-
స్మగ్లర్ అరెస్ట్.. 100పైగా పిస్టళ్ల స్వాధీనం
న్యూఢిల్లీ: అక్రమంగా ఆయుధాలను తరలిస్తున్న ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 10 పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఉత్తర్ ప్రదేశ్లోని మాథురా ప్రాంతానికి చెందిన రమజాన్గా గుర్తించారు. మధ్యప్రదేశ్లోని బార్వానీ జిల్లా ఉమర్తి గ్రామం నుంచి తెచ్చి అక్రమంగా ఆయుధాలను సరఫరా చేస్తున్నట్లుగా పోలీసులు తెలుసుకున్నారు. పక్కా పథకం ప్రకారం నిందితుడిని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద నున్న డీఎన్డీ ఫ్లైఓవర్ వద్ద పట్టుకున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పీఎస్ కుష్వా తెలిపారు. రమజాన్పై కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. యూపీ, హర్యానాతో పాటు పలు ప్రాంతాల్లో మొత్తం 97 సెమీ ఆటోమాటిక్ పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆయుధాలు కావాలి.. సిద్ధంగా ఉండండి
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు రాజ్యమేలుతున్నాయి. దాంతో ఏ క్షణంలో అడిగినా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి తయారుచేసి ఉంచుకోవాలని భారత ప్రభుత్వం ఆయుధాల సరఫరాదారులను కోరిందని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా వివిధ ఆయుధ సరఫరాదారుల సామర్థ్యాన్ని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అవసరమైన పక్షంలో తాము చెప్పిన వెంటనే వాటిని సరఫరా చేయాల్సి ఉంటుందని చెప్పారట. ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాలే కాకుండా.. అవసరమైతే అప్పటికప్పుడు సరఫరా చేసే ప్రాతిపదికన కొత్త ఒప్పందాలు కూడా చేసుకోవాలని రక్షణ శాఖ భావిస్తున్నట్లు సమాచారం. తక్కువ సమయంలో చెబితే మనవాళ్లు ఎంత మొత్తంలో ఆయుధాలు సరఫరా చేయగలరన్న కచ్చితమైన సమాచారం తమకు కావాలని, అవసరాన్ని బట్టి ఉత్పత్తులను పెద్ద ఎత్తున ఒకేసారి పెంచాలని కూడా కోరారంటున్నారు. జనవరి నెలలో పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద ఉగ్రదాడి జరిగినప్పుడు కూడా ప్రభుత్వం ఇలాగే ఆయుధాలు కావాలని చెప్పిందట. ప్రధానంగా చిన్న ఆయుధాలతో పాటు మందుగుండు సామగ్రి, సుఖోయ్.. మిరేజ్ యుద్ధవిమానాల విడిభాగాలు కావాలని అప్పట్లో కోరినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 29నాడు నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్కు ఒక్కరోజు ముందు కూడా అవసరమైతే భద్రతా కారణాల రీత్యా రక్షణ శాఖ బడ్జెట్ను పెంచాల్సి ఉంటుందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సూచనప్రాయంగా వెల్లడించారు. అంతర్జాతీయ ఘటనల ప్రభావం మన మీద కూడా ఉంటుందని, అంఉదవల్ల అత్యవసరమైన పరిస్థితుల్లో జాతీయ వనరులను కూడా రక్షణ రంగానికి మళ్లించాల్సి ఉంటుందని, అది చాలా ప్రాధాన్యమైన అంశమని బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో జైట్లీ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ఒకవేళ భారీ యుద్ధం చేయాల్సి వస్తే మాత్రం మన సైన్యం వద్ద చిన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రికి తీవ్రమైన కొరత ఉంటుంది. అందుకే ముందుగా సిద్ధం కావడం మంచిదని రక్షణ శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement