breaking news
Army Commandos
-
ఆర్మీ కమాండోల ఆపరేషన్ సక్సెస్..
టేకుమట్ల : చుట్టూ వరదనీరు.. వాగు మధ్యలో ఎల్లమ్మ గుడి.. ప్రవాహం పరవళ్లు తొక్కుతోంది. గుడిలో పదిమంది రైతులు.. దాటుదామని వాగులోకి దిగితే కొట్టుకుపోవాల్సిందే. ప్రాణాలు అరచేతబట్టుకొని ఐదున్నర గం టలుగా బిక్కుబిక్కుమంటున్నారు.. అంతలోనేపైన గాలి మోటారు చప్పుడు వారి చెవిన పడింది. అంతే.. ప్రాణాలు లేచి వచ్చాయి. హెలికాప్టర్లో వచ్చిన ఆర్మీ కమెండోలు వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో రైతుల కథ సుఖాంతమైంది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం కుందనపల్లిలో శనివారం చోటు చేసుకుంది. ఐదు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో.. ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నా యి. కుందనపల్లిలోని చలివాగు ఒడ్డు వెంట ఉన్న పొలాల్లో వ్యవసాయ మోటార్లు వరదలో కొట్టుకుపోకుండా తీసుకురావాలనుకున్నారు రైతులు. మోటార్లను తెచ్చేందుకు రెండు ట్రాక్టర్లలో పలువురు రైతులు శనివారం ఉదయం పది గంటలకు బయలుదేరారు. ఈ క్రమంలో పొలాల్లో ట్రాక్టర్లు దిగబాటుకు గురయ్యాయి. ట్రాక్టర్లను బయటికి తీసేందుకు పదిమంది రైతులు వెళ్లారు. అంతే.. ఒక్కసారిగా చలివాగు ప్రవాహం తీవ్ర రూపం దాల్చింది. దీంతో రైతులకు ఇరువైపులా వరదనీరు చేరడంతో ఎటూ కదల్లేని పరిస్థితి ఏర్పడింది. వాగులో రైతులు చిక్కుకుపోవడంతో స్థానికులు కూడా రక్షించే అవకాశాలు లేకపోయాయి. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి స్థానికులు విషయాన్ని తీసుకెళ్లారు. రంగంలోకి రెండు ఆర్మీ హెలికాప్టర్లు వాగులో రైతులు చిక్కుకున్న విషయాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, దయాకర్రావులకు వివరించారు. సీఎం జోక్యంతో హకీంపేట నుండి రెండు ఆర్మీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ఆర్మీ కమాండోలు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నాయి. మధ్యాహ్నం 3:30లకు రైతులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కాగా, వాగు వద్ద సహాయక చర్యలను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ అబ్దుల్ అజీం, ఎస్పీ సంగ్రామసింగ్ పాటిల్ పర్యవేక్షించారు. చివరకు రైతులు సురక్షితంగా బయట పడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తమను రక్షించినందుకు ప్రజాప్రతినిధులకు, అధికారులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ రుణపడి ఉంటాం వరదలో చిక్కుకున్న మాకు సాయం అందించి రక్షించిన అధికారులు, ప్రజాప్రతినిధులకు మేమూ, మా కుటుంబాలు ఎంతో రుణపడి ఉంటాం. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంటికి తిరిగి వస్తామో, రామో అని భయపడ్డాం. ఈ పరిస్థితుల్లో మాకు ఎంతో సహకరించి 10 మంది కుటుంబాలకు దిక్కుగా నిలిచారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే, ఎస్పీ, ఇతర అధికారులకు కృతజ్ఞతలు. – మాడుగుల ప్రకాశ్, రైతు, కుందనపల్లి -
యుద్ధభూమి కాదు.. క్రికెట్ స్టేడియం!
-
యుద్ధభూమి కాదు.. క్రికెట్ స్టేడియం!
స్డేడియంలో ఆటగాళ్ల ప్రాక్టీసులు, అనంతరం మ్యాచ్ లు ఆడటం చూస్తాంటాం. మరి క్రికెట్ స్టేడియంలో ఆర్మీ జవాన్లు ఎందుకున్నారు అని సందేహం వచ్చిందా? మీ అనుమానం నిజమే. క్రికెటర్లకు రక్షణ కల్పిస్తామన్న ధీమా కల్పించేందుకు ప్రస్తుతం బంగ్లాదేశ్ ఆర్మీ తీవ్రంగా శ్రమిస్తోంది. అసలు విషయం ఏంటంటే.. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జూలై 1న ఉగ్రవాదులు, ఒక భారతీయ యువతి సహా 22 మందిని దారుణంగా గొంతులు కోసి చంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బంగ్లాదేశ్-ఇంగ్లండ్ జట్ల మధ్య సిరీస్ షెడ్యూల్ ఉంది. ఉగ్రదాడులు జరిగిన ప్రాంతంలో మళ్లీ అదే తరహా దాడులు పునరావృతమవుతాయని ఇంగ్లండ్ ఆటగాళ్లు మొదట పలు సందేహాలు వ్యక్తంచేశారు. కానీ, చివరికి బంగ్లా ఆర్మీ సహాయం తీసుకుని ఇంగ్లండ్ ఆటగాళ్లకు రక్షణ కల్పిస్తామని బంగ్లా క్రికెట్ బోర్డు హామితో అంతా ఓకే అయింది. గత శనివారం జరిగిన మూడో వన్డేలో నెగ్గిన బంగ్లా 2-1 తేడాతో అఫ్ఘానిస్తాన్ పై కైవసం చేసుకున్న ఆనందంలో ఉండగా.. మరోవైపు పర్యాటక ఇంగ్లండ్ జట్టు మాత్రం కాస్త బెరుకుగా ఉంది. ఈ నేపథ్యంలో బంగ్లా ఆర్మీ కమాండోల పర్యవేక్షణలో ఇరుజట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. ఢాకా లోని షేర్ ఏ బంగ్లా స్డేడియంలో ఈ జట్ల మధ్య శుక్రవారం రాత్రి తొలి వన్డే జరగనుంది. గతంలో పాకిస్తాన్ లో లంక ఆటగాళ్లపై దాడులు జరిగడంతో ఇప్పటివరకూ ఏ జట్టు పాక్ లో ఆడటానికి సముఖత చూపడం లేదన్న విషయం తెలిసిందే. బంగ్లా మాత్రం అలాంటి వాటికి తావివ్వకుండా తమ దేశంలో మ్యాచ్ లను నిర్వహించాలని ముందడుగు వేసింది.