-
నిరాడంబర ప్రజా సేవకుడు సూరిబాబు
విజయనగరం మున్సిపాలిటీ : నిరాడంబర ప్రజా సేవకుడు మున్సిపల్ మాజీ చైర్మన్ దివంగత అవనాపు సూరిబాబు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అన్నారు. దివంగత సూరిబాబు 68వ జయంతి సందర్భంగా ఆయన కుమారులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్, విక్రమ్ సోదరుల ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మజ్జి శ్రీనివాసరావు ముఖ్యఅతిథి గా పాల్గొన్నారు. ముందుగా సూరిబాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ అవనాపు సూరిబాబు తన రాజకీయ జీవితంలో పేదల సంక్షేమం కోసం పరితపించారని, మున్సిపల్ చైర్మన్గా పట్టణ ప్రజలకు ఎన్నో సేవలందించారన్నారు. సూరిబాబు ఆశయ సాధనకు కృషి చేస్తూ తండ్రికి తగ్గ తనయులుగా విజయ్, విక్రమ్లు ఎదగాలని ఆకాంక్షించారు. తండ్రి ఆశయాలను సజీవంగా ఉండాలని ఆకాంక్షిస్తూ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అవనాపు సోదరులకు గుర్తింపును తెస్తాయన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్, విక్రమ్ సోదరులు మాట్లాడుతూ దానగుణం, పరోపకారం, సామాజిక సేవా కార్యక్రమాలు వంటి బాధ్యతలు తాము తమ తండ్రి నుంచి అలవర్చుకున్నామని, ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ ప్రజా సేవకు ప్రాధాన్యతనిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రంధి వినోద్ ఆధ్వర్యంలో 300 మంది విద్యార్థులకు పుస్తకాలు, అట్టలను వైఎస్సార్సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, అవనాపు సొదరులు పంపిణీ చేయగా... కాళ్ల నాయుడు మందిరం వద్ద 101 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. పార్టీ నాయకులు పిళ్లా విజయ్కుమార్, కాళ్ల గౌరీశంకర్, కౌన్సిలర్లు గాడు అప్పారావు, మున్సిపల్ మాజీ చైర్మన్ లెంక వరలక్ష్మి, మాజీ కౌన్సిలర్లు గదుల సత్యలత, మంచాల శివాని, దక్కు లక్ష్మి, ఎర్రంశెట్టి సునీత, పార్టీ నాయకులు ఉప్పు ప్రకాష్, డోలా మన్మధకుమార్, ఒమ్మి శ్రీను, చందక రమణ, మల్లు త్రినాధ్, పిలకా శ్రీను, గంటా సూర్యనారాయణ, తోట మధు, పతివాడ వెంకటరెడ్డి, రౌతు చంటి, అన్వర్ పాల్గొన్నారు. -
ప్రజాహితానికే ప్రాధాన్యం
మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ నేత కోలగట్ల విజయనగరం మున్సిపాలిటీ న్యూస్లైన్: తనకు పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేపట్టడంలో ఎన్నడూ ముందంజలో ఉంటానని, ప్రజాహితానికే ప్రాధాన్యం ఇస్తానని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నేత కోలగట్ల. వీరభద్రస్వామి అన్నారు. గత నెల 21న పట్టణ పెద్దల సమక్షంలో తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని, దానిని బుధవారం శాసన మండలి చైర్మన్ చక్రపాణితో ఆమోదింప చేసుకున్నానని అన్నారు. గురువారం ఆయన విజయనగరంలోని తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన 30ఏళ్ల రాజకీయ జీవితంలో ఎక్కువసార్లు ఓటమినే ఎదుర్కొన్నానని, పదవి ఉన్నా లేకున్నా అవసరమని తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికీ సేవలందించానన్నారు. ప్రజాసేవ కోసం ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి తన ఇంటి గేట్లు తెరిచి ఉంటాయని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తనపై పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు లబ్ధిపొందేందుకు దుష్ర్పచారాలు చేశారని మండిపడ్డారు. తనకు మద్దతుగా నిలిచిన అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఓటర్లు తలదించుకునే పని తానెప్పుడూ చేయనని వ్యాఖ్యానించారు. రాజకీయంలో గెలుపు ఓటములు సహజమని పదవి ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన పని చేస్తానని హమీ ఇచ్చారు. సమావేశంలో పార్టీ నాయకుడు మామిడి అప్పలనాయుడు మాట్లాడుతూ తమ నాయకుడు కోలగట్ల సంప్రదాయబద్ధంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఆమోదింపచేసుకున్నారని సమర్థించారు. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల కోసం పని చేసేందుకు కృషి చేస్తానన్నారు. మరో నాయకుడు అవనాపు విక్రమ్ మాట్లాడుతూ రాజకీయాల్లో మాటకు కట్టుబడి ఉండడం చాలా కష్టమని, అయితే దానిని కోలగట్ల చేసి చూపించారన్నారు. సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు ఎస్వీవీ రాజేష్, ఆశపు.వేణు, బంగార్రాజు తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
Advertisement