-
కొంగొత్త ఆశలతో.. ఈ ఏడాదిలో
పాల్వంచరూరల్: కోటి ఆశలతో కొంగొత్త సంవత్సరం ప్రవేశించింది. జిల్లా ప్రజలు ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. ఇటీవల కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వ కార్యాచరణ నిత్య నూతనం కావాలని కోరుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆవిర్భవించిన తర్వాత జిల్లా ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. రాష్ట్రంలోనే భద్రాద్రి జిల్లా పరిశ్రమల్లో ద్వితీయస్థానంలో ఉంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒక వైపు సింగరేణి బొగ్గు గనులు, మరో వైపు పాల్వంచలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్), ఎన్ఎండీసీ, సారపాక ఐటీసీ, అశ్వాపురంలో భారజల కర్మాగారం, అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలు జిల్లా సొంతం. ఇంకో వైపు పర్యాటక ప్రాంతాలూ ఉన్నాయి. కొత్త సంవత్సరంలో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు సీతారామ, మిషన్ భగీరథ ఫలాలు దక్కనున్నాయి. వంద కోట్ల పెట్టుబడితో భారజల కర్మాగారంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు, మణుగూరులో నిర్మిస్తున్న 1080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన భద్రాద్రి పవర్ ప్లాంట్ ఈ యేడాదిలో పూర్తికానున్నాయి. ఈ క్రమంలో దాదాపు 3వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. కొత్తగూడెంలో 1978లో ఏర్పాటైన మైనింగ్ ఇంజనీరింగ్ కళాశాల విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందాలని జిల్లా ప్రజలు ఆశ పడుతున్నారు. జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో మైలారం, రేగళ్ల అటవీ ప్రాంతంలో 850 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయ ఏర్పాటుకు కేంద్రం నుంచి కూడా గ్రీన్సిగ్నల్ లభించింది. విమానాశ్రయం నిర్మాణం జరిగితే జిల్లాకు మణిహారంగా మారనుంది. 30వ నంబర్ జాతీయ రహదారి సారపాకనుంచి రుద్రంపూర్ వరకు నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు 80శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలి 20శాతం పనులు కూడా నూతన సంవత్సరంలో పూర్తికానున్నాయి. గోదావరి జలాలతో మాగాణిని పావనం చేయాలనే లక్ష్యంతో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలో సాగునీటి ఢోకా ఉండదు. ఇంటింటికీ గోదావరి జలాలను అందించేందుకు రూ.2.242 కోట్ల వ్యయంతో చేపట్టిన మిషన్ భగీరథ ఇంట్రావిలేజ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రతి ఇంటికీ గోదావరి జలాలు అందనున్నాయి. దక్షిణ అయోధ్యగా కీర్తి గడించిన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తామని ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది. ఈ నూతన సంవత్సరలోనైనా నిధులు మంజూరు కావాలని భక్తులు ఆశగా ఎదురుచుస్తున్నారు. పోడు సాగుచేసుకున్న వందలాది మంది రైతులు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల కోసం ఆశగా నిరీక్షిస్తున్నారు. పండిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించే విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటే రైతులు అప్పుల ఊబిలోనుంచి ఈ ఏడాది గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి. ఉపాధి శాఖ గణంకాల ప్రకారం జిల్లాలో లక్షమందికిపైగా నిరుద్యోగులు ఉన్నారు. నూతన సంవత్సరంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో అభివృద్ధిలో మరింత ముందుకు సాగాలని జిల్లా ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. -
లక్ష కోట్లతో విద్యుదుత్పత్తి కేంద్రాలు
*భవిష్యత్తులో విద్యుత్ మిగులు రాష్ట్రంగా తెలంగాణ * 2018 ఫిబ్రవరి నాటికి 24 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి * భద్రాద్రి పవర్ ప్రాజెక్టు శంకుస్థాపనలో సీఎం కేసీఆర్ సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలో దాదాపు రూ. లక్ష కోట్లతో విద్యుదుత్పత్తి కేంద్రాలను నెలకొల్పుతున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వెల్లడించారు. మణుగూరు సమీపంలో 1,080 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రానికి శనివారం శంకుస్థాపన చేసిన అనంతరం సీఎం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2018 నాటికి తెలంగాణలో కొత్తగా నెలకొల్పే విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి సమృద్ధిగా విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందన్నారు. ఈ ఏడాది చివర్లోఆదిలాబాద్ జిల్లా జయపూర్ వద్ద 1,900 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన విద్యుదుత్పత్తి కేంద్రం ప్రారంభం కానుందన్నారు. అలాగే, కొత్తగూడెంలో 800 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానున్నదని తెలిపారు. కరెంటు కోతలనుంచి ప్రజలకు విముక్తి కలిగించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. శంకుస్థాపన చేసిన భద్రాద్రి పవర్ ప్రాజెక్టును 24 నెలల్లో పూర్తిచేసి తీరుతామన్నారు. ఈ ప్లాంట్ ఈశాన్యంలో ఉండటం వల్ల రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నారు. దుమ్ముగూడెం ప్రాజెక్టును ఖమ్మం ప్రజల అవసరాలకు ఉపయోగపడేలా డిజైన్ చేయాలని నిర్ణయించామన్నారు. జిల్లా రైతుల అవసరాల కు సాగునీటి ప్రాజెక్టులను సిద్ధం చేస్తామ న్నారు. 2018 ఫిబ్రవరికి రాష్ట్రంలో 24 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి కానున్నదన్నారు. భద్రాచలాన్ని అభివృద్ధి చేస్తాం తెలంగాణలో అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా ఉన్న భద్రాచలంను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తుందని, భద్రాచలం ప్రాంతంలో ఉన్న గోదావరీ తీరం, రామాలయం, పర్ణశాల వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే యోచనలో ఉన్నట్లు కేసీఆర్ చెప్పారు. భద్రాచలం మండలం నుంచి ఆంధ్రా ప్రాంతంలో కలిసిన 4 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలోకి తీసుకువచ్చేందుకు, ఈ అంశాన్ని ప్రధానమంత్రికి వివరిస్తానన్నారు. ఈ గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతామని, ఆయన సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. సమావేశంలో మంత్రులు నాయిని, తుమ్మల, జగదీశ్వర్రెడ్డి, ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతారాంనాయక్, ఎమ్మేల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు బాలసాని , పల్లా రాజేశ్వర్రెడ్డి, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు తదితరులు పాల్గొన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
లక్నోపై ఢిల్లీ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
AP: డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్
హీరోతో వివాదం.. ఊహించని షాకిచ్చిన డైరెక్టర్!
టీమిండియా హెడ్ కోచ్గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్..!?
తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
చెలరేగిన స్టబ్స్, అభిషేక్.. లక్నో ముందు భారీ టార్గెట్
వేలకోట్ల బ్యాంక్ ఫ్రాడ్.. డీహెచ్ఎఫ్ఎల్ ధీరజ్ వాధావన్ అరెస్ట్
ముంబై హోర్డింగ్ కుప్పకూలిన ఘటన,.. వెలుగులోకి కీలక విషయాలు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement