-
బోసి నవ్వుల కోసం
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచపు తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ లెస్లీ బ్రౌన్ పుట్టి (జులై 25,1978) 40 ఏళ్లు నిండింది. ఓవైపు నగరంలో ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్)విధానంలో జననాలు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. మరోవైపు నగరవాసుల్లో పెరుగుతున్న సంతాన హీనతకు కారణాల్లో మారుతున్న జీవనశైలి ప్రధానమైనదని వైద్యులు చెబుతున్నారు. ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, అనారోగ్యకరమైన అలవాట్లు, రేడియేషన్ ప్రభావం, హార్మోన్లలో హెచ్చుతగ్గులు... వీటన్నింటి మూలంగా ఏర్పడుతున్న సంతానలోపం అధిగమించడానికి అత్యాధునిక వైద్య విధానాలు మాత్రమే మార్గం. మెట్రోల్లోనే ఎక్కువ... దేశంలో ఏటా లక్ష వరకు ఐవీఎఫ్ చికిత్సలు నమోదవుతున్నాయి. వీటిలో అత్యధికంగా మెట్రో నగరాల్లోనే జరుగుతున్నాయి. దేశంలో జరిగే మొత్తం చికిత్సల్లో హైదరాబాద్ సహా దేశంలోని 8 ప్రధాన నగరాల్లోనే 55 శాతానికి పైగా ఐవీఎఫ్ చికిత్సలు నమోదవుతున్నాయి. ఢిల్లీ, ముంబై ఈ విషయంలో మరింత ముందంజలో ఉన్నాయి. నాలుగో స్థానంలో సిటీ... ఒక సర్వే ప్రకారం దక్షిణాదిలో 37 శాతం ఐవీఎఫ్ చికిత్సలు నమోదవుతుంటే... 90 మంది వైద్యులు, 60 ఐవీఎఫ్ సెంటర్లతో ఏడాదికి 11వేలకు పైగా చికిత్సలు చేస్తూ ఢిల్లీ ఈ విషయంలో ప్రథమ స్థానంలో ఉంది. అలాగే 100 మంది డాక్టర్లు, 70 సెంటర్లతో ఏడాదికి 10వేల చికిత్సలు నమోదు చేస్తూ ముంబై రెండో స్థానంలో ఉంది. ఇక 30 మంది డాక్టర్లు, 25 సెంటర్లతో ఏడాదికి 7వేల ఐవీఎఫ్లు చేస్తూ చెన్నై మూడో స్థానంలో నిలిచింది. మన నగరం 26 మంది వైద్యులు, 18 సెంటర్లతో ఏడాదికి 6వేల చికిత్సలతో నాలుగో స్థానం దక్కించుకుంది. బెంగళూర్ 30 మంది డాక్టర్లు, 20 సెంటర్లతో ఏడాదికి 4,200 కేసులు నమోదు చేస్తూ ఐదో స్థానంలో, 8వేల చికిత్సలతో అహ్మదాబాద్ ఆరో స్థానంలో, 7వేలకు పైగా చికిత్సలతో కోల్కతా ఏడో స్థానంలో, 4వేల చికిత్సలతో పుణె ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. వ్యయం తక్కువే అయినా... అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దగ్గర ఐవీఎఫ్ చికిత్సకు అవుతున్న వ్యయం (రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షలు) తక్కువే అయినప్పటికీ అవసరార్థుల్లో 80 శాతం మందికి ఇది అందుబాటులో లేదు. ఒక్క ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తప్ప మరే బీమా సంస్థ కూడా దీనికి అవసరమైన వ్యయాన్ని కవర్ చేసే సదుపాయం కల్పించడం లేదు. అలాగే మిగతా నగరాలతో పోలిస్తే తగినంత సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఐవీఎఫ్ చికిత్స అందించే నిపుణుల కొరత కూడా నగరంలో ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా సంతానలేమి సమస్యతో బాధపడుతున్న దేశంగా... ఈ ఐవీఎఫ్ విధానంపై యువతలో అవగాహన మరింత పెరిగేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఐవీఎఫ్ ఉత్తమం గతంతో పోలిస్తే దంపతులు ఐవీఎఫ్ విధానం వైపు మొగ్గు చూపుతుండడంతో దీనికి ఆదరణ బాగా పెరిగింది. అయినప్పటికీ మన దగ్గర కృత్రిమ గర్భధారణపై అపోహలు, సంశయాలు మాత్రం ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి. వీటిలో సామాజికపరమైనవే ఎక్కువ. అత్యాధునిక పద్ధతులు అందుబాటులో ఉన్నా, 22–33 మిలియన్ల భారతీయ దంపతులు సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారని ఒక నివేదిక తేల్చడం దీనికో ఉదాహరణ. – డాక్టర్ స్వాతి మోతె, గైనకాలజిస్ట్, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ (ఇందిరా ఐవీఎఫ్) -
అటెండరే వైద్యుడు..
ఆలూర్(ఆర్మూర్రూరల్), న్యూస్లైన్ : ఆర్మూర్ మండలం ఆలూర్లోని పశువైద్యశాలలో సమయపాలన కరువైంది. ఇక్కడ పనిచేస్తున్న వైద్యురాలు శైలజ అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఆస్పత్రి పరిధిలో ఆలూర్, మిర్ధాపల్లి, రాంపూర్, గగ్గుపల్లి గ్రామాలు వస్తాయి. సుమారు ఐదారు వేల గేదెలు, ఆవులు, మేకలు తదితర పశువులు ఈ గ్రామాలలో ఉంటాయి. రెండేళ్ల క్రితం పశు వైద్యురాలిగా ప్రభుత్వం శైలజను నియమించింది. పశువులకు చికిత్స చేయడానికి వైద్యురాలు గ్రామంలోనే నివాసం ఉండాల్సి ఉండగా, నిజామాబాద్లో ఉంటున్నారు. పశు వైద్యశాలలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైద్యురాలు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. వివిధ గ్రామాల నుంచి వచ్చే పశువులకు వచ్చే సీజనల్, గాలికుంటు వ్యాధులు, కృత్రిమ గర్భాధారణపై రైతులకు ఎలాంటి అవగాహన కల్పించడంలేదనే ఆరోప ణలున్నాయి. అలాగే ప్రతి రోజు వైద్యశాలలో వైద్యురాలు అందుబాటులో ఉండడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల సమాచారం మేరకు విలేకరులు సోమవారం పశువైద్యశాలకు ఉదయం 10 గంటలకు వెళ్లగా, వైద్యురాలు లేకపోవడంతో ఖాళీ కుర్చీ దర్శనమిచ్చింది. వారిని చూసిన అటెండర్ నర్సయ్య వెంటనే వైద్యురాలు శైలజకు ఫోన్ చేసి విలేకరులు వచ్చారని చెప్పాడు. దీంతో సెలవులో ఉన్నట్లు చెప్పమని ఫోన్లో సూచన చేయడంతో అటెండర్, వైద్యురాలు సెలవులో ఉన్నట్లు తెలిపాడు. పశువైద్యురాలు చేయాల్సిన చికిత్స అటెం డర్ నర్సయ్య చేస్తున్నాడని రైతులు పేర్కొన్నారు. పశువులకు వ్యాధులు వస్తే వైద్యురాలు అందుబాటులో ఉండకపోవడంతో ప్రైవేట్ వారితో పశువులకు చికిత్స చేయిస్తున్నామని రైతులు వాపోయారు. విధులకు సక్రమంగా హాజరు కాని వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
Advertisement