breaking news
Anjana Devi
-
అంజనా దేవికి అస్వస్థత.. నాగబాబు ఏమన్నారంటే?
తన మాృతమూర్తి అంజనాదేవి అనారోగ్యంపై తనయుడు నాగబాబు స్పందించారు. ప్రస్తుతం అమ్మ ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని అభిమానులను కోరారు. మా అమ్మ ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని.. వాటిని ఎవరు కూడా నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.కాగా.. ఇవాళ ఉదయం అంజనా దేవి అనారోగ్యానికి గురయ్యారంటూ రూమర్స్ వచ్చాయి. ఆమె తీవ్ర అస్వస్థత గురయ్యారంటూ కథనాలు రావడంతో నాగబాబు స్పందించారు. అంతేకాకుండా ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ హైదరాబాద్ వచ్చారని రాసుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి సైతం షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్నారని వార్తలొచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న పలువురు అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే నాగబాబు క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేశారు.అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది.There is some inaccurate information being circulated,but she is absolutely fine.— Naga Babu Konidela (@NagaBabuOffl) June 24, 2025 -
చిరంజీవి తల్లికి తీవ్ర అస్వస్థత!
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి.. తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో కేబినెట్ మీటింగ్లో ఉన్న పవన్ కల్యాణ్.. హుటాహుటిన అమరావతి నుంచి బయలుదేరి హైదరాబాద్కి వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఈ విషయం వినిపిస్తుంది. అయితే మెగా ఫ్యామిలీ నుంచి అస్వస్థత గురించి క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: చిరు పక్కన అనామక హీరోయిన్?)ఈ ఏడాది జనవరిలో అంజనా దేవి.. 75వ పుట్టినరోజు సెలబ్రేట్ పూర్తి చేసుకున్నారు. ఇది జరిగిన కొన్నిరోజులకే అంటే ఫిబ్రవరిలో.. ఈమె అనారోగ్యానికి గురయ్యారనే రూమర్స్ వచ్చాయి. కానీ వెంటనే కోలుకున్నారు. ఆరోగ్యంగానే ఉన్నారని మెగా ఫ్యామిలీ నుంచి స్పష్టత వచ్చింది. ఇప్పుడు మరోసారి అస్వస్థతకు గురయ్యారనే తెలిసి మెగా అభిమానులు కంగారు పడుతున్నారు.అంజనా దేవికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుమారుల విషయానికొస్తే చిరంజీవి హీరోగా ఇప్పటికీ సినిమాలు చేస్తున్నాడు. మనవడు రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్. మిగిలిన ఇద్దరు కొడుకులు నాగబాబు, పవన్ కల్యాణ్. కూతుళ్ల పిల్లలు కూడా ప్రస్తుతం నటులుగా రాణిస్తున్నారు. కుటుంబం అంతా హైదరాబాద్లోనే ఉంటున్నారు.(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్'.. నేను చేసిన పెద్ద తప్పు: దిల్ రాజు)