-
మిగ్ జాం తుఫాన్ బీభత్సంతో కుదేలైన రైతులకు ప్రభుత్వం భరోసా
-
అందరినీ ఆదుకుంటాం
సాక్షి, ముంబై: ఇటీవలి భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హామీ ఇచ్చారు. బాధితులందరికి వెంటనే ఆర్థిక సాయం ప్రకటించి, దాన్ని అమలు చేయడంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూస్తామని పేర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వరద ముంపునకు గురైన గ్రామాల్లో సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం పర్యటించారు. చిప్లూన్లో వరదకు గురైన ప్రాంతాలను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులు, వ్యాపారస్తులతో మాట్లాడారు. ఆ ప్రాంతంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ప్రభుత్వం తరఫున చేయాల్సిన సాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం మాట్లాడారు. వరదల కారణంగా నష్టపోయిన బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సింధుదుర్గ్, రత్నగిరి, రాయ్గఢ్, సాతారా, సాంగ్లీ, కొల్హాపూర్ జిల్లాల్లో జరిగిన నష్టంపై పంచనామా నిర్వహించి ఎంత మేర నష్టం వాటిల్లిందో అంచనా వేస్తామన్నారు. ఈ విషయానికి సంబంధించి జిల్లా కలెక్టర్లు, రీజినల్ కమిషనర్లకు సూచనలు ఇచ్చినట్లు చెప్పారు. రెండు, మూడు రోజుల్లో నివేదిక రాగానే బాధితులు అందరికి ఆర్థిక సాయం అందజేస్తామని స్పష్టం చేశారు. అయితే, ఆలోపు తాత్కాలికంగా తక్షణమే కొంత ఆర్థిక సాయం చేసేలా ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. ‘అనేక చోట్ల రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. పంటలు, తోటలకు అపార నష్టం జరిగింది. బాధితులు అందరికీ సాధ్యమైనంత త్వరగా ఆర్థిక సాయం అందించే ప్రయత్నం చేస్తాం’అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటికే వరద బాధితులు అందరికీ బియ్యం, గోధుమలు, కిరోసిన్, ఇతర వంట సామగ్రి, దుస్తులు పంపిణీచేసే కార్యక్రమాన్ని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. కేవలం పబ్లిసిటీ కోసం ఆదరా బాదరగా ఇప్పుడే ఎలాంటి ప్రకటన చేయబోనని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి కూడా ఎంత మేర సాయం కోరాలా అనేది త్వరలో నిశ్చయిస్తామన్నారు. సాధ్యమైనంత ఎక్కువ ఆర్థిక సాయం అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నామని చెప్పారు. గతంలో వరద, ఇతర ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు బాధితులకు ఆర్థిక సాయం అందించడంలో అనేక సాంకేతిక పరమైన ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. కానీ, ఇప్పుడు అలాంటి సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని అందరికీ న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ సాయం అందేలా చూస్తామని పేర్కొన్నారు. అందుకు అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపామని చెప్పారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా అందరికీ ఆర్థిక సాయం అందేలా చూస్తామని స్పష్టం చేశారు. కరోనా వల్ల ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందన్నారు. భవిష్యత్తులో ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వ సాయం అవసరం ఉంటుందని తెలిపారు. రక్షణ బలగాలకు చెందిన కొన్ని బృందాలను పంపి కేంద్రం సాయం చేసిందన్నారు. సోమవారం తాను పశ్చిమ మహారాష్ట్రలో పర్యటిస్తానని, జరిగిన నష్టంపై నివేదిక తయారుచేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కాగా, అంతకుముందు చిప్లూన్ సందర్శనకు వచ్చిన ముఖ్యమంత్రి కాన్వాయ్ని స్థానికులు అడ్డుకున్నారు. వర్షాల వల్ల తాము ఎదుర్కొంటున్న నరకయాతనను వారు ముఖ్యమంత్రికి వివరించారు. తమకు తక్షణమే సాయం అందించాలని వేడుకున్నారు. -
ఉద్యోగుల వెన్నుతట్టేలా..
అగనంపూడి (గాజువాక): కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)లో ఉద్యోగాలు చేస్తున్న వేలాది మంది ఉద్యమాలు పట్టినా పట్టించుకోని సీఎం చంద్రబాబు నాయుడి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సీపీఎస్ ఉద్యోగులకు జగనన్న హామీ భరోసా నిస్తున్నాయి. హర్తాళ్లు, ధర్నాలు, రాస్తారోకోలు పికెటింగ్లు చేసినా చలించని చంద్రబాబు తీవ్రంగా అన్యాయం చేశారని ఆయా వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సీపీఎస్ వల్ల.. జిల్లాలో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)లో 14,100 మంది ఉద్యోగులకు జగన్ భరోసాతో మేలు జరుగనున్నది. వీరిలో 6వేల మంది ఉపాధ్యాయులుగా, మిగతా 8 వేల మంది వివిధ విభాగాల్లో సేవలందిస్తున్నారు. పీఆర్సీ అంటే వైఎస్సార్ పే రివిజన్ కమిషనర్ (పీఆర్సీ) అంటే గుర్తుకు వచ్చేవి దివంగత సీఎం వైఎస్ పాలనలో రోజులు. ఆయన రెండు విడతల పీఆర్సీలు అమలు చేయడంతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయ ఐక్య సంఘాలు ఆశించిన దానికంటే ఒకింత ఎక్కువ ప్రకటించి ఉద్యోగుల, వారి కుటుంబాల కళ్లలో కాంతులు నింపిన వైఎస్సార్ నేటికీ ఉద్యోగ, ఉపాధ్యాయుల మదిలో కొలువై ఉంటారు. అటువంటి భరోసా మళ్లీ జగన్ సీఎం అయితే దక్కుతుందని అత్యధిక శాతం ఉద్యోగులు విశ్వసిస్తున్నారు. జిల్లాలో వివిధ విభాగాల్లో 2,617 మంది గెజిటెడ్, 26,230 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, 5,557 మంది నాల్గో తరగతి ఉద్యోగులు, 18,737 మంది ఇతరులు మొత్తమ్మీద 51,141 మంది ఉద్యోగులకు జగన్ హామీ వల్ల లబ్ధి చేకూరనుంది. అర్హతను బట్టి రెగ్యులర్... కాంట్రాక్ట్ ఉద్యోగులు అనే పదాన్ని, విద్యాధికులతో వెట్టి చాకిరీ చేయించుకొని కనీస వేతనాలు కూడా చెల్లించని విధానానికి చంద్రబాబే శ్రీకారం చుట్టారు. అదే చంద్రబాబు 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు. రెగ్యులర్ మాట దేవుడెరుగు కనీస వేతనాలకు కూడా నోచుకోని పరిస్థితుల వల్ల ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి. ఈ తరుణంలో ప్రజాసంకల్పయాత్రలో జగన్ను కలిసిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు తాను ఉన్నానని భరోసా ఇచ్చారు. అన్ని అర్హతలు ఉండి ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా విధులు నిర్వహిస్తున్న వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ప్రకటించారు. అవకాశం లేని వారిక కనీస వేతన చట్ట ప్రకారం జీతాలు చెల్లిస్తామని ఆయన ఇవ్వడంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. దీనివల్ల జిల్లాలో ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న సుమారు 22 వేల మందికి ప్రయోజనం చేకూరనుంది. వీరిలో ఒక్క విద్యా విభాగంలోనే 2,500 మంది సీఆర్పీలు, ఐఆర్టీయూ, డీఎంఎల్టీలు, మెసెంజర్లు, ఐఈ కోర్డినేటర్లు, సైట్ ఇంజనీర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, పార్ట్ టైమ్ ఇనస్ట్రక్టర్లు, కస్తూర్బా పాఠశాలల్లో పనిచేస్తున్నారు. ఉద్యోగికి