Ananya Birla
-
ఇప్పటికి కుదిరింది: అనన్య బిర్లా పోస్ట్ వైరల్
సన్రైజర్స్ హైదరాబాద్తో పాటు ఆ జట్టు యజమాని కావ్యా మారన్కు కూడా అభిమాన గణం ఎక్కువే. మ్యాచ్ సమయంలో స్టేడియానికి విచ్చేసి జట్టును ఉత్సాహపరచడం ఆమెకు పరిపాటి. ముఖ్యంగా హోం గ్రౌండ్ అంటే ఉప్పల్లో మ్యాచ్లో కావ్య తప్పక ఉండాల్సిందే.ఇక మ్యాచ్ ఆసాంతం తాను ఇచ్చే ఎక్స్ప్రెషన్లతో గత కొన్నేళ్లుగా కావ్యా మారన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు ఆమెకు పోటీగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ యాజమాన్యంలో భాగమైన అనన్య బిర్లా వచ్చి చేరింది. ముఖ్యంగా ఐపీఎల్-2026 సీజన్ ఆరంభ మ్యాచ్లో ఆర్సీబీ- సన్రైజర్స్ తలపడగా.. వీరిద్దరు హైలైట్ అయ్యారు.తాజాగా ఆదివారం డబుల్ హెడర్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం మ్యాచ్లో సన్రైజర్స్- లక్నో సూపర్ జెయింట్స్ తలపడగా.. కావ్యా మారన్ ఈ మ్యాచ్కు హాజరైంది. మరోవైపు.. సాయంత్రం ఆర్సీబీ- చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్కు అనన్య బిర్లా విచ్చేసింది.అయితే, ఈసారి అనన్య తనతో పాటు తన ప్రాణ స్నేహితురాలు, భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జాను కూడా తీసుకువచ్చింది. ఓవైపు ఆర్సీబీ దిగ్గజం విరాట్ కోహ్లి సతీమణి అనుష్క శర్మ.. మరోవైపు.. అనన్య- సానియా స్టాండ్స్ నుంచి ఆర్సీబీ ఉత్సాహపరిచారు. ఇక సానియాతో పాటు ఆమె కుమారుడు ఇజహాన్ సైతం ఈ మ్యాచ్ను వీక్షించాడు.ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ క్రమంలో అనన్య పెట్టిన పోస్టు నెటిజన్లను ఆకర్షిస్తోంది. సానియా- ఇజహాన్ల వెనుక వరుసలో తాను కూర్చుని ఉన్న ఫొటోను పంచుకున్న అనన్య.. ‘‘కలిసి ఫొటో దిగాలని ఎల్లప్పుడూ అనుకుంటాము. కానీ ఎప్పుడూ ఇలా కుదరలేదు. ఈసారి ఈ ఫొటో దొరికింది. ఐ లవ్ యూ సానియా.. ఇజ్జూ.. నువ్వు బెస్ట్ బాబూ’’ అని క్యూట్ క్యాప్షన్ ఇచ్చింది.ఇక మ్యాచ్ల విషయానికొస్తే.. లక్నో చేతిలో సన్రైజర్స్ ఓడిపోగా.. ఆర్సీబీని చెన్నైని చిత్తు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్తానానికి చేరింది. ఈ క్రమంలో కావ్య నిరాశగా వెనుదిరగగా.. అనన్య బృందం సంబరాలు చేసుకుంది.చదవండి: IPL కాదు!.. PSL నంబర్ వన్: పీసీబీ చీఫ్ ఓవర్ కాన్ఫిడెన్స్ -
కావ్యా మారన్కు అనన్య బిర్లా చెక్!
