. వీరిలో మహిళా చందాదారుల సంఖ్య 30-35 శాతం ఉండొచ్చని అంటోంది టెలికం రంగ సంస్థ యునినార్. ఈ అంతరాన్ని తొలగించేందుకు తనవంతుగా ‘బంధన్’ పేరుతో రెండు సిమ్లతో కూడిన ప్యాక్ను త్వరలో దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టనుంది. ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ జిల్లాలో 87 గ్రామాల్లో ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద ఈ ప్యాక్ను పరిచయం చేసింది. మొదటి సిమ్కు ఎంత మొత్తమైతే రీచార్జ్ చేస్తారో అన్ని నిముషాల టాక్టైం రెండో సిమ్కు వచ్చి చేరడం దీని ప్రత్యేకత. ఉదాహరణకు రూ.50 రీచార్జ్ చేస్తే రెండో సిమ్కు 50 నిముషాల టాక్టైం జమవుతుంది. జీఎస్ఎం ఆపరేటర్ల ప్రపంచ సమాఖ్య.. జీఎస్ఎంఏతో కలిసి యునినార్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్పందన అనూహ్యం.. మొబైల్ ఫోన్ వాడని మహిళలు భారత్లో కోట్లలోనే ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో. మహిళలూ మొబైల్ ఫోన్లు వినియోగించేలా చేయడమే కార్యక్రమ ముఖ్యోద్ధేశమని యునినార్ సీఎంవో రాజీవ్ సేథి సాక్షి బిజినెస్ బ్యూరోకు సోమవారం తెలిపారు. ఈ ప్యాక్కు అనూహ్య స్పందన లభిస్తోందని వివరించారు. రెండు సిమ్లలో ఒకరు ఖచ్చితంగా మహిళ అయి ఉండాలన్న నిబంధన విధించామన్నారు. ప్రాజెక్ట్ సంపర్క్ పేరుతో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించామని.. ఫలితాలనుబట్టి ఆంధ్ర ప్రదేశ్తోసహా(తెలంగాణ, సీమాంధ్ర) అన్ని సర్కిళ్లకు బంధన్ను విస్తరిస్తామని రాజీవ్ తెలిపారు. కాగా, 7 నెలల ప్రాజెక్టులో భాగంగా యునినార్, జీఎస్ఎంఏకు చెందిన మొబైల్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్లు రూ.1.10 కోట్లను వెచ్చిస్తాయి. ప్రీపెయిడ్ కనెక్షన్లు, రీచార్జ్ వోచర్ల విక్రయంలో మహిళలకు యునినార్ శిక్షణ ఇవ్వనుంది.


