టికెట్ కావాలంటే రూ.8 కోట్లివ్వండి
న్యూఢిల్లీ: రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్కు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి రూ. 8 కోట్లు డిమాండ్ చేశారని, అందుకు నిరాకరించినందుకే తనను పార్టీ నుంచి బహిష్కరించారని సాహిబాబాద్ ఎమ్మెల్యే, బీఎస్పీ బహిష్కృత నేత అమర్ పాల్ శర్మ ఆరోపించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ సోమవారం బీఎస్పీ నుంచి బహిష్కిరణకు గురైన శర్మ మంగళవారం కాంగ్రెస్లో చేరారు. ఆయన కాంగ్రెస్ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ...టికెట్పై నిర్ణయం తీసుకోవాలంటే రూ.8 కోట్లు వెంటనే పంపాలని మాయావతి తన అనుయాయుడు నసీముద్దీన్ సిద్దికీ ద్వారా లేఖ పంపారని చెప్పారు.