breaking news
Anvay Dravid
-
భారత జట్టు ప్రకటన.. రాహుల్ ద్రవిడ్ తనయుడికి ఛాన్స్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్వహించే అండర్–19 ముక్కోణపు సిరీస్లో పాల్గొనే జట్లను జూనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అండర్–19 భారత్ ‘ఎ’, భారత్ ‘బి’ జట్లతో పాటు అఫ్గానిస్తాన్ అండర్–19 టీమ్ ఈ సిరీస్లో మూడో జట్టుగా బరిలోకి దిగుతుంది.‘బి’ జట్టు కెప్టెన్గా హైదరాబాద్కు చెందిన ఆరోన్ జార్జ్ ఎంపికయ్యాడు. ‘ఎ’ టీమ్కు పంజాబ్కు చెందిన విహాన్ మల్హోత్రా సారథిగా వ్యవహరిస్తాడు. ఇటీవల ముగిసిన బీసీసీఐ అండర్–19 టోర్నీ ‘వినూ మన్కడ్ ట్రోఫీ’లో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది.దీనికి ఆరోన్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో ఈ టీమ్ నుంచి నలుగురు ప్లేయర్లకు ముక్కోణపు సిరీస్లో ఆడే అవకాశం లభించింది. ‘బి’ కెప్టెన్ ఆరోన్ జార్జ్తో పాటు అండర్–19 ‘ఎ’ టీమ్లోకి హైదరాబాద్కు చెందిన వాఫి కచ్చి, రాపోలు అలంకృత్ (వికెట్ కీపర్), మొహమ్మద్ మాలిక్ ఎంపికయ్యారు.ద్రవిడ్ తనయుడికి చోటు..ఇక బి’ టీమ్లో వికెట్ కీపర్గా భారత దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్(Anvay Dravid)కు అవకాశం దక్కింది. అన్వయ్ ప్రస్తుతం కర్ణాటక తరపున జూనియర్ క్రికెట్ ఆడుతున్నాడు. 16 ఏళ్ల అన్వయ్ ద్రవిడ్ ఇటీవల వినూ మాన్కడ్ ట్రోఫీలో కర్ణాటక జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు.అంతేకాకుండా ఈ నెలలో హైదరాబాద్ వేదికగా జరిగిన పురుషుల అండర్-19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీలో భారత్ సికి అతడు ప్రాతినిథ్యం వహించాడు. జూనియర్ ద్రవిడ్ అండర్-16 స్ధాయిలో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.విజయ్ మర్చంట్ ట్రోఫీ (అండర్-16) 2023-24 సీజన్ అన్వయ్ దుమ్ములేపాడు. ఈ టోర్నమెంట్లో అన్వయ్ కర్ణాటక తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు, 5 మ్యాచ్లలో 45 సగటుతో 357 పరుగులు సాధించాడు. అంతకుముందు ఒక అండర్-16 ఇంటర్-జోనల్ మ్యాచ్లో అజేయ డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఇదే జోరును అన్వయ్ కొనసాగిస్తే త్వరలోనే భారత అండర్-19 జట్టులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశముంది.అఫ్గనిస్తాన్ అండర్-19 జట్టుతో తలపడే భారత అండర్-19 ‘ఎ’ జట్టు ఇదేవిహాన్ మల్హోత్రా (కెప్టెన్), అభిజ్ఞాన్ కుందు (వైస్ కెప్టెన్/వికెట్ కీపర్), వాఫీ కచ్చి, వంశ్ ఆచార్య, వినీత్ V.K), లక్ష్య రాయచందానీ, రాపోల్ (వికెట్ కీపర్), కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, అన్మోల్జీత్ సింగ్, మొహమ్మద్ ఇనాన్, హెనిల్ పటేల్, అశుతోష్ మహిదా, ఆదిత్య రావత్, మొహమ్మద్ మాలిక్.భారత్ అండర్-19 ‘బి’ జట్టుఆరోన్ జార్జ్ (కెప్టెన్), వేదాంత్ త్రివేది, యువరాజ్ గోహిల్, మౌల్యరాజాసిన్హ్ చావ్డా, రాహుల్ కుమార్, హర్వన్ష్ సింగ్ (వికెట్ కీపర్), అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), ఆర్ఎస్ అంబరీశ్, బీకే కిషోర్, నమన్ పుష్పక్, హేముచుందేషన్ జె, ఉద్ధవ్ మోహన్, ఇషాన్ సూద్, డి దీపేశ్, రోహిత్ కుమార్ దాస్.చదవండి: PAK vs SL: ఉత్కంఠ పోరు.. శ్రీలంకపై పాకిస్తాన్ గెలుపు -
అందుకే వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేయలేదు: బీసీసీఐ
అఫ్గనిస్తాన్ అండర్-19 జట్టుతో జరిగే ముక్కోణపు సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తమ జట్లను ప్రకటించింది. అండర్-19 స్థాయిలోని ‘ఎ’, ‘బి’ జట్లు సొంతగడ్డపై అఫ్గన్ జట్టుతో అమీతుమీ తేల్చుకోనున్నాయి. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో నవంబర్ 17 నుంచి 30 వరకు ఈ సిరీస్ జరుగుతుంది. కాగా తమ అండర్-19 జట్టు భారత్- ‘ఎ’, ‘బి’ జట్లతో యూత్ వన్డే ట్రై సిరీస్ ఆడనున్నట్లు ఇటీవలే అఫ్గనిస్తాన్ బోర్డు ప్రకటించింది. ఐసీసీ మెన్స్ అండర్-19 వరల్డ్కప్ టోర్నమెంట్ నేపథ్యంలో ఇరుజట్లకు ఈ సిరీస్ సన్నాహకంగా ఉంటుందని పేర్కొంది.ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీలకు దక్కని చోటుఈ నేపథ్యంలో అఫ్గన్తో సిరీస్కు తాజా తమ జట్లను ప్రకటించిన భారత్.. అనూహ్యంగా ఈ టీమ్ నుంచి సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi), కెప్టెన్ ఆయుశ్ మాత్రేలను తప్పించింది. కాగా పద్నాలుగేళ్ల వైభవ్ గత కొంతకాలంగా భారత్ తరఫున సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) సారథ్యంలోని భారత్ అండర్-19 జట్టులో భాగమైన ఈ బిహారీ పిల్లాడు.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో యూత్ వన్డేలు, యూత్ టెస్టుల్లో దుమ్మురేపే ప్రదర్శనలు ఇచ్చాడు.ఈ క్రమంలో అఫ్గనిస్తాన్తో ట్రై సిరీస్లోనూ వైభవ్ సూర్యవంశీ భాగం కావడం లాంఛనమేననే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి తరుణంలో ఈ సిరీస్ ఆడే రెండు భారత జట్లలోనూ వైభవ్ పేరు లేకపోవడం ఆశ్చర్యపరిచింది. అదే విధంగా.. కెప్టెన్ ఆయుశ్ మాత్రేను కూడా సిరీస్కు సెలక్టర్లు ఎంపిక చేయలేదు.అందుకే వైభవ్ను ఎంపిక చేయలేదుఇందుకు గల కారణాన్ని బీసీసీఐ తాజాగా వెల్లడించింది. ‘‘వైభవ్ సూర్యవంశీ పేరును ఈ సిరీస్కు పరిశీలించలేదు. అతడు ఇండియా- ‘ఎ’ తరఫున ఆసియా క్రికెట్ మండలి నిర్వహించే రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నీకి ఎంపికయ్యాడు కాబట్టి.. ఈ సిరీస్ నుంచి పక్కనపెట్టాల్సి వచ్చింది’’ అని స్పష్టం చేసింది.ఇక ముంబై తరఫున ప్రస్తుతం రంజీల్లో ఆడుతున్న కారణంగా ఆయుశ్ మాత్రేను కూడా పక్కనపెట్టినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే.. అఫ్గన్ అండర్-19తో తలపడే భారత ‘బి’ టీమ్లో వికెట్ కీపర్గా టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్కు చోటు దక్కడం విశేషం.అఫ్గనిస్తాన్ అండర్-19 జట్టుతో తలపడే భారత అండర్-19 ‘ఎ’ జట్టు ఇదేవిహాన్ మల్హోత్రా (కెప్టెన్), అభిజ్ఞాన్ కుందు (వైస్ కెప్టెన్/వికెట్ కీపర్), వాఫీ కచ్చి, వంశ్ ఆచార్య, వినీత్ V.K), లక్ష్య రాయచందానీ, A. రాపోల్ (వికెట్ కీపర్), కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, అన్మోల్జీత్ సింగ్, మొహమ్మద్ ఇనాన్, హెనిల్ పటేల్, అశుతోష్ మహిదా, ఆదిత్య రావత్, మొహమ్మద్ మాలిక్.భారత్ అండర్-19 ‘బి’ జట్టుఆరోన్ జార్జ్ (కెప్టెన్), వేదాంత్ త్రివేది, యువరాజ్ గోహిల్, మౌల్యరాజాసిన్హ్ చావ్డా, రాహుల్ కుమార్, హర్వన్ష్ సింగ్ (వికెట్ కీపర్), అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), ఆర్ఎస్ అంబరీశ్, బీకే కిషోర్, నమన్ పుష్పక్, హేముచుందేషన్ జె, ఉద్ధవ్ మోహన్, ఇషాన్ సూద్, డి దీపేశ్, రోహిత్ కుమార్ దాస్.రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ కోసం భారత ‘ఎ’ జట్టు ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, నేహల్ వధేరా, నమన్ ధిర్ (వైస్ కెప్టెన్), సూర్యాంశ్ షెడ్గే, జితేష్ శర్మ (కెప్టెన్, వికెట్ కీపర్), రమణదీప్ సింగ్, హర్ష్ దూబే, అశుతోష్ శర్మ, యశ్ ఠాకూర్, గుర్జప్నీత్ సింగ్, విజయ్కుమార్ వైశాక్, యుద్ద్వీర్ సింగ్ చరక్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సుయాష్ శర్మ. చదవండి: శభాష్ షహబాజ్ -
రాహుల్ ద్రవిడ్ కుమారుడికి బంపరాఫర్
నవంబర్ 5 నుంచి 11 వరకు హైదరాబాద్ వేదికగా జరుగబోయే మెన్స్ అండర్-19 IDFC ఫస్ట్ బ్యాంక్ వన్డే ఛాలెంజర్ ట్రోఫీ 2025 కోసం నాలుగు వేర్వేరు జట్లను బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీ ఇవాళ (నవంబర్ 4) ప్రకటించింది.టీమ్-ఏకు కెప్టెన్గా విహాన్ మల్హోత్రా, టీమ్-బికి కెప్టెన్గా వేదాంత్ త్రివేది, టీమ్-సికి కెప్టెన్గా ఆరోన్ జార్జ్, టీమ్-డికి కెప్టెన్గా చంద్రహాస్ దాస్ ఎంపికయ్యారు. ద్రవిడ్ కుమారుడికి బంపరాఫర్టీమిండియా దిగ్గజ బ్యాటర్ రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్కు (Anvay Dravid) బంపరాఫర్ వచ్చింది. ఈ టోర్నీ కోసం ఎంపిక చేసిన టీమ్-సిలో అతనికి చోటు దక్కింది. అన్వయ్ గత నెలలో కర్ణాటక అండర్-19 జట్టును వినూ మన్కడ్ ట్రోఫీ గెలిపించాడు. ఫైనల్లో కెప్టెన్ నాక్ (82 నాటౌట్) తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.జట్ల వివరాలు..టీమ్ A: విహాన్ మల్హోత్రా (C) (PCA), అభిజ్ఞాన్ కుందు (VC & WK) (MCA), వంశ్ ఆచార్య (SCA), బాలాజీ రావు (WK) (CSCS), లక్ష్య రాయ్చందాని (CAU), వినీత్ V.K (TNCA), మార్కండే పంచాల్ (UTCA), సాత్విక్ దేస్వాల్ (CAP), వీ యశ్వీర్ (HYCA), హేమ్చూడేశన్ (TNCA), R.S. అంబరీష్ (TNCA), హనీ ప్రతాప్ సింగ్ (RCA), వాసు దేవాని (GCA), యుధాజిత్ గుహా (CAB), ఇషాన్ సూద్ (PCA)టీమ్ B: వేదాంత్ త్రివేది (C) (GCA), హర్వన్ష్ సింగ్ (VC & WK) (SCA), వాఫీ కచ్చి (HYCA), సాగర్ విర్క్ (PCA), సయన్ పాల్ (CAB), వేదాంత్ సింగ్ చౌహాన్ (PCA), ప్రణవ్ పంత్ (DDCA), ఎహిత్ సలారియా (WK) (UTCA), B.K. కిషోర్ (TNCA), అన్మోల్జీత్ సింగ్ (PCA), నమన్ పుష్పక్ (MCA), D దీపేష్ (TNCA), మహమ్మద్ మాలిక్ (HYCA), మహమ్మద్ యాసీన్ సౌదాగర్ (MCA), వైభవ్ శర్మ (KSCA)టీమ్ సి: ఆరోన్ జార్జ్ (C) (HYCA), ఆర్యన్ యాదవ్ (VC) (PCA), అంకిత్ ఛటర్జీ (CAB), మణికాంత్ శివానంద్ (KSCA), రాహుల్ కుమార్ (PCA), యష్ కస్వాంకర్ (GOA CA), అన్వయ్ ద్రవిడ్ (WK) (KSCA), యువరాజ్ గోహిల్ (WK) (SCA), ఖిలన్ పటేల్ (GCA), కనిష్క్ చౌహాన్ (HCA), ఆయుష్ శుక్లా (MPCA), హెనిల్ పటేల్ (GCA), లక్ష్మణ్ పృథి (DDCA), రోహిత్ కుమార్ దాస్ (CAB), మోహిత్ ఉల్వా (SCA)టీమ్ డి: చంద్రహాస్ డాష్ (C) (CAB), మౌల్యరాజ్సింగ్ చావ్డా (VC) (GCA), శంతను సింగ్ (UPCA), అర్నవ్ బుగ్గ (DDCA), అభినవ్ కన్నన్ (TNCA), కుషాగ్రా ఓజా (RCA), ఆర్యన్ సక్పాల్ (WK) (MCA), ఎ. రాపోల్ (WK) (HYCA), వికల్ప్ తివారి (CSCS), మొహమ్మద్ ఎనాన్ (KCA), అయాన్ అక్రమ్ (UPCA), ఉదవ్ మోహన్ (DDCA), అశుతోష్ మహిదా (BCA), M తోషిత్ యాదవ్ (ACA), సోలిబ్ తారిక్ (JKCA)చదవండి: భారత జట్టులో వైభవ్ సూర్యవంశీ, ప్రియాంశ్ ఆర్య -
కర్ణాటక కెప్టెన్గా రాహుల్ ద్రవిడ్ కొడుకు.. కరుణ్ నాయర్ రీఎంట్రీ
త్వరలో జరుగనున్న వినూ మన్కడ్ ట్రోఫీ, రంజీ ట్రోఫీల కోసం కర్ణాటక జట్లను ఇవాళ ప్రకటించారు. వినూ మన్కడ్ ట్రోఫీలో పాల్గొనే జట్టుకు టీమిండియా దిగ్గజ బ్యాటర్ రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ (Anvay Dravid) సారధిగా ఎంపిక కాగా.. రంజీ ట్రోఫీ జట్టుకు మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) కెప్టెన్గా కొనసాగాడు. ఈసారి రంజీ జట్టులో పలు కొత్త ముఖాలకు చోటు దక్కింది. కృతిక్ కృష్ణ, శిఖర్ షెట్టి, మొహిసిన్ ఖాన్ తొలిసారి రంజీ జట్టులో చోటు దక్కించుకున్నారు.కరుణ్ నాయర్ రీఎంట్రీఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో విఫలమై, విండీస్ పర్యటనకు ఎంపిక కాని కరుణ్ నాయర్ (karun Nair) కర్ణాటక రంజీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. కరుణ్ గత రెండు రంజీ సీజన్లలో విదర్భ తరఫున ఆడాడు. గత సీజన్లో విదర్భ ఛాంపియన్గా నిలవడంలో కరుణ్ కీలకపాత్ర (16 ఇన్నింగ్స్ల్లో 53.96 సగటున 863 పరుగులు) పోషించాడు. గతకొంతకాలంగా దేశవాలీ క్రికెట్లో పరుగులు వరద పారించి, సెంచరీల మోత మోగించి టీమిండియాకు ఎంపికైన కరుణ్ ఇంగ్లండ్ పర్యటనలో నిరాశపరిచాడు. అక్టోబర్ 15న రాజ్కోట్లో సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్తో కరుణ్ కర్ణాటక తరఫున పునరాగమనం చేసేందుకు సిద్దంగా ఉన్నాడు.2025/26 రంజీ సీజన్ కోసం కర్ణాటక జట్టు: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), కరుణ్ నాయర్, ఆర్ స్మరణ్, కేఎల్ శ్రీజిత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ గోపాల్, వైశాక్ విజయకుమార్, విద్వత్ కవేరప్ప, అభిలాష్ శెట్టి, ఎం వెంకటేష్, నికిన్ జోస్, అభినవ్ మనోహర్, కృతిక్ కృష్ణ (వికెట్ కీపర్), కేవీ అనీష్, మోహ్సిన్ ఖాన్, శిఖర్ శెట్టి.కెప్టెన్గా అన్వయ్ ద్రవిడ్50 ఓవర్ల ఫార్మాట్లో జరిగే వినూ మన్కడ్ ట్రోఫీ అక్టోబర్ 9 నుంచి 17 వరకు డెహ్రాడూన్లో జరుగనుంది. ఈ టోర్నీ కోసం కర్ణాటక జట్టు కెప్టెన్గా అన్వయ్ ద్రవిడ్ ఎంపికయ్యాడు. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) ఎస్ మణికాంత్ నియమితుడయ్యాడు.వినూ మన్కడ్ ట్రోఫీ 2025 కోసం కర్ణాటక జట్టు: అన్వయ్ ద్రవిడ్ (కెప్టెన్, వికెట్ కీపర్), నితీష్ ఆర్య, ఆదర్శ్ డి ఉర్స, ఎస్ మణికాంత్ (వైస్ కెప్టెన్), ప్రణీత్ శెట్టి, వాసవ్ వెంకటేష్, అక్షత్ ప్రభాకర్, సి వైభవ్, కుల్దీప్ సింగ్ పురోహిత్, రతన్ బీఆర్, వైభవ్ శర్మ, కేఏ తేజస్, అథర్వ్ మాల్వియా, సన్నీ కాంచి, రెహాన్ మహమ్మద్అన్వయ్ ద్రవిడ్కు అవార్డుగత ఎడిషన్ అండర్-19 విజయ్ మర్చంట్ ట్రోఫీలో (రెడ్బాల్) సత్తా చాటిన అన్వయ్ ద్రవిడ్ను కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సన్మానించింది. ఈ టోర్నీలో అన్వయ్ 6 మ్యాచ్ల్లో 91.80 సగటున 459 పరుగులు సాధించి, కర్ణాటక తరఫున టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి.కాగా, రాహుల్ ద్రవిడ్ మరో కుమారుడు (పెద్దవాడు) కూడా క్రికెటరే అన్న విషయం తెలిసిందే. తమ్ముడు అండర్-16 విభాగంలో సత్తా చాటుతుంటే, అన్న సమిత్ సీనియర్ లెవెల్లో పర్వాలేదనిపిస్తున్నాడు. సమిత్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కాగా.. అన్వయ్ వికెట్ కీపర్ బ్యాటర్. చదవండి: తగ్గేదేలే!.. 459 పరుగులు.. ద్రవిడ్ చిన్న కుమారుడి జోరు.. -
తగ్గేదేలే!.. 459 పరుగులు.. ద్రవిడ్ చిన్న కుమారుడి జోరు..
టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) కుమారులు ఇద్దరూ తండ్రి బాటలోనే నడుస్తున్నారు. పెద్ద కుమారుడు సమిత్ ద్రవిడ్, చిన్న కొడుకు అన్వయ్ ద్రవిడ్ (Anvay Dravid) కర్ణాటక క్రికెట్ జట్టు తరఫున సత్తా చాటుతున్నారు.సమిత్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కాగా.. అన్వయ్ వికెట్ కీపర్ బ్యాటర్గా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. కాగా అండర్-16 క్రికెట్లో సత్తా చాటుతున్న అన్వయ్కు తాజాగా అవార్డు లభించింది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA) అతడిని సత్కరించింది.అత్యధిక పరుగుల వీరుడిగా మయాంక్తమ రాష్ట్రం తరఫున సత్తా చాటుతున్న క్రికెటర్లకు కేఎస్సీఏ ప్రతి ఏడాది అవార్డులు ఇస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం పురస్కారాలు అందజేసే కార్యక్రమం నిర్వహించింది. ఇందులో భాగంగా టీమిండియా వెటరన్ ఆటగాడు మయాంక్ అగర్వాల్ను సత్కరించింది.గతేడాది దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో ఓపెనింగ్ బ్యాటర్ మయాంక్ అగార్వల్ సగటు 93తో 651 పరుగులు చేసి.. లిస్ట్-ఎ క్రికెట్లో కర్ణాటక తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. ఇక టీమిండియా దిగ్గజం, మాజీ హెడ్కోచ్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ వరుసగా రెండో ఏడాది సత్తా చాటి అవార్డు అందుకున్నాడు.రెండు సెంచరీలు.. 459 పరుగులు.. అండర్-19 విజయ్ మర్చంట్ ట్రోఫీ (రెడ్బాల్)లో భాగంగా ఆరు మ్యాచ్లు ఆడిన అన్వయ్.. 91.80 సగటుతో 459 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండగా.. 46 బౌండరీలు కూడా అన్వయ్ ఖాతాలో చేరాయి. తద్వారా కర్ణాటక తరఫున టాప్ రన్ స్కోరర్గా నిలిచి అన్వయ్ అవార్డు అందుకున్నాడు.ఈ నేపథ్యంలో తండ్రి తగ్గ తనయుడు అంటూ అన్వయ్ను ద్రవిడ్ అభిమానులు కొనియాడుతున్నాడు. ఇదే జోరు కొనసాగిస్తూ.. టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.వీరికి కూడా అవార్డులుఇదిలా ఉంటే.. మిగతా వారిలో ఎడమచేతి వాటం బ్యాటర్ ఆర్. స్మరణ్ రంజీ ట్రోఫీలో రెండు శతకాల సాయంతో 516 పరుగులు చేసి.. టాప్ రన్ స్కోరర్గా అవార్డు అందుకున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో వాసుకీ కౌశిక్ గతేడాది 23 వికెట్లు పడగొట్టి పురస్కారం అందుకున్నాడు. అయితే, ఈ ఏడాది అతడు గోవాకు ఆడబోతుండటం గమనార్హం.అదే విధంగా.. లెగ్ స్పిన్నర్ శ్రేయస్ గోపాల్తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ శ్రీజిత్ కూడా సత్తా చాటి పురస్కారాలు అందుకున్నారు. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గోపాల్ 14 వికెట్లు తీయగా.. శ్రీజిత్ 213 పరుగులు సాధించాడు.ఇక మహిళా క్రికెటర్లకు కూడా KSCA ఈ సందర్భంగా అవార్డులు అందజేసింది. మలేషియా వేదికగా జరిగిన ఐసీసీ అండర్-19 వుమెన్స్ టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యులైన నికీ ప్రసాద్, మిథిలా వినోద్లను సత్కరించింది. అదే విధంగా పర్ఫామెన్స్ అనలిస్ట్ మాలా రంగస్వామికి కూడా అవార్డు అందజేసింది.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
కొడుకుతో కలిసి బరిలోకి దిగిన రాహుల్ ద్రవిడ్.. తండ్రి విఫలం.. కొడుకు హాఫ్ సెంచరీ
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ 12 ఏళ్ల తర్వాత క్లబ్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. చిన్న కొడుకు అన్వయ్తో కలిసి నసుర్ మెమొరియల్ షీల్డ్ టోర్నీలో పాల్గొన్నాడు. ఈ టోర్నీలో ద్రవిడ్ విజయా క్రికెట్ క్లబ్కు (మాలుర్) ప్రాతినిథ్యం వహించాడు. యంగ్ లయన్స్ క్లబ్తో జరిగిన మ్యాచ్లో ఆరో స్థానంలో బరిలోకి దిగిన ద్రవిడ్ 8 బంతుల్లో బౌండరీ సాయంతో 10 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో రాహుల్ ద్రవిడ్ విఫలమైనా కొడుకు అన్వయ్ ద్రవిడ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. వికెట్కీపర్ బ్యాటర్ అయిన అన్వయ్.. 58 బంతుల్లో 8 బౌండరీల సాయంతో 60 పరుగులు చేశాడు. రాహుల్-అన్వయ్ కొద్ది సేపు కలిసి బ్యాటింగ్ చేశారు. వీరిద్దరు 17 బంతుల్లో 15 పరుగులు జోడించారు. క్రికెట్ చరిత్రలో తండ్రి కొడుకులు కలిసి ఆడటం చాలా అరుదుగా జరిగింది.కలిసి క్రికెట్ ఆడిన కొంతమంది తండ్రి కొడుకులు..డబ్ల్యూజీ గ్రేస్-గ్రేస్ జూనియర్లాలా అమర్నాథ్-సురిందర్ అమర్నాథ్డెన్నిస్ లిల్లీ-ఆడమ్ లిల్లీడెనిస్ స్ట్రీక్- హీథ్ స్ట్రీక్శివ్నరైన్ చంద్రపాల్-తేజ్ నరైన్ చంద్రపాల్ఇయాన్ బోథమ్-లియామ్ బోథమ్ఇలా చేయడం ద్రవిడ్కు కొత్తేమీ కాదు..!రిటైర్మెంట్ తర్వాత క్లబ్ క్రికెట్ ఆడటం ద్రవిడ్కు ఇది కొత్తేమీ కాదు. గతంలో పలుమార్లు తన చిన్ననాటి క్లబ్ అయిన బెంగళూరు యునైటెడ్ క్రికెట్ క్లబ్కు ఆడాడు. ఈ జట్టుకు ఆడుతూ ద్రవిడ్ ఓ సెంచరీ కూడా చేశాడు.ద్రవిడ్ పెద్ద కొడుకు కూడా క్రికెటరే..!ద్రవిడ్ చిన్న పెద్ద కొడుకు సమిత్ ద్రవిడ్ కూడా క్రికెటరే. గతేడాది ఆగస్ట్లో సమిత్ భారత అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. గతేడాది మహారాజా టీ20 టోర్నీలోనే సమిత్ పాల్గొన్నాడు.