-
ఐటీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తి
సాక్షి, హైదరాబాద్: ఐటీ, లైఫ్ సైన్సెస్, రెన్యువల్ ఎనర్జీ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆస్ట్రేలియా కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని ఆస్ట్రేలియా–ఇండియా ఇన్స్టిట్యూట్ సీఈవో లిసాసింగ్ వెల్లడించారు. గురువారం ఇక్కడ ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్తో లిసాసింగ్ సమావేశమయ్యారు. భేటీ సందర్భంగా తెలంగాణ, ఆస్ట్రేలియా నడుమ వ్యాపార, వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చించారు. భారత్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, తెలంగాణతో వాణిజ్య సంబంధాల బలోపేతానికి తాము సిద్ధంగా ఉన్నామని లిసాసింగ్ పేర్కొన్నారు. భారత్– ఆస్ట్రేలియా మధ్య వ్యాపార, వాణిజ్య ఒప్పందాలపై చర్చ నడుస్తున్న సందర్భంగా ఇక్కడ పెట్టుబడులకున్న అవకాశాలను పరిశీలించేందుకు త్వరలోనే ఒక ప్రతినిధి బృందం భారత్లో పర్యటిస్తుందని చెప్పారు. ప్రగతిశీల తెలంగాణలో ఉన్న పరిస్థితులను ఆస్ట్రేలియా పారిశ్రామిక వర్గాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. -
కాగ్నిజెంట్ చేతికి ఆస్ట్రేలియా కంపెనీ
చెన్నై: ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీస్... ఆస్త్రేలియాకు చెందిన కన్సల్టింగ్, బిజినెస్ ట్రాన్స్ఫార్మేషన్ సర్వీసులందించే అడప్ట్ర సంస్థను కొనుగోలు చేసింది. డీల్కు సంబంధించిన ఆర్థిక వివరాలు వెల్లడికాలేదు. ఈకంపెనీ కొనుగోలుతో తమ బీమా వ్యాపార విభాగం మరింత శక్తివంతం కానున్నదని కాగ్నిజెంట్ వెల్లడించింది. కంపెనీ కొనుగోలులో భాగంగా అడప్ట్ర సంస్థకు చెందిన వంద మంది ఉద్యోగులు తమ సంస్థలో చేరతారని కాగ్నిజెంట్ హెడ్ (ఏషియా పసిఫిక్) జయజ్యోతి సేన్గుప్తా చెప్పారు. కొత్త వృద్ధి అవకాశాలు.. కాగ్నిజెంట్ కొనుగోలుతో కొత్త వృద్ది అవకాశాలు అందిపుచ్చుకోగలమని అడప్ట్ర ఎండీ పీటర్ ఓవర్టన్ పేర్కొన్నారు. కాగ్ని జెంట్ అంతర్జాతీయ అనుభవం, విస్తృతమైన డిజిటల్ శక్తి సామర్థ్యాల కారణంగా తాముభవిష్యత్తులో మరింత మెరుగైన సేవలందించగలమని వివరించారు. కాగ్నిజెంట్ టెక్నాలజీస్కు ప్రపంచవ్యాప్తంగా వంద డెవలప్మెంట్ సెంటర్లున్నాయి. 2.25 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా సిడ్నికేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అడప్ట్ర 1998లో ప్రారంభమైంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో అగ్రస్థాయి 10 బీమా కంపెనీల్లో ఐదింటికి తన సేవలనందిస్తోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్
కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి
నర్రెడ్డి నాటకాలు చాలు
థ్యాంక్స్ టూ మనీష్ మల్హోత్రా.. సమ్మర్ 2024 స్పెషల్ డిజైన్స్ (ఫొటోలు)
సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
టీ20 వరల్డ్కప్ 2024 కోసం మరో జట్టు ప్రకటన
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్
‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
హైదరాబాద్లో భారీగా భూమిని కొన్న మైక్రోసాఫ్ట్!
తప్పక చదవండి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement