breaking news
around
-
HYD: హుస్సేన్సాగర్ నయా లుక్.. సాగర తీరంలో స్కై వాక్, సైకిల్ ట్రాక్
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్సాగర్ చుట్టూ స్కైవాక్ సైక్లింగ్ ప్రాజెక్టుపై ఎట్టకేలకు కదలిక వచ్చింది. కోర్ అర్బన్ సుందరీకరణలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హుస్సేన్సాగర్ 2.0 అంశాన్ని ప్రస్తావించారు. దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులను ఆకట్టుకొనే విధంగా హుస్సేన్సాగర్ చుట్టూ స్కైవాక్, సైక్లింగ్, ఎంటర్టైన్మెంట్, నైట్లైఫ్ షాపింగ్ వంటి సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అనుబంధ హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (హుమ్టా) గతంలోనే ప్రణాళికలను సిద్ధం చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేక ఎంటర్టైన్మెంట్ డిజైన్లను రూపొందించింది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో ఈ ప్రాజెక్టును చేపట్టాలని ప్రతిపాదించారు. కానీ అప్పట్లో ప్రభుత్వం నుంచి స్పందన లభించలేదు. తాజాగా సీఎం ఈ ప్రాజెక్టును ప్రత్యేకంగా ప్రస్తావించడంతో మరోసారి ఇది తెరపైకి వచి్చంది. స్కైవాక్ సైకిల్ట్రాక్ ప్రాజెక్టు నిర్మిస్తే నెక్లెస్రోడ్డు, ట్యాంక్బండ్ ప్రాంతాలు మరిన్ని పర్యాటక హంగులతో ఆకట్టుకోనున్నాయి. శ్వేతసౌధం వంటి సచివాలయం, బాబాసాహెచ్ అంబేడ్కర్ భారీ విగ్రహం, ఎనీ్టఆర్ గార్డెన్, లుంబినీపార్కు, సంజీవయ్య పార్కు, లేక్వ్యూ పార్కులకు ఇది మణిహారంగా మారనుంది. దేశంలోనే మొదటిది.. హుస్సేన్సాగర్ అందాలను ఆకాశంలోంచి వీక్షించేందుకు అనుగుణంగా సుమారు 10 కిలోమీటర్ల మార్గంలో స్కైవాక్, సైకిల్ ట్రాక్ నిర్మించాలనేది ప్రతిపాదన. ఖైరతాబాద్ మెట్రోస్టేషన్ నుంచి ఐమాక్స్ థియేటర్ మీదుగా నెక్లెస్రోడ్డు, పీపుల్స్ప్లాజా, ట్యాంక్బండ్, తదితర ప్రాంతాలను కలుపుతూ ఇందిరాపార్కు వరకు స్కైవాక్ నిర్మిస్తారు. దీంతో సాగరానికి అన్ని వైపులా రాకపోకలు సాగించవచ్చు. సంజీవయ్య పార్కు, పీపుల్స్ప్లాజా, జలవిహార్, ఎంఎంటీఎస్ స్టేషన్, లేక్వ్యూపార్కు, ఎనీ్టఆర్ పార్కు, లుంబిని పార్కు, సెక్రటేరియట్, అంబేడ్కర్ విగ్రహం తదితర సందర్శనీయ స్థలాలను ఆకాశ నడకతోలోనే చేరుకోవచ్చు. దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా ఇలాంటి స్కైవాక్లు లేవని, హైదరాబాద్లో హుస్సేన్సాగర్పై ఏర్పాటు చేయనున్నదే మొట్టమొదటి స్కైవాక్ కానుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో నగరానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించనుందని పేర్కొన్నారు. వాకింగ్తో పాటే సైక్లింగ్.. సాగర్ చుట్టూ సుమారు 10 కిలోమీటర్ల మార్గంలో నిర్మించనున్న స్కైవాక్పైకి చేరుకొనేందుకు, కిందకు దిగేందుకు వివిధ ప్రాంతాల్లో ప్రవేశ, ని్రష్కమణ దారులు ఉంటాయి. స్కైవాక్ మొత్తం 5.5 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇందులో 3 మీటర్లు సైకిల్ ట్రాక్ కోసం కేటాయిస్తారు.