ఇటీవలే బెంగళూరుకు వచ్చిన ద్రవిడ్రాహుల్ ద్రవిడ్ ఇటీవలే తన హో సిటీ బెంగళూరుకు వచ్చాడు. బెంగళూరుకు రాక ముందు ద్రవిడ్ గౌహతిలో జరిగిన రాజస్థాన్ రాయల్స్ ప్రీ సీజన్ క్యాంప్లో పాల్గొన్నాడు. ద్రవిడ్ రాయల్స్ హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సమిత్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో స్వప్నిల్ అనే ఆటగాడు సుడిగాలి శతంకంతో విజృంభించడంతో విజయ క్రికెట్ క్లబ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. స్వప్నిల్ 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేశాడు. యంగ్ లయన్స్ బౌలర్లలో ఆధిత్య నాలుగు వికెట్లు పడగొట్టాడు. -
శతక్కొట్టిన ద్రవిడ్ చిన్న కుమారుడు.. బౌండరీల వర్షం
మూలపాడు (ఆంధ్రప్రదేశ్): భారత బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ (153 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ శతకంతో మెరిశాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీలో భాగంగా జార్ఖండ్తో జరిగిన ఈ మ్యాచ్లో ఈ కర్ణాటక బ్యాటర్ ఆకట్టుకున్నాడు.మూడు రోజుల మ్యాచ్లో ఆఖరి రోజు కర్ణాటక తొలిఇన్నింగ్స్లో 123.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 441 పరుగుల భారీస్కోరు చేయగా, మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. జట్టు తరఫున నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన అన్వయ్ మొదట శమంతక్ అనిరుధ్ (76)తో కలిసి మూడో వికెట్కు 167 పరుగులు జతచేశాడు.387 పరుగులకు ఆలౌట్అనిరుధ్ అవుటయ్యాక వచ్చిన సుకుర్థ్ (33)తో నాలుగో వికెట్కు 43 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్లో 128.4 ఓవర్లలో 387 పరుగులు చేసి ఆలౌటైంది. 54 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన కర్ణాటకకు 3 పాయింట్లు లభించగా, జార్ఖండ్ ఒక్క పాయింట్తో సరిపెట్టుకుంది.జోనల్ టోర్నమెంట్లో డబుల్ సెంచరీఅన్వయ్ ద్రవిడ్ గతేడాది కర్ణాటక అండర్–14 జట్టుకు సారథ్యం వహించాడు. విజయ్ మర్చంట్ టోర్నీకి ముందు జరిగిన కేఎస్సీఏ (కర్ణాటక క్రికెట్ సంఘం) అండర్–16 ఇంటర్ జోనల్ టోర్నమెంట్లో బెంగళూరు జోన్కు ప్రాతినిధ్యం వహించిన అన్వయ్... తుంకూర్ జోన్పై చెలరేగి ఆడాడు. డబుల్ సెంచరీ (200 నాటౌట్)తో అజేయంగా నిలిచాడు.ఇక అన్వయ్ అన్నయ్య 19 ఏళ్ల సమిత్ కూడా ఇదివరకే జూనియర్ క్రికెట్లో ఆల్రౌండర్గా నిరూపించుకున్నాడు. సొంతగడ్డపై ఆ్రస్టేలియా అండర్–19 జట్టుతో జరిగిన పరిమిత ఓవర్ల, ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో సమిత్ ద్రవిడ్ రాణించాడు. చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు


