breaking news
Ashish Gupta
-
హెచ్సీఎల్ టెక్ చేతికి జర్మనీ కంపెనీ
న్యూఢిల్లీ: దేశీ సాఫ్ట్వేర్ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ ... జర్మనీకి చెందిన ఐటీ, ఇంజినీరింగ్ సర్వీసుల కంపెనీ హెచ్ అండ్ డీ ఇంటర్నేషనల్ గ్రూప్ను కొనుగోలు చేసింది. జర్మనీలోని వోల్ఫోబర్గ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీని 3 కోట్ల యూరో(దాదాపు రూ.240 కోట్లు)లకు కొనుగోలు చేశామని హెచ్సీఎల్ టెక్నాలజీస్ తెలిపింది. ఈ కంపెనీ కొనుగోలుతో జర్మనీ మార్కెట్లో తాము మరింతగా దూసుకుపోగలమని హెచ్సీఎల్ టెక్నాలజీస్ వైస్ ప్రెసిడెంట్(కార్పొరేట్) అశిష్ గుప్తా ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా అంతర్జాతీయ ఆటోమోటివ్ రంగంలో తమ నైపుణ్యం మరింతగా మెరుగుపడగలదని పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగస్టు చివరినాటికి ఈ కంపెనీ కొనుగోలు పూర్తవ్వగలదని తెలిపారు. జర్మనీలోని దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఒకటైన హెచ్ అండ్ డీ ఇంటర్నేషనల్ గ్రూప్ అమెరికా, చెక్ రిపబ్లిక్, పోలండ్ల్లో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గత ఏడాది ఈ కంపెనీ ఆదాయం 7.41 కోట్ల యూరోలుగా ఉంది. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో హెచ్సీఎల్ టెక్ షేర్ 1 శాతం లాభంతో రూ.919 వద్ద ముగిసింది. -
‘తప్పుడు అఫిడవిట్’ కేసులో కేజ్రీవాల్కు బెయిల్
న్యూఢిల్లీ: 2013 అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ సందర్భం గా తప్పుడు సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేశారంటూ దాఖలైన కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు రూ. 10 వేల బాండ్తో సొంత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేస్తూ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆశిష్ గుప్తా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కేసు విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేశారు. ఈ కేసుకు సంబంధించి ఆగస్టు 31న జరిగిన విచారణ నుంచి కేజ్రీవాల్కు వ్యక్తిగత మినహాయింపు ఇచ్చిన కోర్టు ప్రస్తుతం బెయిల్ ప్రొసీడింగ్స్ ఉన్నందున వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించడంతో ఆయన విచారణకు వచ్చారు.