breaking news
AP DGP Harish Kumar Gupta
-
సాల్మన్ది కూటమి ప్రభుత్వ హత్యే: వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: డీజీపీ కార్యాలయంలో కనీసం మనుషులుగా కూడా గౌరవించలేదని.. పోలీసులు టీడీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. దళిత కార్యకర్త సాల్మన్ హత్యపై ఫిర్యాదు చేయడానికి వైఎస్సార్సీపీ నేతలు వెళ్లగా.. డీజీపీ కార్యాలయం స్పందించలేదు. దీంతో ఆ పార్టీ నేతలు ధర్నాకు దిగారు. చివరికి ఫిర్యాదును ఏడీజీ తీసుకున్నారు.డీజీపి ఆఫీసుకు వచ్చిన వారిలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, టీజేఆర్ సుధాకర్ బాబు తదితరులు ఉన్నారు.అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. చనిపోయిన వ్యక్తిపై కేసులు పెట్టడం దారుణమని.. కూటమి అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. ‘‘సాల్మన్ను హత్య చేసిన నిందితులపై ఇప్పటివరకు కేసులు పెట్టలేదు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో దారుణాలు, అఘాయితాలు పెరిగాయి. సాల్మన్ది ప్రభుత్వ హత్యే.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం కోటి పరిహారం ఇవ్వాలి’’ అని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు.‘‘పిన్నెల్లి గ్రామం పోలీసుల జాగీరా?. అంత్యక్రియలకు వెళ్లేటప్పుడు ఆధార్ కార్డు చూపించాలట..!. గ్రామంలో శాంతి భద్రతలను కాపాడలేనివారు రాష్ట్రాన్ని ఏం కాపాడతారు?. సాల్మన్ను హత్య చేసిన వారికి శిక్ష పడేవరుకు పోరాటం చేస్తాం. ఎమ్మెల్యే యరపతినేనికి దళితులు అంటే చులకన. ఒక మనిషి ప్రాణం విలువ ఎమ్మెల్యే యరపతినేనికి తెలియడం లేదు. సాల్మన్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’’ అని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు.మందా సాల్మన్ది ప్రభుత్వం చేసిన హత్యే: మేరుగ నాగార్జునమందా సాల్మన్ ది ప్రభుత్వం చేసిన హత్యే. సీబిఐతో విచారణ జరపాలి. హత్య గురించి ఫిర్యాదు చేస్తే కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. పైగా సాల్మన్ మీదే కేసు నమోదు చేశారు, సాల్మన్ మృతదేహాన్ని చూడటానికి కూడా మాకు అవకాశం కల్పించలేదు. వైఎస్ జగనే స్వయంగా వస్తానన్నారు. సాల్మాన్ మృతదేహాన్ని ఖననం చేస్తానని చెప్పటంతో పోలీసులు స్పందించారు. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది?...దీనిపై ఫిర్యాదు ఇవ్వటానికి వస్తే డీజీపి ఆఫీసులో అనుమతి లేదన్నారు. మేము ధర్నా చేస్తేగానీ డీజీపి కార్యాలయం స్పందించలేదు. ఏడీజీ మా ఫిర్యాదు తీసుకున్నారు. చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే కేసులు కూడా నమోదు చేయటం లేదు. రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడవటం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందిడీజీపీ అసలే మాత్రం స్పందించలేదు: అంబటి రాంబాబుసాల్మన్ హత్య కేసులో పోలీసుల వైఖరి వివాదాస్పదంగా ఉంది. సాల్మన్పైనే పోలీసులు కేసు పెట్టారు. డీజీపి ఆఫీసుకు వస్తే కనీసం సమాధానం లేదు. డీజీపీ అసలే మాత్రం స్పందించలేదు. అందుకే డీజీపి ఆఫీసు బయట ధర్నా చేశాం. ఇప్పటికి 10, 15 సార్లు వచ్చినా ఫిర్యాదు తీసుకోలేదు. డీజీపి వైఖరి దారుణంగా ఉంది. సాల్మన్ హత్యపై ఉన్నతస్థాయి విచారణ చేయాలి. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి హైకోర్టులో పిల్ వేస్తాం: కాసు మహేష్ రెడ్డిఏపీలో దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం నడుస్తోంది. దళిత నాయకుడు సాల్మన్ హత్య జరిగినా పోలీసులు పట్టించుకోలేదు. దాడి చేసిన వారిమీద కాకుండా చనిపోయిన వ్యక్తి మీదే కేసు పెట్టారు. మత సంప్రదాయం ప్రకారం కూడా సాల్మన్ మృతదేహానికి ఖననం చేయనీయకుండా చేశారు. శ్మశానానికి వెళ్లేటప్పుడు కూడా ఆధార్ కార్డు తీసుకు రావాలన్న దిక్కు మాలిన ప్రభుత్వం ఇది. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేయబోతే ఆయన నిరాకరించారు. బాధితుల గోడు వినే స్థితిలో కూడా పోలీసు అధికారులు లేరు. దీనిపై హైకోర్టులో పిల్ వేస్తాం. దళిత కార్యకర్త సాల్మన్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాంఅవమానించారు: టీజేఆర్ సుధాకర్ బాబుడీజీపీ ఆఫీసుకు వెళ్తే తమను అవమానించారు. డీజీపీ చంద్రబాబుకు ఏజెంట్గా పని చేస్తున్నారా?. రాష్ట్ర ప్రజల కోసం పని చేస్తున్నారా?. రాష్ట్రంలో దళితులను ఊచకోత కోస్తున్నారు. మాకు ఈ రాష్ట్రంలో బతికే అవకాశం లేకుండా చేస్తున్నారు. అయినా సరే మా పోరాటం ఆగదు. సాల్మన్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి. యరపతినేని శ్రీనివాసరావు పై చర్యలు తీసుకోవాలిఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రక్షణ లేదు: విడదల రజినిపోలీసు అధికారులు తమ విధులను కూడా మర్చిపోయారు. ప్రజలను గాలికి వదిలేసి చంద్రబాబు, లోకేష్కి సేవలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రక్షణ లేదు. టీడీపీ గూండాలు ఇళ్ల మీదకి వచ్చి హత్యలు చేస్తున్నారు. ఈ 20 నెలలుగా ఎంతో మంది హత్యకు గురయ్యారు. రాష్ట్రంలో ఏ సామాన్యుడు కూడా పోలీసు స్టేషను కు వెళ్లే పరిస్థితి లేదు. లోకల్ టీడీపీ ఎమ్మెల్యే చెప్తేనే స్టేషన్లోకి అడుగు పెట్టనిస్తున్నారు. డీజీపీ ఆఫీసులోకే మమ్మల్ని రానివ్వని పోలీసులు ఇక సామాన్యులకు ఏం న్యాయం చేస్తారు?. పోలీసులే దగ్గరుండి హత్యలు చేయిస్తున్నారుఆటవిక పాలనకు చెక్ పెడతాం: మొండితోక అరుణ్ కుమార్ఒక దళితుడిని హత మార్చితే ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది?. నేనే పెద్ద మాదిగనని ఎన్నికల సమయంలో చెప్పే చంద్రబాబు ఇప్పుడు ఏం చేస్తున్నారు?. ఎస్సీ మంత్రులు, ఎమ్మెల్యేలు సాల్మన్ హత్యపై ఎందుకు మౌనం వహించారు?. దళితులే చంద్రబాబు ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పే టైం వచ్చింది. రాష్ట్రంలో జరుగుతున్న ఆటవిక పాలనకు చెక్ పెడతాం -
అపాయింట్ మెంట్ కోరుతూ ఏపీ డీజీపీకి MLC లేళ్ల అప్పిరెడ్డి లేఖ
-
ఏపీ డీజీపీకి వైఎస్సార్సీపీ లేఖ
సాక్షి, తాడేపల్లి: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో వైఎస్సార్సీపీకి చెందిన దళిత కార్యకర్త మంద సాల్మన్ దారుణ హత్యపై రాష్ట్ర డీజీపీకి వినతిపత్రం సమర్పించాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు తమకు సోమవారం (19వ తేదీ)నాడు అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుతూ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి.. రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు.ఊరు విడిచి ఎక్కడో తలదాచుకుంటూ, తన భార్యను చూసేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ దళిత కార్యకర్త మంద సాల్మన్ను పిన్నెల్లిలో దారుణంగా ఐరన్ రాడ్లతో కొట్టి హత్య చేశారని.. రాష్ట్రంలో పూర్తిగా దిగజారిన శాంతిభద్రతలకు ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలుస్తోందని లేళ్ల అప్పిరెడ్డి వెల్లడించారు.రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి దళితులకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోతోందని, ముఖ్యంగా వైఎస్సార్సీపీ దళిత కార్యకర్తలు ప్రాణ భయంతో బిక్కుబిక్కు మంటున్నారని ఆయన తెలిపారు. సాల్మన్ హత్య కేసులో వేగంగా దర్యాప్తు పూర్తి చేసి, బాధ్యులకు తగిన శిక్ష పడేలా చూడాలని డీజీపీని కోరనున్నట్లు లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. -
పక్కా కుట్రతోనే టీడీపీ నేతల దాడులు.. డీజీపీకి సాక్షి ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: ఏపీవ్యాప్తంగా తమ కార్యాలయాలపై టీడీపీ నేతలు దాడులకు తెగపడుతుండడంపై సాక్షి మీడియా సంస్థ పోలీసులను ఆశ్రయించింది. బుధవారం ఉదయం సాక్షి ప్రతినిధుల బృందం డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను కలిసి ఫిర్యాదు అందజేసింది. ఏపీలో సాక్షి యూనిట్తోపాటు ప్రాంతీయ కార్యాలయాలపై టీడీపీ నేతలు, ఆ పార్టీ కార్యకర్తలు జరిపిన దాడులు.. ఆస్తులు విధ్వంసం తదితర వివరాలను ఫిర్యాదులో పేర్కొంది. ఈ సందర్భంగా దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని సాక్షి ప్రతినిధుల బృందం కోరింది. తద్వారా రాష్ట్రంలో పత్రిక స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులు పరిరక్షించాలని తెలిపింది. మహిళలు, బాలికలతో పాటు అన్ని వర్గాల పట్ల సాక్షి మీడియా పూర్తి గౌరవంతో వ్యవహరిస్తోందని, ఎటువంటి అనుచిత వ్యాఖ్యలను సాక్షి మీడియా సమర్థించదని, పక్కా కుట్రతోనే సాక్షి కార్యాలయాలపై దాడులు చేస్తున్నారని సాక్షి ప్రతినిధుల బృందం డీజీపీకి స్పష్టం చేసింది. కార్యాలయాలపై దాడికి బాధ్యులైన వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకునేలా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను ఆదేశించాలని ఆయన్ని సాక్షి బృందం కోరింది.ఏపీ పోలీస్ హెడ్క్వార్టర్స వద్ద సాక్షి ప్రతినిధుల బృందం -
కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వట్లేదు.. డీజీపీపై అంబటి ఫైర్
-
ఏపీ డీజీపీకి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు
ఢిల్లీ: ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అక్రమాలపై మూడు రోజుల్లోగా జవాబు చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరపాలన్న వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి ఫిర్యాదుపై ఏపీ ఎన్నికల సంఘం స్పందించింది.ఏపీ డీజీపీ నుంచి వివరణ కోరింది. -
తప్పుడు కేసుపై డీజీపీకి పేర్ని నాని ఫిర్యాదు
గుంటూరు, సాక్షి: తనపై తప్పుడు కేసు నమోదు అయిన విషయాన్ని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) డీజీపీకి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు శుక్రవారం ఫిర్యాదు చేస్తూ డీజీపీ(AP DGP) హరీష్ కుమార్ గుప్తాకు ఓ లేఖ రాశారు. గిట్టుబాటు ధర లేక ఆందోళనలో ఉన్న గుంటూరు మిర్చి రైతులను బుధవారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆయన జగన్, మరికొందరు వైఎస్సార్సీపీ(YSRCP) నేతలు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారంటూ నల్లపాడు పీఎస్లో టీడీపీ నేతలు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో జగన్ సహా వైఎస్సార్సీపీ నేతలపై కేసు నమోదు అయ్యింది.అయితే ఆ పర్యటనలో పాల్గొనని పేర్ని నాని(Perni Nani)పై కూడా కేసు నమోదు కావడంతో ఆయన స్పందించారు. ఈ పర్యటనలో పాల్గొనకున్నా తన ప్రతిష్టను దెబ్బ తీసేందుకు తనపై ఫిర్యాదు చేశారని డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారాయన. ప్రజాక్షేత్రంలో ఉన్న తనపై ఇలాంటి తప్పుడు కేసు బనాయించడం.. అందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని అన్నారాయన. ఈ అంశంపై విచారణ జరిపి తప్పుడు ఫిర్యాదు చేసిన వాళ్లపై, అలాగే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారాయన. ఇదీ చదవండి: సభ పెట్టలేదు.. మైక్ ముట్టలేదు.. ఇదేమీ దుర్మార్గం -
ఏపీ డీజీపీగా హరీష్కుమార్ గుప్తా నియమాకం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయనుండగా, ఈ క్రమంలో హరీష్కుమార్ గుప్తాను డీజీపీగా నియమించారు. 1992 బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


