breaking news
Awareness of Convention
-
పది ఫెయిలైనా..కావచ్చు ఐఏఎస్!
* సివిల్స్ సాధించాలంటే.. సేవా గుణం ఉండాలి * ఇంగ్లిష్ వస్తేనే.. అపోహ మాత్రమే * తెలుగులో రాసిన చాలామంది కలెక్టర్లు అయ్యారు * ‘కోచింగ్’ నోట్స్ ఇస్తుంది.. నాలెడ్జ్ ఇవ్వదు * అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ ఇందూరు: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే చాలా మంది సివిల్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. కాని సమాజ సేవనే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళితే సివిల్స్ సాధించడం త్వరగా సాధ్య పడుతుందని కలెక్టర్ రొనాల్డ్ రోస్ అన్నారు. సమాజ సేవ కోసం సివిల్స్ చదివి ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటామని చెప్తారే కానీ, సమాజ సేవను ఎందుకు లక్ష్యంగా పెట్టుకోకూడదని అన్నారు. శుక్రవారం తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడారు. ప్రసంనికి ముందు సివిల్స్కు ప్రిపేర్ కావాలంటే ఏం చేయాలో సదస్సుకు వచ్చిన విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పిన వివరాలను ఓ విద్యార్థినిచే నోట్ చేయించారు. వారు చెప్పిన ఒక్కో అంశాన్ని తీసుకుని మాట్లాడుతూ... ప్రశ్నల వర్షం కురిపించారు. వారు వ్యక్తం చేసిన సందేహాలకు, ప్రశ్నలకు విద్యార్థుల చేతనే సమాధానాలు చెప్పిస్తూ తాను కూడా సమాధానాలు, సందేహాలను నివృత్తి చేశారు. దాదాపు గంటకు పైగా విద్యార్థులతో సంభాషించి కలెక్టర్ హోదాను పక్కనపెట్టి ఒక టీచర్గా మారిపోయారు. ప్రయివేటు విద్యా సంస్థల్లో చదువుతున్నవారే సివిల్స్కు సిద్ధమవుతున్నారని, ప్రభుత్వ సంస్థల్లో చదివిన వారు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. అయితే ఇంగ్లీషు వచ్చి ఉంటేనే పరీక్షలు రాయగలుగుతారనే విషయం ఇక్కడ చాల మంది చెబుతున్నారు. కాని తెలుగు నేర్చుకున్న వారు సివిల్స్ పరీక్ష రాసే అవకాశం ఉందని, తెలుగులో పరీక్షలు రాసి ఐఏఎస్లు అయినవారు చాలా మంది ఉన్నారని తెలిపారు. పరీక్షలు రాయకపోవడగానికి కూడా పట్టుదల లేకపోవడం, భయం, నమ్మకం లేకపోడం కూడా కారణమవుతాయన్నారు. చిన్ననాటి నుంచే బాగా చదివితేనే సివిల్స్ సాధిస్తామనేది ఒక అపోహ మాత్రమేనని, పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఫెయిలైనా.. తిరిగి పాసై సివిల్ పరీక్షలు రాసిన వారు ఎందరో ఉన్నారని తెలిపారు. 16 గంటలు చదివితేనే గోల్ సాధ్యమవుతుందని చాలా మంది గంటల తరబడి పుస్తకాలతో కుస్తీపడుతారని, ప్రస్తుత కాలంలో ఆ పద్ధతి పాటించడం లేదన్నారు. తాను చదువుకున్న కాలంలోనే రోజుకు 3 నుంచి 4 గంటల సమయం కేటాయించే వాడినని తెలిపారు. తమనకు ఏదీ నచ్చితే ఆదే చదవాలని, అదే నేర్చుకోవాలనే పట్టుదల ఉండాలని పోటీ పరీక్షలు నాలుగైదు సార్లు రాస్తే కాని అనుభవం రాదన్నారు. ఇంట్లో కూర్చుండి పరీక్షలకు సిద్ధం కావడం సాధ్యపడదని, అలాగని కోచింగ్ తీసుకుంటే అస్సలు సాధ్యపడదన్నారు. ఎందుకంటే కోచింగ్లో నోట్స్లభిస్తుందే కాని నాలెడ్జ్ లభించదన్నారు. అనుభవాజ్ఞులు, లేదా తోటి స్నేహితుల సహాలు,సూచనలు తీసుకుని ప్రశాంతమైన వాతావరణంతో మైండ్సెట్తో చదివితే లక్ష్యంగా నెరవేరుతుందన్నారు. వీటితో పాటు సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి దిన పత్రిలు, రాజ్యాంగానికి సంబంధించిన పుస్తకాలు చదివితే మరింత సులువుగా ఉంటుందన్నారు. