breaking news
Attacked with sticks
-
థియేటర్కెళ్తే సినిమా చూపించారు!
ధర్మవరం : వినోదం కోసం థియేటర్కు వెళ్తే తమదైన శైలిలో ‘సినిమా’ చూపించారు ఆ థియేటర్ సిబ్బంది. ఈ సంఘటన ధర్మవరంలో శుక్రవారం జరిగింది. స్థానిక జోగోనికుంటకు చెందిన చేనేత కార్మికులు బిల్లే శ్రీనివాసులు, రాము, చాకలి శీనప్ప ఇక్కడి రంగా సినీ సెంట్రల్ థియేటర్కు మధ్యాహ్నం సినిమాకు వెళ్లారు. మూడు టిక్కెట్లు కొనుగోలు చేయగా, రెండు సీట్లు ఒక చోట, మరో సీటు ఇంకో చోట వచ్చింది. మూడు సీట్లు ఒకే చోట ఇవ్వాలని థియేటర్ వారిని అడిగారు. అందుకు వారు నిరాకరించగా, తమ డబ్బులు వెనక్కి ఇవ్వాలని కోరారు. డబ్బులు ఇచ్చేందుకు థియేటర్ సిబ్బంది ససేమిరా అనడంతో వారు మొండికేశారు. దీంతో థియేటర్ సిబ్బంది పది మంది ఏకంగా కర్రలతో వారిపై విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో పైన పేర్కొన్న ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. అంతటితో ఆగక వీధి రౌడీల్లా వారిని వీధుల్లో వెంటాడారు. ఘటనలో శ్రీనివాసులు తలకు కుట్లు పడగా, రాము చొక్కా చిరిగింది. అతని కాలికి సైతం గాయాలయ్యాయి. తమకు జరిగిన అన్యాయంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సినీ సెంట్రల్ థియేటర్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) నియోజకవర్గ ఇన్చార్జ్ నాయుడునాయక్ డిమాండ్ చేశారు. -
పాతకక్షలతో సర్పంచిపై దాడి
వెల్దండ(మహబూబ్నగర్): మహబూబ్నగర్ జిల్లా వెల్దండ మండలం జూపల్లి సర్పంచి చందూలాల్నాయక్పై గురువారం రాత్రి 9గంటల సమయంలో దాడి జరిగింది. గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఆయన్ను కర్రలతో తీవ్రంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన ఆయనను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పాత కక్షలతోనే గ్రామానికి చెందిన మాజీ సర్పంచి వెంకటయ్య వర్గీయులే తనపై దాడి చేశారని బాధితుడు ఆరోపించారు. -
కొండసముద్రంలో టీడీపీ నాయకుల దాష్టీకం
వలేటివారిపాలెం, న్యూస్లైన్ : మండలంలోని కొండసముద్రంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు శనివారం రాత్రి దాడికి దిగారు. సార్వత్రిక ఎన్నికల్లో కందుకూరు ఎమ్మెల్యేగా వైఎస్సార్ సీపీ అభ్యర్థి పోతుల రామారావు విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామంలో ఊరేగింపు నిర్వహించాలని ప్రయత్నించగా టీడీపీ నాయకులు భయభ్రాంతులకు గురి చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గ్రామస్తులు కలుగజేసుకుని అందరికీ సర్ది చెప్పారు. ఆ రోజు నుంచి వైఎస్సార్ సీపీ నాయకుడు కొల్లి మాధవ ఇంటి ముందు టీడీపీ నాయకుడు కావాలనే ట్రాక్టర్ అడ్డు పెట్టి రోజూ ఇబ్బంది పెడుతున్నాడు. ఈ నేపథ్యంలో ముందస్తు ప్రణాళిక ప్రకారం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు మన్నం వెంకట రమేష్ను మాట్లాడాలని పక్కకు పిలిచి ఒక్కసారిగా అతనిపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఏమి చేయాలో అర్థంకాని రమేష్.. అందరినీ నెట్టుకుంటూ తన ఇంటివరకు వెళ్లాడు. గమనించిన అతని తల్లి పెద్దగా కేకలు వేయగా రమేష్ అనుచరులు వచ్చి టీడీపీ నాయకులను అడ్డుకున్నారు. అప్పటికే సిద్ధంగా ఉన్న కారం, కర్రలతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి చేశారు. నిందితుల్లో మన్నం నాగేశ్వరరావు, కొల్లి గోపి, మన్నం చిరంజీవి, మాదాల మాల్యాద్రి, ఉన్నం సురేష్, పరుచూరి మాలకొండయ్య, ఉన్నం వెంకటేశ్వర్లు, మాదాల కొండయ్య, నువ్వుల చిన బ్రహ్మయ్య, నలమోతు రాంబాబు, గట్టమనేని శివన్నారాయణ ఉన్నారని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వివాదం ముదరడంతో గ్రామస్తులు ఎస్సై సాంబశివయ్యకు సమాచారం అందించారు. ఎస్సై తన సిబ్బందితో శనివారం రాత్రి గ్రామంలోకి వెళ్లి గొడవ పెద్దది కాకుండా చర్యలు తీసుకున్నారు. అనంతరం 144 సెక్షన్ విధించారు. ఆదివారం ఇరువర్గాల నాయకులను పోలీసు స్టేషన్కు పిలిచి మాట్లాడారు. గ్రామంలో అలజడులు సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ మేరకు నాయకుల నుంచి రాత పూర్వక హామీ తీసుకున్నారు. ఇరువర్గాల నాయకులపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎస్సై సాంబశివయ్య తెలిపారు. కుంకలమర్రులో.. చీరాల రూర ల్, న్యూస్లైన్ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ మహిళా కార్యకర్తపై టీడీపీ వర్గీయులు దాడి చేసి గాయపరిచారు. ఈ సంఘటన కారంచేడు మండలం కుంకలమర్రులో ఆదివారం జరిగింది. బాధితురాలు ఔట్పోస్టు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పందరబోయిన లక్ష్మి తన భర్తకు అనారోగ్యంగా ఉండటంతో చీరాల వెళ్లి చికిత్స చేయించి భర్తతో కలిసి తిరిగి స్వగ్రామానికి వస్తోం ది. ఇంటికి వెళ్తున్న దంపతులను టీడీపీకి చెందిన పి.కల్పన, శ్రీకాంత్తో పాటు మరో ముగ్గురు కలిసి దాడి చేశారు. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ఎందుకు పని చేశారంటూ దుర్భాషలాడారు. అంతటితో ఆగకుండా కత్తితో దాడిచేయబోగా చేయి అడ్డుపెట్టడంతో లక్ష్మి చేయి తెగింది. క్షతగాత్రురాలిని చికిత్స కోసం చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.