పదవీ విరమణ తదనంతర జీవితానికి భరోసా పెన్షన్... ఆ పెన్షన్కు పంగనాలు పెట్టించి ఇప్పుడు తన చేతిలో లేదని మొండి చేయి చూపిస్తున్న చంద్రబాబు అసలు ఈ విధానానికి మన రాష్ట్రంలో పచ్చ జెండా ఊపింది కూడా ఆయనే. సీపీఎస్ అమలు రాష్ట్రాల ఐచ్చికం అని కేంద్రం స్పష్టం చేసినా, నేడు కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఇచ్చిన భరోసా ఉద్యోగుల్లో కొండంత ధైర్యాన్నిచ్చింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే సీపీఎస్ రద్దు ఫైల్పై సంతకం చేస్తానని ప్రకటించడాన్ని సీపీఎస్ ఉద్యోగులు పూర్తిగా విశ్వసిస్తున్నారు. సీపీఎస్ రద్దు చేస్తామన్న జగన్కే మద్దతు – జాకీర్ ఆలీ, జిల్లా అధ్యక్షుడు, సీపీఎస్ పోరాట కమిటీ కన్వీనర్, యూటీఎఫ్ సీపీఎస్ రద్దు చేసే వారికి సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగులు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వంపై ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు తెచ్చినా ప్రయోజనం లేకుండా పోయిం ది. కంట్రిబ్యూటరీ పెన్షన్ అనేది ఒక దోపిడీ విధానం. కష్టపడి 30 ఏళ్లు పనిచేసే ఉద్యోగికి పింఛన్ అనేది హక్కు. ఉద్యోగుల జీతాల నుంచి కోసిన మొత్తాన్ని షేర్ మార్కెట్లో పెట్టడం, ఉద్యోగి పదవీ విరమణ పొందే నాటికి ఆ షేర్ విలువను బట్టి సొమ్ము తిరిగి చెల్లించడం అనేది జూదం లాంటిది. సీపీఎస్ రద్దు చేస్తామన్న జగన్మోహన్రెడ్డికి ఉద్యోగులు మద్దతు లభిస్తుంది. జగన్తోనే ఉద్యోగుల సంక్షేమం – పి. రాధారాణి, సైన్స్ అసిస్టెంట్ ఉద్యోగులు కూడా ప్రజల్లో ఒక భాగమనే విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వం విస్మరించింది. ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావాల్సిన కరువు భత్యం (డీఏ) మూడు విడతలు, చట్ట ప్రకారం గడువు తేదీకి ఇవ్వాల్సిన పీఆర్సీని అమలుచేయకుండా నిర్లక్ష్యగా వ్యవహరిస్తోంది. ఉద్యోగుల పక్షపాతిగా వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా దివంగత సీఎం వైఎస్ పీఆర్సీ అమలు చేశారు. ఆయనలా పట్టుదల, ధైర్యం, నమ్మకం, విశ్వాసం ఉన్న జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే మెరుగైన పీఆర్సీ అమలు చేస్తానని హామీ ఇవ్వడం సంతోషంగా ఉంది. మాట మీద నిలబడే మనస్తత్వం ఉన్న జగన్ మాటలను విశ్వసిస్తున్నాం. జగన్ హామీని నమ్ముతున్నాం – ఎస్. కూర్మారావు, సీపీఎస్ ఉద్యోగి సీపీఎస్ రద్దు చేయాలని పలు విడతల్లో ఆందోళనలు చేపట్టాం. ముట్టడి చేశాం. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రతిపక్ష నేత జగన్కు సమస్యను వివరించాం. ఆయన పాదయాత్రలో పలుమార్లు స్పష్టంగా హామీ ఇచ్చారు. ఆయన పలు సందర్భాల్లో సీపీఎస్ అనే దోపిడీ పెన్షన్ విధానానికి ఫుల్స్టాప్ పెడతానని ప్రకటించారు. ఆయన ముఖ్యమంత్రి ఐతే సీపీఎస్ భేషరతుగా రద్దు చేస్తానని సీపీఎస్ ఉద్యోగులకు, సంఘాలకు హామీ ఇచ్చారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా పెడతామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో పనిలేకుండా చేస్తామని హామీ ఇవ్వడం సంతోషంగా ఉంది. జగన్ మాటలను నమ్ముతున్నాం. ఆయన ఉద్యోగులను మోసం చేయడని విశ్వసిస్తున్నాం. భద్రత కల్పిస్తామనడం అభినందనీయం ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉద్యోగ భద్రత కల్పించాలి. దశాబ్దాలుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వేలాది మంది కనీస వేతనాలకు నోచుకోవడం లేదు. జిల్లాలో సుమారు 22వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. జగన్ సీఎం కాగానే అర్హత ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయనున్నట్టు ప్రకటించడం సంతోషంగా ఉంది. – కింతాడ అప్పారావు, రాష్ట్ర అధ్యక్షుడు, సీఆర్పీల సంఘం ఉద్యోగుల వ్యతిరేకి చంద్రబాబు – బి.గణేష్, ఉపాధ్యాయుడు రాష్ట్రం అప్పుల్లో ఉందంటూనే దుబారా ఖర్చులు చేస్తున్నారు. ఉద్యోగుల కరువు భత్యాన్ని వాయిదా పద్ధతిలో చెల్లిస్తామంటున్నారు. ఏడాదిన్నర ఆలస్యంగా ప్రకటించడం, వాటిని కూడా వాయిదాల్లో చెల్లిస్తామని హామీ ఇవ్వడం బాధాకరమైన విషయం. ఉద్యోగులంటే ప్రభుత్వంలో భాగం కాదని పాలకులు భావిస్తున్నారు. ఉద్యోగులు కూడా మనుషులే, వారు ప్రభుత్వంలో భాగమే అని విశ్వసించే పాలకులు వస్తే తప్పా ఉద్యోగులకు డీఏలు విడతల్లో తప్పవు. జగన్ ఆ భరోసా ఇస్తానని చెబుతుండడంతో ఉద్యోగులు ఆయన మాటల్ని విశ్వసిస్తున్నారు. చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో నేను మారాను, ఉద్యోగుల పక్ష పాతిగా ఉంటానని హామీ ఇవ్వడంతో ఉద్యోగులు ఆయన మాటల్ని విశ్వసించారు. కానీ ఆయనకు ఉద్యోగులంటే గిట్టదని ఈ ఐదేళ్లలో నిరూపించారు. వేతన సవరణ వైఎస్ చలువే – బి.శ్రీనివాసరావు, ఉపాధ్యాయుడు బతకలేక బడి పంతులు అనే నానుడి ఉండేది. 2003కు ముందు అరకొర జీతాలు. పీఆర్సీ ఫిట్మెంట్లు కూడా గొర్రెతోక బెత్తుడు మాదిరిగా ఉండేవి. దీంతో జీతభత్యాలు తక్కువగా ఉండేవి. వైఎస్ సీఎం అయిన తరువాతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తలెత్తుకొని నిలబడేలా వేతన సవరణకు నాంది పలికారు. రెండు విడతల పీఆర్సీలో వైఎస్ మార్క్ కనపడటంతో ఎనిమిదేళ్లలో జీతాలు రెండింతలు అయ్యాయి. మళ్లీ జగన్ సీఎం అయితే ఆ రోజులు చూస్తామనే ఆశ కలుగుతుంది. ప్రస్తుత ప్రభుత్వానికి ఉద్యోగులపై చులకన భావం ఉంది. కమిటీ పేరుతో కాలయాపన – జి.నరసింగరావు, ఉపాధ్యాయుడు సీపీఎస్ విధానాన్ని ఇటీవల చాలా రాష్ట్రాల్లో విరమించుకున్నాయి. మన రాష్ట్రంలో కమిటీ పేరుతో కాలయాపన చేయడం తగదు. కమిటీల వల్ల ఒరిగేది ఏదీ ఉండదని ఉద్యోగులకు తెలుసు. మా జీతాల నుంచి డబ్బులు కోత కోసి వేరే సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం, లాభాలు వస్తాయో రావోకూడా తెలయని పరిస్థితుల్లో సీపీఎస్ విశ్రాంత ఉద్యోగికి భద్రత ఎక్కడ. సీపీఎస్ రద్దు చేస్తామన్న జగన్ హామీపై నమ్మకం ఉంది. ఉద్యోగులకు ఆర్థిక భరోసా మెరుగైన పీఆర్సీ ద్వారా ఉద్యోగులకు ఆర్థిక భరోసా కలుగుతుంది. చట్టం ప్రకారం ప్రతీ ఐదేళ్లకోసారి వేతన సవరణ జరగాలి. అది ఉద్యోగుల హక్కు ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి కాదు. జగన్ సీఎం అయితే మెరుగైన పీఆర్సీ అమలు చేస్తారని విశ్వసిస్తున్నాం. - శ్రీనివాసరావు, ఉపాధ్యాయుడు -
అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలకే దిక్కులేదా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలకే దిక్కులేకుండా పోయిందని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్రెడ్డి వ్యాఖ్యానించారు. మండలి, శాసనసభల్లో ఇచ్చిన హామీలకు సంబంధించి తీసుకున్న చర్యల గురించి వివరణ ఇవ్వాలని హామీల సభా కమిటీలో ప్రశ్నిస్తే.. 16 హామీలకు గాను ఒక్క హామీ అమలు కోసం మాత్రమే ఎలాంటి చర్యలు తీసుకున్నారో అధికారులు వివరించడం దౌర్భాగ్యమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న హౌసింగ్ అక్రమాలపై వేసిన కమిటీ 18 నెలలవుతున్నా సమావేశం కాలేదని, ఇలాంటి కమిటీల్లో తాము ఉండి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. రైతుల గురించి గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ముందుగా ఖమ్మంలో బేడీలు వేసి అరెస్టు చేసిన రైతులపై కేసులు ఎత్తివేయాలని పొంగులేటి డిమాండ్ చేశారు. -
టీ వైద్యులకు అన్యాయం జరగనివ్వం
ప్రభుత్వ వైద్యులకు మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి హామీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో పనిచేసే వైద్యుల విభజనలో తెలంగాణ వైద్యులకు అన్యాయం జరగనివ్వబోమని మంత్రులు కె.తారకరామారావు, లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. విభజనలో తమకు తీరని అన్యాయం జరిగిందంటూ ఇటీవల వైద్యులు ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంపై ప్రభుత్వ వైద్యులు మంగళవారం స్టీరింగ్ కమిటీగా ఏర్పడి మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డిలను కలిశారు. భార్యాభర్తల (స్పౌస్) అంశం ఉంటే తప్ప ఏ రాష్ట్రం వారిని ఆ రాష్ట్రానికి కేటాయించాలని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారని స్టీరింగ్ కమిటీ నేత డాక్టర్ లాలూ ప్రసాద్, గెజిటెడ్ వైద్య ఉద్యోగుల నేత జూపల్లి రాజేందర్ తెలిపారు. తమ భేటీ సందర్భంగా కేటీఆర్ సీఎం కేసీఆర్తో ఫోన్లో మాట్లాడారన్నారు. సీఎం సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మను మంత్రులతోపాటు తామూ కలిశామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ప్రభుత్వ వైద్యులకు అన్యాయం జరగకూడదని, ఆంధ్రప్రదేశ్ సీఎస్తో సమావేశమై ప్రభుత్వ వైద్యుల విభజన ప్రక్రియను పరిష్కరించాలని కేటీఆర్ సీఎస్ రాజీవ్శర్మను కోరినట్లు వారు తెలిపారు. కాగా, కమలనాథన్ కమిటీ సిఫార్సు ప్రకారం తయారుచేసిన వైద్యుల విభజన జాబితాలో తెలంగాణ వారికి అన్యాయం జరిగిందని స్టీరింగ్ కమిటీ నేతలు సీఎస్ దృష్టికి తీసుకొచ్చారు. ఆ జాబితాను రద్దు చేయాలన్నారు. సీఎస్ను, మంత్రులను కలసిన వారిలో డాక్టర్లు పల్లం ప్రవీణ్, బి.రమేష్, రమేష్రెడ్డి, ఉమాశంకర్, వినోద్ తదితరులున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement