breaking news
appointments committee
-
సీబీఐ నూతన డైరెక్టర్ ఎవరో?
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) నూతన డైరెక్టర్ నియామకంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అపాయింట్మెంట్ కమిటీ సోమవారం సమావేశమైంది. విపక్ష నేత రాహుల్ గాంధీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ భేటీలో పాల్గొన్నారు. సీబీఐ ప్రస్తుత డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలం ఈ నెల 25న ముగినుంది. ఆయన 2023 మే 25న సీబీఐ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. కొత్త డైరెక్టర్గా పలువురు సీనియర్ అధికారుల పేర్లను అపాయింట్మెంట్ కమిటీ పరిశీలించినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం... ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన త్రిసభ్య కమిటీ సిఫార్సు మేరకు సీబీఐ నూతన డైరెక్టర్ను కేంద్రం నియమిస్తుంది. -
అదనపు సొలిసిటర్ జనరల్గా సూర్యకరణ్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: భారత అదనపు సొలిసిటర్ జనరల్గా టి.సూర్యకరణ్రెడ్డిని కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ నియమించింది. ఈయన హైదరాబాద్ కేంద్రంగా సదరన్ జోన్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. గతంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. -
ప్రభుత్వ బ్యాంకులకు మారబోతున్న అధినేతలు
న్యూఢిల్లీ : కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు అధినేతలు మారబోతున్నారు. అధినేతలను పునర్వ్యస్థీకరించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్యాంకుల ప్రదర్శనను మెరుగుపర్చుకోవడం, మొండిబకాయిల సమస్యల పరిష్కారం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అధినేతలను మార్చుతున్నట్టు సమాచారం. పునర్ వ్యవస్థీకరించే బ్యాంకుల్లో ఐడీబీఐ కూడా ఉందట. చాలా నిశీతంగా పరిశీలించిన అనంతరం అధినేతలను మార్చే ప్రక్రియపై తుది నిర్ణయం తీసుకోనున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఐడీబీఐ బ్యాంకుకు సీఈవోగా, మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కిషోర్ ఖరాట్ ను వేరే బ్యాంకుకు బదిలీ చేయనున్నారని తెలుస్తోంది. ప్రధాని మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఫైనాన్సియల్ సెక్టార్లో ఎంతో మార్గదర్శకంగా నిలిచిన ఐడీబీఐ బ్యాంకు 2015-16లో రూ.3664 కోట్ల నష్టాలను నమోదుచేసింది. ఈ బ్యాంకుకు 2014-15లో రూ.873 కోట్ల నికర లాభాలున్నాయి. ఈ బ్యాంకుకు క్రమేపీ లాభాలు పడిపోతున్నాయని పార్లమెంటరీ కమిటీ రిపోర్టులో తెలిసింది. స్థూల నిరర్థక ఆస్తులు పెరిగిపోవడం, రుణాల రైటాఫ్స్, సరిగా లేని ఆర్థిక ఫలితాలు ఐడీబీఐ బ్యాంకును దెబ్బతీస్తున్నాయని కమిటీ రిపోర్టు పేర్కొంది. దీంతో ఐడీబీఐ బ్యాంకుల్లో ప్రధానంగా ఈ మార్పులు చోటుచేసుకోబోతున్నాయని సమాచారం.