సైకిలిస్టులు ఈ మార్గంలో రాకపోకలు సాగించవచ్చు. 0.5 మీటర్ల వెడల్పుతో ఆహ్లాదకరమైన పచ్చదనంతో కూడిన సెంట్రల్ మీడియన్ ఉంటుంది. దానిని ఆనుకొని 2 మీటర్ల వెడల్పుతో ఫుట్పాత్ను ఏర్పాటు చేస్తారు. దీంతో సందర్శకులు ఒకే ట్రాక్పైన నడిచేందుకు, సైకిలింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ట్రాక్కు రెండు వైపులా గ్రీనరీని ఏర్పాటు చేస్తారు. కేవలం పర్యాటకులు, సందర్శకులే కాకుండా ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసేందుకు కూడా స్కైవాక్ను వినియోగించుకోవచ్చు.సుమారు రూ.200 కోట్లతో అంచనాలు... హుస్సేన్సాగర్ చుట్టూ నిర్మించనున్న స్కైవాక్కు ఒక కిలోమీటర్కు రూ.20 కోట్ల చొప్పున మొత్తం 10 కిలోమీటర్ల మార్గానికి రూ.200 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ప్రాజెక్టులో భాగంగానే హుస్సేన్సాగర్లో నీటిపై తేలియాడే బాస్కెట్బాల్ కోర్టు, క్రికెట్ స్టేడియం వంటివి ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. ప్రస్తుతం సింగపూర్లో ఈ తరహా వేదికలున్నట్లు అధికారులు తెలిపారు. ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేలా షాపింగ్ కేంద్రాలు, రెస్టారెంట్లు వంటివి కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. -
వైరల్ వీడియో : పాములా స్వింగ్ తిరుగుతున్న పిల్లి..!
-
అమ్మవారిపై భక్తితో.. ఆలయం చుట్టూ బురదలో
-
తాగి కారు నడిపినా తప్పు కాదట!
డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదాలు సంభవిస్తాయన్న విషయం ప్రతి వారికీ తెలిసినదే. అందుకే ఆయా ప్రాంతాలను బట్టి భద్రతాధికారులు కొన్ని నిబంధనలను విధిస్తుంటారు. అయితే కొన్ని ప్రాంతాల్లో అవలంబిస్తున్న విధానాలను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వారు వేసే శిక్షలు, జరిమానాలూ కూడ భయంకరంగా ఉండటం కనిపిస్తుంది. కొన్ని దేశాల్లో కార్లను ఆదివారం కడగడమే తప్పయితే... కొన్ని చోట్ల మద్యం సేవిస్తూ కారు నడిపినా తప్పు లేదట. ప్రపంచవ్యాప్తంగా కనిపించే నియమాల్లో వింతగా కనిపించే నిబంధన బీజింగ్ లో కనిపిస్తుంది. జీబ్రా క్రాసింగ్ దగ్గర బాటసారులు రోడ్లు దాటేప్పుడు ఒకవేళ సిగ్నల్ పడిందంటే వారి పని అంతే. ప్రమాదం జరుగుతుందని తెలిసినా కారు నడిపే వారు మాత్రం మనుషులు అడ్డొచ్చినా, ప్రాణాలు పోయినా వాహనాలు ఆపకూడదట. అలాగే కాలుష్యాన్ని నివారించడంలో భాగంగా అవలంబిస్తున్నసరిబేసి విధానం చాలా దేశాల్లోనే కనిపిస్తుంది. ముఖ్యంగా స్పానిష్ దేశాల్లో రోడ్లమీద కార్లు పార్క్ చేయడంలో సరి బేసి విధానం అమలవుతోంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కారు పార్క్ చేయకపోతే భారీ జరిమానాలు పడటం ఖాయం. ముఖ్యంగా ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించడంకోసం, రోడ్డు మార్గం సరిగా కనిపించడం కోసం చీకటి సమయంలో వాహనాల లైట్లను వేస్తాం. అయితే స్వీడన్ లో మాత్రం పగలు కూడ వాహనాలు నడిపేవారు లైట్లను ఆపకూడదట. ప్రయాణంలో లైట్లు వెలగని పక్షంలో శిక్షను భరించాల్సిందే. ఈ వింత నియమం ఎందుకు అవలంబిస్తున్నారో ఎవ్వరికీ తెలియదు. అలాగే థాయ్ ల్యాండ్ లో బట్టలు సరిగా వేసుకోకుండా కార్లు, బైక్ లు నడపడం నిషేధం స్త్రీ పురుషుల్లో ఎవరైనా సరే... నిబంధనను అతిక్రమించారంటే భారీ జరిమానా కట్టాల్సిందే. ఇక రష్యాలో అయితే మట్టికొట్టుకుపోయిన వాహనాలు రోడ్లపైకి తేవడం తీవ్ర నేరంగా పరిగణిస్తారు. ఇండియాలో బాటసారులు ఎలా పోయినా ఫర్వాలేదంటూ వర్షంలోనూ ఏమాత్రం స్పీడు తగ్గకుండా వాహనాలు నడిపించడం, పక్కవారిపై బుదర చల్లడం కనిపిస్తే... జపాన్ దాన్ని తీవ్ర నేరంగా పరిగణించి భారీ జరిమానా విధిస్తుంది. వీటన్నింటికీ భిన్నంగా జార్జియాలోని మెరియట్టా నగరంలో కార్లలో వెళ్ళేవారు ఏమాత్రం ఉమ్మి వేయకూడదట. ఇది బాగానే ఉంది. పరిశుభ్రతకోసం ఈ పద్ధతి పాటిస్తున్నారు అనుకోవచ్చు. కానీ అక్కడే ట్రాక్టర్లలో వెళ్ళేవారు మాత్రం ఉమ్మొచ్చు అన్న పద్ధతి కూడ అవలంబించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. స్విర్జర్లాండ్లో ఆదివారాలు కార్లు కడగకూడదన్న రూలు అమల్లో ఉంటే..డెనివర్ ప్రాంతంలో ఆదివారాలు నల్లకార్లు రోడ్డెక్క కూడదని, అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో కురుచ దుస్తులు వేసుకొని వాహనాలు కడగ కూడదని ఇలా వింత వింత నిబంధనలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఇండియాలో మద్యం సేవించి కారు నడపడం నేరం అయితే... కోస్తారికాలో మద్యం తాగుతూ కూడ వాహనం నడపొచ్చన్న విషయం నిజంగా వింతగానే కనిపిస్తుంది. ఇక ఇటలీలో మాత్రం కారునడిపేప్పుడు ముద్దు పెట్టుకోవడం నిషేధం. ఒకవేళ అటువంటి దృశ్యం పోలీసుల కంట పడిందో సుమారు ఏభై వేల రూపాయల వరకూ భారీ జరిమానా చెల్లించాల్సిందే. అలాగే కళ్ళకు గంతలు కట్టుకొని కార్టు నడిపినా ప్రమాదం లేదంటారు అమెరికా అలబామా వాసులు. మరి అటువంటప్పుడు ప్రమాదాలను ఎలా నివారిస్తారన్న విషయం వారికే తెలియాలి. ముఖ్యంగా సౌదీలో ఆడవార్లు కార్లు నడపకూడదన్న నిబంధన కనిపిస్తుంది. అది అతిక్రమిస్తే కఠిన శిక్షలను సైతం ఎదుర్కోవాల్సి రావడం కొంత బాధాకరంగా కూడ ఉంటుంది.


