breaking news
balloon method
-
అంతరిక్షానికి ఎగిరే బెలూన్.. సీట్లు రిజర్వేషన్ చేయించుకుంటున్నారు
... ఎస్.. ఆ బెలూన్ భూ వాతావరణ పరిధిని దాటి అంతరిక్షం వరకు వెళుతుంది.. మనుషులను తీసుకొని మరీ! ఫేక్ కాదు ఫ్యాక్ట్. ఫ్లొరిడాలోని ఓ టూరిజం సంస్థ స్పేస్ బెలూన్ సవారీని టేకాఫ్ చేయనుంది. సుమారు లక్ష అడుగుల ఎత్తుకు.. కేవలం రెండు గంటల్లోనే మిమ్మల్ని తీసుకెళ్లగలదు. అక్కడికి చేరుకున్నాక మరో రెండు గంటలు ఆ అంతరిక్ష అందాలను వీక్షించడానికి, ఆస్వాదించడానికి అనువుగా అక్కడే చక్కర్లు కొడుతుంది. ఈ షికారులో ప్రయాణికులకు కావాల్సిన ఆహారాన్ని టూరిజం సంస్థ వారే సరఫరా చేస్తారు. అంతేకాదు ఈ బెలూన్లో ఒక కిచెన్, బార్, బాత్రూమ్ కూడా ఉంటాయి. తిరిగి నేలకు చేరుకోడానికి మరో రెండు గంటలు. మొత్తం ఆరుగంటల ఈ ప్రయాణంలో కేవలం ఎనిమిది మందికి మాత్రమే చోటు ఉంటుంది. బాగుంది కదూ! ఈ షికారును మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? కూసింత కరుసవుద్ది మరి! జస్ట్ రూ. 93 లక్షలు చెల్లించి, సీట్ బుక్ చేసుకుని.. 2024 వరకు వేచి చూడండి. హైడ్రోజన్ బెలూన్లు అంతపైకి ఎలా వెళ్లగలవనే కదా మీ డౌటా. ‘నాసా’ ఆధ్వర్యంలో అంతరిక్ష ప్రయాణ నిపుణులు వివిధ ప్రయోగాలు చేసి అతి తక్కువ బరువుతో ఎక్కువ దూరం ప్రయాణించే వాహనాన్ని రూపొందించారు. అది గురత్వాక్షరణ శక్తిని అధిగమించి అంతరిక్ష ప్రయాణానికి అనుకూలిస్తుంది. ఈ పద్ధతి ఉపయోగించే తాజాగా.. ఫ్లొరిడాలోని ఓ సంస్థ అంతరిక్షంలోకి విమాన ప్రయాణాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఆ విమానం మాదిరే ఈ బెలూన్ను నడిపేందుకూ ఒక స్పేస్ పైలట్, ఒక కో పైలట్ ఉంటారు. ప్రయాణికులు అంతరిక్ష సవారీని ఆస్వాదిస్తూ ఆ మధుర క్షణాలను బెలూన్ పారదర్శక గోడల నుంచి మీ మొబైల్ కెమెరాలతో ఫొటోలు, వీడియోలు కూడా తీసుకోవచ్చు. -
కత్తిగాటు లేకుండా గుండె ఆపరేషన్
14 ఏళ్ల బాలికకు బెలూన్ పద్ధతిలో చికిత్స చెన్నై: గుండె కవాటం మూసుకుపోయిన ఓ బాలికకు తమిళనాడు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు కత్తిగాటు లేకుండానే బెలూన్ పద్ధతి ద్వారా సమస్యను నివారించారు. అమిన్జికరాయ్కి చెందిన దివ్య(14) అనే బాలికకు ఐదేళ్ల వయసులోనే కీళ్లవాపు సంబంధ జ్వరం వచ్చింది. దీంతో గుండెపై ప్రభావం పడి ఆమె గుండెకు చెందిన ఓ కవాటం దెబ్బతింది. ఫలితంగా 6 సెం.మీ. వెడల్పు ఉండాల్సిన ఆ కవాటం ఒక సెం.మీ. వెడల్పుకు కుంచించుకుపోయింది. దీంతో ఆమె తరచూ తీవ్ర తలనొప్పి, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటూ వస్తోంది. ఐదేళ్ల క్రితం దివ్యకు ఓ ఆస్పత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసినా సమస్య అలాగే ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి శస్త్రచికిత్సకు బదులుగా ప్రభుత్వాసుపత్రి వైద్యులు బెలూన్ పద్ధతిలో చికిత్స నిర్వహించారు. రక్తనాళం గుండా సూక్ష్మకేశనాళిక సాయంతో ఓ బెలూన్ను పంపించి, కవాటం వద్ద విచ్చుకునేలా చేయడంతో కవాటం తగిన మేరకు వెడల్పు అయింది. సాధారణంగా ఈ చికిత్సకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.5 లక్షల వరకూ ఖర్చవుతుందని, కానీ పేద కుటుంబానికి చెందిన దివ్యకు ముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకం కింద ఉచితంగానే చికిత్స చేశామని వైద్యులు తెలిపారు.