breaking news
ashore
-
రాజయ్యపేట తీరానికి కొట్టుకొచ్చిన భారీ పైపులైన్
నక్కపల్లి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట సముద్రతీరానికి భారీ పై పులైను ఆదివారం కొట్టుకొచ్చింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ పైపులైను చూసి గ్రామస్తులకు సమాచారమిచ్చారు. చాలామంది ఈ పైపులైనును ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించారు. కానీ భారీ పైపులైను కావడంతో కదపలేకపోయారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ డి.వెంకన్న రాజయ్యపేట సముద్రతీరానికి వెళ్లి పైపులైన్ను పరిశీలించారు. ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఇది కేంద్ర రక్షణ శాఖ ఎస్.రాయవరం మండలం బంగారమ్మపాలెం సమీపంలో నిర్మిస్తున్న ఎన్ఏవోబీ (నేవల్ ఆల్టర్నేనేటివ్ బేస్)కు చెందిన పైపులైనుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నేవల్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వనున్నట్లు ఎస్ఐ వెంకన్న తెలిపారు. (క్లిక్: మార్కాపురం వాసిని అభినందించిన ప్రధాని మోదీ) -
తీరానికి కొట్టుకొచ్చిన తిమింగలం
ఉలవపాడు : ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం అలగాయపాలెం సముద్రతీరానికి సోమవారం ఒక తిమింగలం కొట్టుకొచ్చింది. ఆ తిమింగలం సుమారు 35 అడుగుల పొడవు ఉంది. అది చనిపోవడం వల్లే తీరానికి కొట్టుకొచ్చినట్లు అనిపిస్తుంది. కాగా దీన్ని చూడటానికి చుట్టపక్కల గ్రామాల వారు తరలివస్తున్నారు. గ్రామస్తులు ఈ విషయం గురించి అధికారులకు సమాచారం అందించారు.