-
సీఎం హామీకి మోక్షమెప్పుడో ?
‘‘పక్కనే కృష్ణమ్మ ఉంది. ఇక్కడి రైతులకు నీరందాలంటే నెల్లికల్ ఎత్తిపోతల అవసరం. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించండి. ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల్లోనే నెల్లికల్ లిఫ్ట్ పనులు ప్రారంభిస్తాం’’ హాలియాలో జరిగిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ.సీఎం హామీ నెరవేరుస్తారని తిరుమలగిరి మండలంలోని నెల్లికల్, జాల్తండా, ఎర్రచెరువుతండా, పిల్లిగుండ్లతండా, సఫావత్ండా, చెంచోనితండా, మూలతండా గ్రామాల రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికలు ముగిశాయి. కాలం గడిచిపోతోంది. కానీ నెల్లికల్ లిఫ్ట్పై ఎవరూ నోరు మెదపడం లేదని ఆయా తండాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలగిరి (నాగార్జునసాగర్) : అది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బహుళార్ధకసాధక ప్రాజెక్టు. ఎన్నో లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తూ... ఎంతో మంది గొంతును తడుపుతున్న కృష్ణమ్మ... కానీ పక్కనే మూడు కిలోమీటర్లు కూడా లేని నెల్లికల్ ప్రాంత ప్రజలకు మాత్రం తాగు, సాగు నీరు అందడం లేదు. ఈ సమస్యను తీర్చేందుకు సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా హామీ ఇచ్చినా నేటికీ అమలు కాలేదు. వివరాల్లోకెళితే...తిరుమలగిరి మండలంలోని నెల్లికల్, జాల్తండా, ఎర్రచెరువుతండా, పిల్లిగుండ్లతం డా, సఫావత్ండా, చెంచోనితండా, మూలతండా గ్రామాల రైతులకు సాగునీరందించే ఎత్తిపోతల పథకం ప్రకటనలకే పరిమితం అయింది. ఎత్తిపోతల పథకాన్ని నాయకులు, అధికారులు పట్టించుకోకపోడంతో రైతులు వర్షాలపైనే ఆధారపడి పంటను సాగుచేస్తున్నారు. వర్షాలు కూడా కాలాగుణంగా పడకపోవడంతో ప్రతి ఏటా రైతులకు ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో నిరాశచెందుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 4500 ఎకరాలు సాగులోకి నెల్లికల్ లిప్టు పూర్తయితే ఏడు గ్రామాల్లో 1500 కుటుంబాలకు సుమారు 4500 ఎకరాలకు సాగునీరందనుంది. ప్రతి ఏటా రాజకీయ నాయకులు ఎలక్షన్ టైంలో నెల్లికల్లో ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి అక్కడి భూములును సస్యశ్యామలం చూస్తామంటూ ఊకదంపుడు ప్రచారాలతో ప్రజలను, రైతులను మభ్యపెడుతూ ఓట్లను దండుకొని బయటపడుతున్నారు. అనంతరం అనుమతుల సాకుతో తప్పించుకుంటున్నారు. 2011 సంవత్సరంలోనే నెల్లికల్ ఎత్తిపోతల పథకాన్ని అప్పటి ఇరిగేషన్ శాఖ అధికారులు సుమారు రూ. 60 కోట్ల వ్యవయంతో ప్రతిపాదనలు తయారు చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి రైతులు నీటిని వాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు కూడా జారీ చేసింది. ఈ పథకం నిర్వాహణకు 1 /4 టీఎంసీల నీరు అవసరమని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. పంపుహౌస్లు నిర్మించి, మోటార్ల ద్వారా సాగునీరు అందించాల్సి ఉంటుంది. రెండు నెలలు కావస్తున్నా ఊసేలేదు.. లిప్టును ఏర్పాటు చేయకుండా నాయకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దాంతో ఎన్నికల సమయంలో లిప్టు పేరును చెప్పి తమ ఓట్లను దండుకుంటున్నారని, ఈసారి ఎన్నికలను బహిష్కరించాలని ఇటీవల రాష్ట్రంలో జరిగిన ముందస్తు శాసనసభ ఎన్నికల సందర్భంగా ఏడు గ్రామాల ప్రజలు తీర్మానం చేశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలుపు, ఓటములను కృష్ణపట్టె ప్రాంతం శాశిస్తుండటంతో టీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాంత ప్రజలకు గట్టి హామీనే ఇచ్చింది. ఈ సారి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపిస్తే ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల్లోనే స్వయంగా తానే వచ్చి కొబ్బరికాయ కొట్టి నెల్లికల్ లిప్టు పనులను ప్రారంభిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ హాలియాలో జరిగిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ప్రకటించడంతో ఏడు గ్రామాల ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వం ఏర్పడి రెండు మాసాలు కావస్తున్నా నేటికీ లిప్టు పనుల ప్రారంభ దిశగా అడుగులు పడకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. ఏళ్లుగా ఎదురుచూపులే లిప్టుకు సంబంధించిన ప్రాథమిక పనులను ప్రారంభించటానికి అటవీ అనుమతులు రావా ల్సి ఉండటంతో ఐడీసీ అధికారులు కలెక్టర్ ద్వా రా రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు. వణ్యప్రాణుల అభయారణ్యం కావడంతో పాటు సుమా రు 9 ఎకరాలు అటవీభూమి మీదుగా పైపులైన్ల నిర్మా ణం చేపట్టాల్సి ఉండటంతో కేంద్ర పర్యావరణ, అటవీశా ఖ ద్వారా అనుమతులు పొందాల్సి వచ్చింది. దీంతో పైపులైన్ల నిర్మాణంతో అడవికి జరిగే నష్టానికి ప్రత్యామ్నాయంగా నెల్లికల్లు రెవెన్యూ శివారులో సర్వే నంబర్ 299 /2లో గల సుమారు 9 ఎకరాల ప్రభుత్వ భూమిని అటవీశాఖకు అప్పగించడానికి ప్రతిపాదనలు చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పర్యావరణ, హరితట్రిబ్యూనల్కు ప్ర భుత్వ భూమిని బదలాయింపు ప్రతిపాదనలు రా ష్ట్ర అటవీ, ఐడీసీ అధికారుల ద్వారా చేరవేశారు. దీంతో గత సంవత్సరం డిసెంబర్ మాసంలో లిప్టు పనులతో అడవికి, అందులోని వణ్యప్రాణులకు ఏమైనా హాని ఉందా అని ఢిల్లీ నుంచి అధికారులు వచ్చి పరిశీలించినా ఫలితం లేకుండా పోయింది. సీఎం మాటపై నమ్మకముంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే తానే స్వయంగా వచ్చి నెల్లికల్ లిప్టుకు కొబ్బరికాయకొట్టి పనులు ప్రారంభిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రకటించారు. ముఖ్యమంత్రి సారు నోరువెంట నెల్లికల్ లిప్టు రావడంతో ఈసారి లిప్టు పనులు ప్రారంభమవుతాయని సంతోషపడ్డాం. ప్రభుత్వం ఏర్పడి రెండు మాసాలవుతున్నా నేటికీ పనులు ప్రారంభం కాకపోవడంతో బాధగా ఉంది. కేసీఆర్ సారు తన మాటకు కట్టుబడి నెల్లికల్ లిప్టును త్వరగా ప్రారంభించాలి. – మేకపోతుల గాలయ్య, రైతు, నెల్లికల్ వేల ఎకరాలు సాగులోకి లిప్టును ఏర్పాటు చేస్తే వేల ఎకరాల బీడు భూములు సాగులోకి రానున్నాయి. వర్షాలపై ఆధారపడి పంటలను సాగు చేసే రోజులు పోయాయి. వర్షాలు కూడా కాలానుగుణంగా పడకపోవడంతో ప్రతి ఏటా వేల రూపాయలు నష్టపోతున్నాం. ప్రభుత్వం చొరవ చూపి నెల్లికల్ లిప్టును త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలి. – బుర్రి భిక్షమయ్య, రైతు నెల్లికల్ -
కంతనపల్లిలో బొగ్గు నిల్వలు!
{పాజెక్టు ప్రతిపాదిత స్థలంలో నిక్షేపాలు వాప్కోస్ సర్వేలో వెల్లడి ! సాగునీటి ప్రాజెక్టుపై సర్కారు పునఃపరిశీలన వరంగల్: తెలంగాణలో కీలకమైన పి.వి.నర్సింహారావు కంతనపల్లి సుజల స్రవంతి బహుళార్థక ప్రాజెక్టు కొత్త మలుపు తిరుగుతోంది. వరంగల్ జిల్లా ఏటూరునాగా రం మండలం కంతనపల్లి గ్రామ సమీపంలో గోదావరి నదిపై ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలంలో బొగ్గు నిక్షేపాల ఆనవాళ్లు ఉన్నట్లు నివేదికలు వచ్చినట్లు తెలుస్తోంది. మట్టి పరీక్షల్లో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. కంతనపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం కేటాయించిన స్థలం లో భూమి స్థితిగతులను తెలుసుకునేందుకు ఏడాదిగా డ్రిల్లింగ్తో భూ సార పరీక్షలు నిర్వహించారు. 45 మీటర్ల లోతుల్లోని భూమిలో బొగ్గు తునకలు, ముక్కలు బయటకు రావడంతో సర్వే నిర్వహిస్తున్న సంస్థ, సాగునీటి శాఖ అధికారులు ఆశ్చర్యపోయారు. సాంకేతింగా బొగ్గు ఉన్నస్థలంలో ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టడానికి వీలు కాదు. కంతనపల్లి ప్రాజెక్టు నిర్మాణ స్థలంలో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు వాప్కోస్ కన్సల్టెన్సీ కంపెనీ సర్వేలో వెల్లడైంది. అధికారులు మాత్రం ఈ విషయా న్ని ధ్రువీకరించడంలేదు. శ్రీరాంసాగర్, దేవాదుల ప్రాజెక్టుల ఫలాలు తెలంగాణ ప్రజలకు పూర్తిస్థాయిలో అందాలంటే కంతనపల్లి ఒక్కటే మార్గమని సాగునీటి శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. సీఎం కేసీఆర్ ఈ ఏడాది మార్చి లో ఈ ప్రాజెక్టును సందర్శిం చారు. ఇక్కడే జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు కంతనపల్లి బ్యారేజీ నిర్మాణం కోసం ప్రభుత్వం వేగం గా ఏర్పాట్లు చేస్తోంది. తాజా బడ్జెట్లో కంతనపల్లి నిర్మాణానికి ప్రభుత్వం రూ.125 కోట్లను విడుదల చేసింది. ఇప్పుడు బొగ్గు నిక్షేపాల విషయంతో పరిస్థితిలో మార్పు వస్తోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
Advertisement