breaking news
Ankit Chavan
-
క్రికెటర్ అంకిత్ చవాన్కు ఊరట.. నిషేధం ఎత్తివేత
ఢిల్లీ: 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్లో దోషిగా తేలి జీవితకాలం నిషేధం ఎదుర్కొంటున్న క్రికెటర్ అంకిత్ చవాన్కు ఊరట కలిగింది. ఈ ముంబై మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ పై ఉన్న నిషేధాన్ని బీసీసీఐ ఎత్తివేసింది. బీసీసీఐ బ్యాన్ ఎత్తివేయడంతో ఇకపై ప్రొఫెషనల్ క్రికెట్ ఆడేందుకు అంకిత్ చవాన్కు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది. స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడడంపై తాను పశ్చాత్తాపం చెందుతున్నానని.. అంకిత్ చవాన్ ముంబై క్రికెట్ అసోసియేషన్ను కోరగా.. వారి సలహా మేరకు బీసీసీఐకి తనకు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలంటూ మే నెలలో ఒక లేఖను రాశాడు. తాజాగా బీసీసీఐ అంకిత్ చవాన్పై నిషేధం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా అంకిత్ చవాన్ తన కెరీర్లో 7 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు, 15 లిస్ట్ ఏ మ్యాచ్లు, 19 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఇక ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించాడు. కాగా 2013 ఐపీఎల్ సీజన్లో శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాలు బూకీలతో సంప్రదింపులు జరిపి స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఫిక్సింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలు నిజమని తేలడంతో బీసీసీఐ వారిని జీవితకాలం క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. కాగా తాను నిర్దోషినంటూ శ్రీశాంత్ గతేడాది సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. దోషిగానే గుర్తించిన సుప్రీం.. జీవిత కాల శిక్షను మాత్రమే తగ్గించమంటూ బీసీసీఐకి సూచించింది. దాంతో అతని శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్మన్ డీకే జైన్ 2019లో నిర్ణయం తీసుకున్నాడు. దాంతో గతేడా ఏడాది సెప్టెంబర్తో శ్రీశాంత్ శిక్షాకాలం పూర్తయింది. అనంతరం కేరళ తరపున శ్రీశాంత్ ముస్తాక్ అలీ ట్రోపీలో పాల్గొన్నాడు. చదవండి: 8 ఏళ్ల తర్వాత కూడా అదే తీరు PSL: ఆటగాళ్ల బూతు పురాణం.. వీడియో -
బోర్డు దృష్టిలో దోషులే!
శ్రీశాంత్ త్రయంపై నిషేధం ఎత్తివేయరట ఫిక్సింగ్ చేసినట్లు బీసీసీఐ దగ్గర సాక్ష్యాలు సాధారణంగా దేశంలో ఏ అంశమైనా న్యాయవ్యవస్థ చుట్టూ తిరుగుతుంది. కోర్టు ఏదైనా చెబితే దానిని పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటారు. కానీ బీసీసీఐ మాత్రం దీనికి భిన్నం. ప్రభుత్వాలతో, కోర్టులతో సంబంధం లేని స్వయం ప్రతిపత్తి గల సంస్థ తమదేననే భావనతో బోర్డు నిర్ణయాలు ఉంటాయి. పదవిలో ఎవరున్నా ఇదే దృక్ప థంతో నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీశాంత్ త్రయం ఫిక్సింగ్ చేసినట్లు ఆధారాలు లేవని కోర్టు తీర్పు చెప్పినా... తమ దగ్గర ఉన్న సాక్ష్యాల కారణంగా వారిపై నిషేధం ఎత్తివేసే ప్రసక్తే లేదని బోర్డు అంటోంది. దీనిపై రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. క్రీడావిభాగం ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ జరగలేదని మీరు నమ్ముతారా? ఈ లీగ్లో మ్యాచ్లన్నీ నిజాయితీగానే ఆడుతున్నారా? ఈ రెండు ప్రశ్నలు వేస్తే భారత్లో సగటు క్రికెట్ అభిమాని ఎవరైనా అవునని సమాధానం చెప్పే అవకాశం చాలా తక్కువ. నిజంగా ఫిక్సింగ్ జరిగిందా? జరుగుతుందా? అంటే అవునని ఆధారాలు చూపే వాళ్లు కూడా లేరు. అందుకే ఆ లీగ్ అలా సాగిపోతూనే ఉంటుంది. కారణం... క్రికెట్ అంటే ప్రేమ. అందుకే శ్రీశాంత్ బృందం తప్పు చేయలేదని ఢిల్లీ కోర్టు చెప్పగానే చాలా మంది పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఈ ఎపిసోడ్లో శ్రీశాంత్ బృందాన్ని సమర్ధించేవాళ్లు కొందరైతే... తప్పు చేసినా తప్పించుకున్నారని ఆరోపించేవారు మరికొందరు. ఇదంతా కూడా ‘స్క్రిప్ట్’లో భాగమేనంటూ నిర్వేదం చెందేవారు మరికొందరు. బోర్డుకు ముందే తెలుసు శ్రీశాంత్, అజిత్ చండిలా, అంకిత్ చవాన్ల గురించి ఇలాంటి తీర్పే వస్తుందని బీసీసీఐ లీగల్ నిపుణులు ముందే ఊహించారట. అందుకే బోర్డు కేవలం రెండు లైన్ల స్టేట్మెంట్తో దీనిని సరిపెట్టింది. దీనిపై ఇక స్పందించేది లేదని కూడా స్పష్టం చేసింది. న్యాయస్థానం ఏం చెప్పినా తమకు సంబంధం లేదని, తాము స్వతంత్రంగా చేసిన విచారణతోనే ఈ త్రయంపై నిషేధం విధించామని బీసీసీఐ చెబుతోంది. 2013లో ఈ కేసు గురించి బోర్డు ఓ విచారణ కమిటీని నియమించింది. ఢిల్లీ పోలీసుల దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ వీళ్ల దగ్గర ఉన్నాయి. వీటికి అదనంగా క్రికెటర్లు ముగ్గురూ తప్పు ఒప్పుకుంటూ సంతకాలు చేసిన డాక్యుమెంట్స్ బోర్డు దగ్గర ఉన్నాయని అంటున్నారు. ఇది బలమైన ఆధారం కాబట్టి నిషేధం ఎత్తివేయాల్సిన అవసరం లేదని బోర్డు భావించింది. కాబట్టి శ్రీశాంత్ బృందం బీసీసీఐ మీద కోర్టుకు వెళ్లి... అజయ్ జడేజా తరహాలోనే నిషేధం ఎత్తి వేయించుకోవాలి. 2000లో ఫిక్సింగ్ కేసులో ఇరుక్కున్నప్పుడు జడేజా న్యాయస్థానాన్ని ఆశ్రయించి తనపై ఉన్న నిషేధాన్ని తీయించుకున్నాడు. ఆ తర్వాత రంజీల్లో ఆడాడు. అయితే అదే కేసులో అజహరుద్దీన్కు కోర్టు క్లీన్చిట్ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ నిషేధం ఎత్తివేయలేదనేది గమనార్హం. ఆ నష్టానికి బాధ్యులెవరు? శ్రీశాంత్ను సమర్ధిస్తున్న వారు ఇప్పుడు ఓ కొత్త అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. అతను తప్పు చేయలేదని కోర్టు చెప్పినందున సచ్ఛీలుడేనని, కావాలని అతణ్ని కేసులో ఇరికించి బలిపశువును చేశారని అంటున్నారు. దీనివల్ల రెండేళ్ల పాటు ఆటకు దూరమవడంతో పాటు ఆర్థికంగా, ప్రతిష్ట పరంగా కూడా నష్టపోయాడని చెబుతున్నారు. దీనికి ఎవరు బాధ్యత తీసుకోవాలనే అంశంపై చర్చిస్తున్నారు. ఇప్పటికీ తాను తిరిగి క్రికెట్ ఆడగలననే నమ్మకంతో శ్రీశాంత్ ఉన్నాడు. అందుకే బీసీసీఐ మీద ఎలాంటి విమర్శలూ చేయడం లేదు. బోర్డు పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నాడు. ఒకవేళ తమ ఆశలు నెరవేరబోవని తెలిస్తే శ్రీశాంత్ బృందం బోర్డుకు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంటుంది. బోర్డు చేసిందేమిటి..? శ్రీశాంత్ త్రయంపై ఆరోపణలకు తగ్గ సాక్ష్యాలను ఢిల్లీ పోలీసులు ఇవ్వలేకపోతున్నారని తెలిసినప్పుడు బీసీసీఐ ఎందుకు కలగజేసుకోలేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. వీళ్లు దోషులే అని బోర్డు నమ్మినప్పుడు తమ దగ్గర ఉన్న అదనపు డాక్యుమెంట్స్ను ఢిల్లీ పోలీసులకు ఇస్తే సరిపోయేది. కానీ బోర్డు శైలి భిన్నం. తాము ఎవరి కనుసన్నల్లో పని చేయాల్సిన అవసరం లేదని, తమదో స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని బీసీసీఐ పెద్దల అభిప్రాయం. శరద్ పవార్ నుంచి అనురాగ్ ఠాకూర్ దాకా అధికారంలో ఎవరు ఉన్నా ఇదే తరహాలో వ్యవహరించారు. నిజానికి ఇది మంచిది కూడా కాదు. హైకోర్టుకు ఢిల్లీ పోలీసులు స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఢిల్లీ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ పోలీసులు హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. ఈ కేసులో తమ దగ్గర ఉన్న సాక్ష్యాలను సరైన పద్ధతిలో న్యాయస్థానం ముందు ఉంచడంలో విఫలమయ్యారని అధికారులు భావిస్తున్నారు. బంతి వేసేముందు వాచ్ చూపించడం, లాకెట్ను ముట్టుకోవడం లాంటి పనులు చేసిన ఈ క్రికెటర్లు ముందుగా బుకీలకు చెప్పినట్లే పరుగులు ఇచ్చారని, దీనికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయని అంటున్నారు. వారంలోగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని ఓ పోలీస్ అధికారి చెప్పారు. -
తూచ్!...అందరూ నిర్దోషులే
-
తూచ్!...అందరూ నిర్దోషులే
స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో ఆరుగురు ఇప్పటికీ పోలీసులకు దొరకలేదు. అయితే వీళ్లంతా పాత నేరస్థులు. వాళ్ల వల్ల భారత క్రికెట్ అప్రతిష్టపాలైందన్నారు... ఐపీఎల్ అంటేనే ఫిక్సింగ్ అంటూ అందరిలోనూ చులకన భావాన్ని తెచ్చారు... ఇందులో మాఫియా ఉందన్నారు... రెండేళ్ల పాటు రకరకాల వార్తలతో, కేసులతో హోరెత్తించారు. తీరా చూస్తే... అంతా తూచ్ అని తేల్చారు. శ్రీశాంత్, చండిలా, అంకిత్ చవాన్ ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు ఢిల్లీ పోలీసులు ఆధారాలు చూపించలేకపోయారు. దీంతో ఈ ముగ్గురితో పాటు మరో 33 మందిపై ఉన్న అన్ని కేసులనూ ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. ఆ ముగ్గురూ ఫిక్సింగ్ చేసినట్లు ఆధారాల్లేవు శ్రీశాంత్, చండిలా, అంకిత్ చవాన్లపై అన్ని కేసులూ కొట్టివేసిన ఢిల్లీ కోర్టు న్యూఢిల్లీ : భారత క్రికెట్ను కుదిపేసిన ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో ఊహించని తీర్పు వచ్చింది. ఫిక్సింగ్ ఆరోపణలతో జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండిలాలు నిర్దోషులని అడిషనల్ సెషన్స్ కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు సరైన ఆధారాలు చూపలేకపోయారని అడిషనల్ సెషన్స్ జడ్జీ నీనా బన్సాల్ కృష్ణ వ్యాఖ్యానించారు. కేసుతో సంబంధం ఉన్న 36 మందిపై నమోదైన అన్ని కేసులను కోర్టు కొట్టేసింది. మహారాష్ట్ర వ్యవీస్థీ కృత నేరాల చట్టం (మోకా) కేసు నుంచి కూడా ఆటగాళ్లను తప్పించింది. దీనికి సంబంధించిన ఆరోపణలకు తగిన రుజువులు లేవని వెల్లడించింది. ఉదయమే కేసును విచారణకు తీసుకున్నా... తీర్పు మాత్రం మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య వెలువరించారు. ఈ సందర్భంగా కోర్టుకు హాజరైన శ్రీశాంత్ తీర్పు అనంతరం కన్నీళ్లపర్యంతమవుతూ మోకాళ్లపై కూలబడిపోయాడు. చవాన్, చండిలాలు కూడా ఏడుపు ఆపుకోలేకపోయారు. ఇదీ కేసు... ఐపీఎల్-6 సందర్భంగా శ్రీశాంత్, చవాన్, చండిలాలు స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలతో బీసీసీఐ వీరిపై జీవితకాల నిషేధం కూడా విధించింది. తదనంతర విచారణలో ఇందులో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ హస్తం ఉందని ఆరోపిస్తూ కేసులు నమోదు చేశారు. 6 వేల పేజీలతో చార్జ్షీట్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు తర్వాత మరిన్ని సప్లిమెంటరీ చార్జ్షీట్లు కూడా వేశారు. కేసుతో సంబంధం ఉన్న వారందరిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 120 బి (నేరపూరిత కుట్ర), రెడ్ విత్ 419 (వ్యక్తిగత మోసానికి పాల్పడటం), 420 (మోసం చేయడం)తో ‘మోకా’లోని వివిధ సెక్షన్స్ కింద కేసులు పెట్టారు. నిషేధం కొనసాగుతుంది: బీసీసీఐ కోర్టు తీర్పుతో ఊరట పొందిన క్రికెటర్లు బీసీసీఐ నుంచి చేదు వార్త వినాల్సి వచ్చింది. ఆటగాళ్లపై విధించిన నిషేధాన్ని తొలగించే అవకాశం లేదని బోర్డు స్పష్టం చేసింది. తమ క్రమశిక్షణ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పింది. ‘క్రమశిక్షణ చర్యలు బీసీసీఐ స్వతంత్రంగా తీసుకుంది. ఇందులో నేర విచారణకు తావులేదు. కమిటీ ఇచ్చిన తీర్పు ఆధారంగా బోర్డు చర్యలు తీసుకుంటుంది. కాబట్టి దాన్ని తొలగించలేం’ అని బీసీసీఐ ఓ ప్రకటనను విడుదల చేసింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్పై ఐపీఎల్ ఆఫీస్ బేరర్గా పని చేస్తున్న ఢిల్లీ పోలీస్ మాజీ కమిషనర్ అభిప్రాయాన్ని తీసుకోవాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. నిషేధం ఎత్తివేయాలని బోర్డుకు మెయిల్ పంపిస్తానని కేరళ క్రికెట్ సంఘం అధ్యక్షుడు, బీసీసీఐ ఉపాధ్యక్షుడు టీసీ మ్యాథ్యూ చెప్పారు. కేసు సాగిందిలా... ►మే 16, 2013: రాజస్తాన్ రాయల్స్ క్రికెటర్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండిలాలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురూ స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు ఆరోపించారు. వీరితో పాటు ఐపీఎల్లో గతంలో ఆడిన అమిత్ సింగ్తో సహా మరో 11 మంది బుకీలను అరెస్టు చేశారు. ►మే 17, 2013: విచారణలో శ్రీశాంత్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు అంగీకరించాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ►మే 18, 2013: ఢిల్లీ పోలీసులు చండిలా ఇంటిపై దాడి చేశారు. ►మే 28, 2013: ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం. కేసును విచారించేందుకు కమిటీ ఏర్పాటు. ►జూన్ 10, 2013: శ్రీశాంత్, చవాన్లకు బెయిల్ వచ్చింది. ►జూలై 30, 2013: శ్రీశాంత్, చవాన్, చండిలా, దావూద్, షకీల్తో సహా 39 మందిని నిందితులుగా ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు చార్జ్షీట్ను దాఖలు చేశారు. ►సెప్టెంబరు 9, 2013: చండిలాకు కూడా బెయిల్. ►సెప్టెంబరు 13: శ్రీశాంత్, చవాన్లను బీసీసీఐ జీవితకాలం నిషేధించంది. అమిత్ సింగ్పై ఐదేళ్లు నిషేధం విధించారు. ఫిక్సింగ్ చేయమని సహచరులు కోరిన విషయాన్ని బోర్డు దృష్టికి తీసుకు రానందుకు సిద్దార్ధ్ త్రివేదిపై ఏడాది నిషేధం విధించారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న స్పిన్నర్ హర్మీత్పై ఎలాంటి ఆధారాలు లేనందున చర్యలు తీసుకోలేదు. ►నవంబర్ 18, 2013: బుకీ చంద్రేశ్ జైన్ అలియాస్ జూపిటర్పై సప్లిమెంటరీ చార్జ్షీట్ దాఖలు చేసిన పోలీసులు. ►ఆగస్టు 16, 2014: దావూద్, చోటా షకీల్ ఆస్తులను అటాచ్ చేయాలని ఆదేశం. ►సెప్టెంబర్ 30, 2014: దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్, సందీప్ శర్మలు నేరస్తులని అభిప్రాయపడిన కోర్టు. ►మే 8, 2015: వాదనల తర్వాత తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు. ►జూలై 25, 2015: శ్రీశాంత్, చవాన్, చండిలా ముగ్గురు నిర్దోషులని కోర్టు తీర్పు. వీళ్లపై నమోదైన అన్ని కేసులను కొట్టివేసింది. భవిష్యత్ ఏమిటి? ►కోర్టు నిర్దోషులని తేల్చిన తర్వాత బీసీసీఐ నిషేధం ఎత్తివేయాలి. నిజానికి ఈ కేసు బోర్డుకు, క్రికెటర్లకు మధ్య కాదు. ఒకవేళ పైకోర్టుకు వెళ్లినా ఢిల్లీ పోలీసులు వెళ్లాలి గానీ బీసీసీఐ కాదు. కానీ బోర్డు వీళ్లపై నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది. కాబట్టి వీళ్లు ముగ్గురూ తమపై నిషేధం ఎత్తివేయమని కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. ►ఒకవేళ నిషేధం ఎత్తివేయాలని కోర్టు తీర్పు ఇస్తే... తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించి ఈ ముగ్గురూ ఐపీఎల్ జట్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. అయితే వీళ్లు నిర్దోషులుగా బయటకొచ్చినా ఇంకా అభిమానుల మనసుల్లో పూర్తిగా అనుమానాలు తొలిగిపోలేదు. ఈ నేపథ్యంలో ఏదైనా ఫ్రాంచైజీ వీళ్లని తీసుకుంటుందా? లేదా? అనేది కూడా ఆసక్తికర అంశమే. అయితే ఇదంతా జరగటానికి చాలా సమయం పడుతుంది. అప్పటిదాకా నిరీక్షించడం తప్ప ఏమీ చేయలేరు. ఈ కేసు తేలే సమయానికి వీళ్లలో క్రికెట్ ఆడే ఫిట్నెస్ ఉంటుందా అనేది సందేహమే. అతనే చీఫ్!: స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్, చండిలా, చవాన్లను అరెస్ట్ చేసిన అప్పటి ఢిల్లీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ ప్రస్తుతం బీసీసీఐ అవినీతి నిరోధక యూనిట్కు అధిపతిగా పని చేస్తున్నారు. అప్పట్లో కేసుపై ప్రత్యేక శ్రద్ధ చూపెట్టిన నీరజ్ విచారణలో అనేక కోణాలను బయటకు తీసుకొచ్చారు. కానీ కొంత విచారణ తర్వాత నీరజ్ రిటైర్మెంట్ కావడంతో మరో అధికారి దాన్ని కొనసాగించారు. ప్రస్తుతం ఈ క్రికెటర్లపై నిషేధాన్ని తొలగించేందుకు బోర్డు నీరజ్ సలహాపైనే ఆధారపడనుంది. చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే క్రికెట్ సాధన మొదలుపెడతా. శిక్షణ సౌకర్యాలను వినియోగించుకునేందుకు బీసీసీఐ అనుమతి ఇస్తుందని భావిస్తున్నా. ఫిట్నెస్ సాధించి సెలక్షన్లో పాల్గొంటా. దేవుడు నాపై ఎనలేని కరుణ చూపాడు. క్రికెట్ ఆడటం కోసమే నేను పుట్టాను. మొదట నేను క్రికెటర్ని. ఆ తర్వాతే ఏదైనా. ఈ మొత్తం ఎపిసోడ్లో బోర్డు బాగా మద్దతిచ్చింది. కేసు నుంచి బయటపడితే మళ్లీ క్రికెట్ ఆడొచ్చని మ్యాథ్యూ సార్ చెప్పారు. నా కూతురు పెరిగి గూగుల్లో నా పేరు వెతికే సమయానికి పూర్తి క్లీన్గా కనిపించాలి. ఇప్పుడు కొత్త జీవితాన్ని ఆరంభించాలి. ఈ కష్టకాలంలో నా వెన్నంటే ఉన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. - శ్రీశాంత్ ►మా ప్రార్థనలు ఫలించాయి. దేవుడికి కృతజ్ఞతలు. అన్నింటికి ఆ దేవుడే సాక్షి. నా కుమారుడి నిర్ధోషితత్వాన్ని నిరూపించేందుకు సాయపడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. తీర్పును రిజర్వ్ చేసిన తర్వాత చాలా క్షోభను అనుభవించాం. అనుకూలంగా రావాలని దేవుళ్లను వేడుకున్నాం. ఇప్పుడు అది ఫలించింది.’ -శాంతకుమారన్, సావిత్రి దేవి (శ్రీశాంత్ తల్లిదండ్రులు) కేసు నుంచి బయటపడ్డా. ఇక క్రికెట్ ఆడటంపై దృష్టిపెట్టాలి. అయితే ఇంకా ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూడాలి. ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తా. ఓ క్రికెటర్గా చాలా కష్టకాలం అనుభవించా. నా కుటుంబం, స్నేహితులు అండగా నిలిచారు. వీలైనంత త్వరగా మళ్లీ క్రికెట్లోకి అడుగుపెడతా. -చవాన్ న్యాయ వ్యవస్థపై, దేవుడిపై నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు బీసీసీఐని నమ్ముతున్నా. మళ్లీ ఆడే అవకాశం ఇస్తుందని ఆశిస్తున్నా. తదుపరి చర్యలు ఎలా తీసుకోవాలో మా లాయర్తో చర్చిస్తా. నా జీవితంలో ఇది అత్యంత కష్టకాలం. నా కుటుంబ సాయం మర్చిపోలేను. రెండేళ్ల తర్వాత అన్నీ సర్దుకుంటాయని చెప్పారు. అలాగే జరిగింది. ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. -చండీలా పటియాల హౌస్ కోర్టు తీర్పు ఆ ముగ్గురు క్రికెటర్లకు మేలు చేస్తుంది. ఫిక్సింగ్ విషయంలో కోర్టు తాము నమ్మిన విషయాన్నే వెలువరించింది. శ్రీశాంత్పై అన్ని అభియోగాలను వెనక్కితీసుకున్నారు కాబట్టి తన విషయంలో బీసీసీఐకి ఎలాంటి సమస్య లేదనే అనుకుంటున్నాను. అయినా తను జట్టులోకి వచ్చే విషయం పూర్తిగా బోర్డు చేతిలోనే ఉంది. - సౌరవ్ గంగూలీ (భారత మాజీ కెప్టెన్)