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా సవిల్స్కు సిద్ధం కావడానికి మంచి అవకాశమని, దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాని సూచించారు.అయితే అన్ని ఉద్యోగాల కన్నా సివిల్స్ సాధించి ఉద్యోగం పొందడం గొప్ప విషయమని అన్నారు. సివిల్స్కు ఉన్న పాముఖ్యత అలాంటిదని అన్నారు. అన్ని రకాలుగా సమాజ చేయాలంటే సివిల్స్కు మించిన మార్గం మరొకటి లేదని స్పష్టం చేశారు. అనంతరం ప్రత్యేక శిక్షకుల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిణి విమలాదేవి, సహాయ సంక్షేమాధికారులు విజయ్కుమార్, శంకర్, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘మిషన్’ సక్సెస్ చేస్తాం
ప్రభుత్వం చిన్ననీటి వనరుల పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు అంతా కలిసి పని చేస్తామని జిల్లాలోని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ‘మిషన్ కాకతీయ’పై జిల్లా సాగునీటి పారుదల శాఖ వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీ ఎన్ఆర్ఐ అడిటోరియంలో మంగళవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేసింది. మిషన్ కాకతీయ అమలులో తీసుకోవాల్సిన అంశాలు, నిబంధనలను, చర్యలను మంత్రి హరీష్రావు తొలుత వివరించారు. అనంతరం జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారుల సూచనలు ఇవ్వాలని కోరారు. ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు మాత్రమే సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశం దక్కింది. కొందరు జెడ్పీటీసీ సభ్యులు వారి వినతి పత్రాలను మంత్రి హారీష్రావుకు అందించి వెనుదిరిగారు. - వరంగల్ రూరల్ సంక్షేమంతోపాటు అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాల అమలుతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది, తెలంగాణ పునరుద్ధరణలో భాగంగా చరిత్రాత్మక కట్టడాలైన దేవాలయాలు, కోట బురుజులను పరిరక్షించుకోవాలి. వీటి అభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందించాలి. కులవృత్తులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధ్యాన్యమిస్తున్నారు. - డాక్టర్ తాటికొండ రాజయ్య, డిప్యూటీ సీఎం బంగారు తెలంగాణకు సహకారం అందించాలి బంగారు తెలంగాణలో భా గంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు అందరు సహకారం అందించాలి. పనుల్లో నాణ్యత ఉండేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి. - గద్దల పద్మ, జెడ్పీ చైర్పర్సన్ విస్తృత ప్రచారం నిర్వహించాలి చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంపై గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలి. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించాలి. నగరంలోని రంగసముద్రం, దామెర చెరువు, భద్రకాళి, చిన్నవడ్డేపల్లి, కోట చెరువు, బెస్తం, గుండు, పెద్దకర్త చెరువు కట్టపై ట్యాంక్బండ్ను తీర్చిదిద్దాలి. కట్ట మైసమ్మ దేవతలకు గుళ్లు నిర్మించాలి. - కొండా సురేఖ, ఎమ్మెల్యే వరంగల్ తూర్పు కేబుల్ టీవీల్లో ప్రసారం చేయాలి మిషన్ కాకతీయపై ప్రజలకు, రైతులకు అవగాహన కల్పిం చేందుకు గ్రామాల్లోని కేబుల్ టీవీ ల్లో ప్రసారం చేయాలి. వీటిని ప్రసారం చేయడం ద్వారా విస్తృతంగా వారికి అవగాహన కలుగుతుంది. సీడీ రూపకల్పన చేయాలని భావిస్తున్నం దున మంత్రి హరీష్రావు సహకారం అందించాలి. అజ్మీరా సీతారాంనాయక్, ఎంపీ, మహబూబాబాద్ మట్టి అందరికీ అందాలి చెరువుల్లో తీసిన పూడిక మట్టి రైతులందరికి అందేలా నిబంధనలు పెట్టాలి. లేదంటే పెద్ద రైతులు వారి పొలాల్లో మొత్తం మట్టి తీసుకుపోతే సన్నకారు రైతులు ఇబ్బందులు పడతారు. ఈ విషయం జలవికాస కార్యక్రమంలో ఎదుర్కొన్నాం. రైతుల నుంచి డిమాండ్ వివరాలు తీసుకుని మిగతా మట్టిని పెద్ద రైతులు తీసుకపోయేందుకు అనుమతించాలి. నగర పరిధిలోని చెరువుల్లో మట్టిని ఖాళీ ప్లాట్లలో పోసుకునేలా కార్పొరేషన్ అధికారులు ఉత్తర్వులు జారీ చేయాలి. ఇందువల్ల ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండకుండా పోతుంది. - శౌరిరెడ్డి, బాల వికాస సంస్థ, ప్రతినిధి మంత్రి : మునిసిపల్ అధికారులతో మాట్లాడి ఈ ప్రతిపాదన అమలయ్యేలా ఆదేశాలు జారీ చేయిస్తాం. మట్టి తరలింపునకు రవాణా చార్జీలు తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చెరువుల నిల్వ సామర్థ్యం పెం చేందుకు పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టడం హర్షనీయం. గ్రామాల్లో పూడికతీత మట్టిని రైతులు 30 శాతం వరకు మాత్రమే తీసుకెళ్లే అవకాశముంది. పూడిక తీసిన మట్టిని పూర్తిస్థాయిలో తరలించేందుకు రవాణా చార్జీలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. మట్టి ఎంత లోతు తీయూలనే విషయూన్ని స్పష్టంగా ప్రచారం చేయాలి. పాకాల చెరువులో 3.75 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు నిధులివ్వాలి. - దొంతి మాధవరెడ్డి, ఎమ్మెల్యే నర్సంపేట మంత్రి : అన్ని విషయాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటాం ఎఫ్టీఎల్ పరిధిని నిర్ధారించాలి మహబూబాబాద్ పట్టణంలో ఉన్న పలు చెరువుల శిఖం భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఈ చెరువుల ఫుల్ట్యాంకు లెవల్ను నిర్ధారించి కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకోవాలి. నియోజకవర్గంలోని కంబాలపల్లి, ఈదులపూసలపల్లి, మైసమ్మ, నిజాం చెరువుల అభివృద్ధి మొదటి విడతలో పెట్టే విధంగా మంజూరు చేయాలి. - శంకర్నాయక్, ఎమ్మెల్యే మహబూబాబాద్ మంత్రి : తప్పకుండా నిధులు మంజూరు చేస్తాం.. గౌరారం వాగును మల్లూరు ప్రాజెక్టులోకి మళ్లించాలి మంగపేట మండలంలోని మల్లూరు వాగు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలంటే గౌరారం వాగు, కప్పవాగులను మళ్లించాలి. ఫీడర్ ఛానళ్ల మరమ్మతుకు నిధులు కేటాయించాలి. కొత్తగూడ మండలంలో అత్యధికంగా చెరువులున్నాయి. ఫారెస్ట్ అధికారుల అభ్యంతరాలతో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం మండలంలో విజయవంతమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. - అజ్మీరా చందూలాల్, ఎమ్మెల్యే ములుగు మంత్రి : అటవీ ప్రాంతంలో చెరువుల పునరుద్ధరణ పనులను ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవద్దు. చెరువులతో అడవులకు నష్టం కలుగుతుందని భావిస్తే పునరుద్ధరణ నిధులను అటవీశాఖకే కేటాయిస్తాం. ఇరిగేషన్ అధికారులు రూపొందించిన విధంగా పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఈ విషయంపై కలెక్టర్ నేతృత్వంలో ఇరిగేషన్ ఎస్ఈ, ఫారెస్టు అధికారులు సమావేశమై నిర్ణయం తీసుకోవాలి. మట్టి తరలించేందుకు నిధులు కేటాయించాలి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చెరువుల్లో తీసిన మట్టి ట్రాక్టర్లతో తీసుకెళ్లేందుకు నిధులు కేటాయించాలి. అందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేలా కృషి చేయాలి. ఎస్సారెస్పీ కాల్వలు తవ్వినప్పటికీ నీరు రావడం లేదు. పనులు పూర్తి కాకపోవడంతో నిరుపయోగంగా మారాయి. ఫీడర్ ఛానళ్లకు మరమ్మతులు చేయాలి. - డీఎస్ రెడ్యానాయక్, ఎమ్మెల్యే డోర్నకల్ మంత్రి : ఈజీఎస్లో ట్రాక్టర్ కిరాయిలు ఇవ్వరు. కేవలం మట్టి పొలాల్లో స్ప్రెడ్డింగ్ చేసుకునేందుకు అయ్యే వ్యయం ఇస్తామన్నారు. సీవరేజీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలి నగర పరిధిలోని చెరువులను తాగునీటి రిజర్వాయర్లుగా మార్చారు. అందువల్ల అందులోకి పక్కనే ఉన్న కాలనీల నుంచి వచ్చే మురుగునీరు చేరకుండా సీవరేజీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలి. బంధం, దర్గా చెరువులను అభివృద్ధి చేసి బోటింగ్ ఏర్పాటు చేయాలి. అయకట్టు లేని చెరువులను రిజర్వాయర్లుగా మార్చాలి. - వినయ్భాస్కర్, ఎమ్మెల్యే, వరంగల్ పశ్చిమ మంత్రి హరీష్రావు సమాధానం : సీవరేజి ప్లాంట్ల ఏర్పాటు విషయం సంబంధిత మున్సిపల్ శాఖతో చర్చంచి చర్యలు తీసుకుంటాం. బోటింగ్తోపాటు విడిది కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు పర్యాటక శాఖతో నిధులు కేటాయించేందుకు కృషి చేస్తాం. చెరువులను రిజర్వాయర్లుగా మార్చాలి వరంగల్ నగరానికి అనుకుని ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గం పూర్తిగా వెనుకబడి ఉంది. గ్రేటర్ వరంగల్లో భాగంగా 42 గ్రామాలు విలీనం కాగా అందులో 31 గ్రామాలు నా పరిధిలోవే. సాగుభూములను ప్లాట్లుగా చేయడంతో హన్మకొండ మండలంలోని పలు చెరువులు ఆయకట్టు లేకుండా ఉన్నాయి. ఇలా మారిన అమ్మవారిపేట చెరువు, భట్టుపల్లి, హసన్పర్తిలోని చెరువులను అభివృద్ది చేసి నగరవాసులకు తాగు నీరందించే స్టోరేజీ రిజర్వాయర్లుగా మార్చాలి. - అరూరి రమేష్, ఎమ్మెల్యే వర్ధన్నపేట మంత్రి : పూడికతీతలో తీసిన మట్టిని రైతులు తీసుకుపోగా మిగిలిన దాంతో బావుల బొందలు నింపేందుకు చర్యలు తీసుకుంటాం. మీ కోరికను పరిశీలించి న్యాయం చేస్తాం. ఎస్సీ, ఎస్టీలకు భూములివ్వాలి చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారించేందుకు నిర్ణయం తీసుకున్నందున అందులో ఏక్ ఫసల్ పట్టాలు తీసుకున్న ఎస్సీ, ఎస్టీలకు భూములు కొనుగోలు చేసి ఇ స్తే ఎలాంటి సమస్యలు రావు. కట్టు కా ల్వలను తప్పని సరిగా అభివృద్ధిచేయాలి. తద్వారా నిల్వ సామర్థ్యం పెరిగి మిషన్ కాకతీ య లక్ష్యం నెరవేరుతుంది. ఈ చెరువు పనుల్లో ఏ రాజ కీయ నాయకుడికి పర్సెంటెజీలు ఇవ్వొద్దు. ఎవరైనా అడిగితే ఫిర్యాదు చేయండి.. మంత్రి దృష్టికి తీసుకెళుతా. - కడియం శ్రీహరి, ఎంపీ, వరంగల్ అభివృద్ధిపై అభిప్రాయం మారాలి చెరువు పనులంటే లక్షల్లో లాభం వస్తుందన్న అభిప్రాయం అందరిలో ఉంది. ఈ ఆలోచన మారాలి. దేవాదుల పైప్లైను పోతున్నా ఎలాంటి ప్రయోజనం లేదు. ఎస్సారెస్పీలో నీరు లేనందున కాల్వలు నిరుపయోగంగా ఉన్నాయి. సాగు నీరందించేందుకు ప్రత్యేకంగా ప్రాజెక్టుకు రూపకల్పన చేయాలి. చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్యే, పరకాల