ఐపీఎల్లో కావ్యా మారన్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సన్రైజర్స్ హైదరాబాద్ యజమానిగా ఉన్న కావ్యా మారన్ తమ జట్టు ఆడే ప్రతి మ్యాచ్కు హాజరై ఆటగాళ్లను, అభిమానులను ఉత్సాహపరుస్తుంటారు. ఎస్ఆర్హెచ్ గెలిచినా, ఓడినా కావ్యా మారన్ ఇచ్చే హావభావాలు హైలైట్గా నిలుస్తుండేవి. అలాంటి కావ్యా మారన్కు పోటీగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా తమ కావ్యా మారన్ను పరిచయం చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారిపోయింది. ఇంతకీ బెంగళూరు కావ్యా మారన్ ఎవరనే కదా మీరు అనుకుంటున్నారు. అక్కడికే వస్తున్నాం. ఆమె పేరు అనన్య బిర్లా. బిర్లా గ్రూప్ అధినేత కుమార మంగళం బిర్లా పెద్ద కుమార్తె. ఇటీవలే ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం చేతులు మారిన విషయం తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి జట్టును నడిపిస్తున్న యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్(యుఎస్ఎస్) సంస్థ తాజాగా.. రూ.16,706 కోట్ల ధరకు ఆర్సీబీని అమ్మేసింది. ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్ట్ వెంచర్స్, ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ కన్సార్టియం ఆర్సీబీని దక్కించుకున్నాయి. బిర్లా కుమారుడు 28 ఏళ్ల ఆర్యమాన్ బిర్లా ఆర్సీబీ కొత్త ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ మ్యాచ్కు అనన్య బిర్లా, ఆర్యమాన్ బిర్లా హాజరయ్యారు. ఆర్సీబీ జెర్సీ ధరించిన అనన్య బిర్లా చేతితో ఆర్సీబీ జెండాను ఊపుతూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఆమె ఇచ్చిన హావభావాలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ఒకవైపు స్టాండ్స్లో కావ్యా మారన్ తన ఎస్ఆర్హెచ్ టీమ్ను ఎంకరేజ్ చేస్తుంటే.. మరో స్టాండ్ నుంచి అనన్య బిర్లా కావ్యా మారన్కు పోటీగా ఆర్సీబీ జెండాను ఊపుతూ కనిపించింది. ఇది చూసిన అభిమానులు కావ్యామారన్ లాగే అనన్య బిర్లా కూడా సీజన్లో ఆర్సీబీ ఆడబోయే అన్ని మ్యాచ్లకు హాజరైతే బాగుంటుందని చెవులు కొరుక్కుంటున్నారు. మరి వారి కోరికను అనన్య బిర్లా మన్నించి తర్వాతి మ్యాచ్లకు కూడా హాజరవుతుందేమో చూడాలి. ఇక విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మతో కలిసి అనన్య మ్యాచ్ వీక్షించారు. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఎవరీ అనన్య బిర్లా?1994లో ముంబైలో జన్మించిన అనన్య.. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదివారు. ప్రస్తుతం ఆదిత్య బిర్లా గ్రూప్లోని పలు కీలక వ్యాపార బాధ్యతలను చూసుకుంటున్నారు. మరి ఈ సీజన్లో ఆర్సీబీ ఆడే మిగతా మ్యాచులకు కూడా అనన్య హాజరవుతారా అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.Ananya Birla at the Chinnaswamy Stadium wearing RCB jersey. pic.twitter.com/dLWhmgwX4f— Mufaddal Vohra (@mufaddal_vohra) March 28, 2026 View this post on Instagram A post shared by Ananya Birla (@ananyabirla) చదవండి:వణికిపోయిన ఇషాన్ కిషన్! -
అనన్య బిర్లాకు కథ చెప్తారా ?
ఏవిఎం చెట్టియార్.. జెమిని వాసన్ .. విజయా నాగిరెడ్డి ఒకప్పుడు సినిమాలంటే మగవారి నిర్మాణం. ఇప్పుడు దేశంలో స్త్రీలు సినీ నిర్మాణాన్ని లీడ్ చేస్తున్నారు. బిర్లా కుటుంబం నుంచి అనన్య బిర్లా ‘బిర్లా స్టూడియోస్’ మొదలెట్టడం తాజా ఉదాహరణ. భారీ మూలధనం కేటాయించి దేశీయ భాషల్లో సాంస్కృతిక మూలాలున్న సినిమాలు తీస్తానంటున్నారు అనన్య. దర్శకులూ... ఆమెకు కథ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారా?సంప్రదాయ మేకింగ్ నుంచి కార్పొరేట్ మేకింగ్కు సినీ రంగం వెళ్లేకొద్దీ స్త్రీల ప్రమేయం పెరుగుతూ ఉంది. బాలాజీ సంస్థలో ఏక్తా కపూర్, తమిళనాట రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, తెలుగులో అశ్వినీదత్ కుమార్తెలు ప్రియాంక, స్వప్న, అన్నపూర్ణ నుంచి సుప్రియా యార్లగడ్డ, చిరంజీవి కుమార్తె సుస్మిత... ఇలా ఇన్ని పేర్లు ఒకప్పుడూ ఊహకే అసాధ్యం. ఇప్పుడు ఈ మహిళా శక్తికి మరో ప్రచండ శక్తి తోడయ్యింది. బిర్లా గ్రూప్ నుంచి అనన్య బిర్లా తాజాగా సినిమా రంగంలోకి వచ్చారు. ‘బిర్లా స్టూడియోస్’ స్థాపించి ప్రాదేశిక చిత్రాలను తీయాలని నిశ్చయించుకున్నారు. ఇది దర్శకులకు మంచి కబురే.ఎలా మేలు?సంప్రదాయ ప్రొడ్యూసర్లు ఏకకాలంలో అనేక సినిమాలు తీయరు. కాని కార్పొరేట్ సంస్థలకు ఆ సౌలభ్యం, సామర్థ్యాలు, వ్యవస్థ ఉంటాయి. సంప్రదాయ ప్రొడ్యూసర్లు ఫార్ములాకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వొచ్చు. అనన్య బిర్లా చెప్పేదాని ప్రకారం మూసకు భిన్నంగా ఉండే కథలకు అవకాశం దొరుకుతుంది. పక్షపాతాలు, సిఫార్సులతో పని లేకుండా టాలెంట్కు అవకాశం దొరికే వీలు ఎక్కువ.కుబేరుల్లో కళాహృదయంఆదిత్య బిర్లా గ్రూప్ దేశంలో అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటి. అటువంటి సంస్థకు వారసురాలు అనన్య బిర్లా. కుమార మంగళం బిర్లా, నీర్జా బిర్లా దంపతుల పెద్ద కుమార్తె. బిర్లా కుటుంబంలో ఆరవ తరం వారసురాలు. అయితే అది మాత్రమే ఆమె ప్రత్యేకత కాదు. అనన్యది కళాహృదయం. ఆమె ప్రముఖ గాయని. పదకొండేళ్ల వయసులోనే సంతూర్ వాయించడం నేర్చుకున్నారు. ఆ తర్వాత అనేక ఆల్బమ్స్ విడుదల చేసి అభిమానులను పొందారు. మరోవైపు అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబేలో చదువు పూర్తి చేసి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పొందారు. 17 ఏళ్ల వయసులోనే సొంతంగా మైక్రోఫిన్ ప్రైవేట్ లిమిటెడ్ను స్థాపించారు. ప్రస్తుతం ఇది దేశంలో రెండవ అతిపెద్ద మైక్రోఫైనాన్స్ సంస్థ. 2016లో అనన్య లగ్జరీ ఇ–కామర్స్ ప్లాట్ఫామ్ అయిన ‘ఇకాయ్ అసాయ్’ను స్థాపించారు. ఫోర్బ్స్ విడుదల చేసిన ‘ఆసియాలో ప్రముఖ మహిళలలో ఒకరిగా’ నిలిచారు. గతేడాది ఆమె ‘బిర్లా కాస్మెటిక్స్’ పేరుతో కన్సూ్యమర్ బ్రాండ్లు ప్రారంభించారు.దేశీయ కథలకే ప్రాధాన్యం‘బిర్లా స్టూడియో’ పేరుతో కొత్త ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించాక వాణిజ్యపరంగా లాభదాయకమైన సినిమా లు తీస్తూనే కథనంలో విలువల పరంగా ఏమాత్రం రాజీపడనని అనన్య తెలిపారు. ‘మనమందరం కథలు వింటూనే పెరిగాం. కథలు వినేందుకు మన చుట్టూ ఉన్న శక్తిమంతమైన మాధ్యమాలలో సినిమా ఒకటి. దాన్ని సమర్థంగా వినియోగించుకుంటే ప్రేక్షకులకు అద్భుతాలు చూపించొచ్చు’ అని ఆమె వివరిస్తున్నారు. ‘వినోద విలువలతో సాంస్కృతిక ప్రాముఖ్యతను చూపే చిత్రాలు తీయడంపైనే మా నిర్మాణ సంస్థ నుంచి దృష్టి పెడుతుంది’ అంటున్నారు. త్వరలో బిర్లా స్టూడియోస్ హిందీ, గుజరాతీ, మలయాళంతోపాటు ఇతర అన్ని ప్రాంతీయ భాషల్లో చిత్రాలు తీయాలని చూ స్తోంది. ఇంగ్లిషు సినిమాలు సైతం తీసే యోచనతో ఉంది.పెద్ద దర్శకులతో చర్చలుబి స్టూడియోస్ అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే చాలా మంది పెద్ద దర్శకులతో అనన్య బిర్లా చర్చలు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. అనీజ్ బాజ్మీ, సూజిత్ సర్కార్, నీరజ్ పాండే తదితరులు ఉన్నారని సమాచారం. -
ఫ్రెంచ్ సూపర్ బ్రాండ్ తొలి స్టోర్ : ఎవరీ బ్యూటీ విత్ బ్రెయిన్
ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ డిపార్ట్మెంట్ స్టోర్లలో ఒకటైన గ్యాలరీస్ లఫాయెట్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. ముంబైలోని కాలా ఘోడాలోని చారిత్రాత్మక టర్నర్ మోరిసన్ అండ్ వోల్టాస్ హౌస్ భవనాలలో తన తొలి భారతీయ ఫ్లాగ్షిప్ స్టోర్ను ప్రారంభించింది. గ్యాలరీస్ లఫాయెట్ , భారతీయ వ్యాపారం ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ (ABFRL) ప్రత్యేక భాగస్వామ్యంతో ఇది అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇండియన్ లగ్జరీ ఫ్యాషన్ మార్కెట్లో ఇదొక చారిత్ర క్షణమని నిపుణులు పేర్కొంటున్నారు.ఈ సందర్భంగా ఈ రెండు కంపెనీలు సంయుక్తంగా అరేబియా సముద్రంలో అద్భుతమైన వేడుకను నిర్వహించాయి. గేట్వే ఆఫ్ ఇండియా నుండి, యాచ్లలో కుమార్ మంగళం బిర్లా, అనన్యా బిర్లా ,గ్యాలరీస్ లఫాయెట్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నికోలస్ హౌజ్ ఈ లాంచింగ్ ఈవెంట్ను అద్భుతంగా నిర్వహించారు. గ్యాలరీస్ లఫాయెట్ ముంబై లాంచ్లో యువ పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా వ్యాపార వారసురాలు అనన్య బిర్లా (Ananya Birla) ఎరుపు రంగు ఆలిస్ ఒలివియా సూట్లో అద్భుతమైన లుక్తో ఆకట్టుకున్నారు. ఆమె తల్లి ఆభరణాలు, రోలెక్స్, సొగసైన సన్ గ్లాసెస్తో కాంటెంపరరీ పవర్ డ్రెస్సింగ్తో తన ఫ్యాషన్ స్టైల్ను చాటుకున్నారు. View this post on Instagram A post shared by Harper's Bazaar India (@bazaarindia) కాగా బెయిన్ & కో ప్రకారం, దేశంలోని లగ్జరీ విభాగం 2030 నాటికి 3.5 రెట్లు పెరగనుంది. ఫ్రెంచ్ ఐకాన్ గ్యాలరీస్ లఫాయెట్ 130 ఏళ్ల ఫ్యాషన్, కళ , సంస్కృతి వారసత్వాన్ని ఆదిత్య బిర్లా గ్రూప్ భారతీయ మార్కెట్కు పరిచయం చేసింది. ముంబైలో 90 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అయిదు అంతస్తుల్లో ఇది రూపుదిద్దుకుంది. ఈ స్టోర్ను లండన్కు చెందిన ఆర్కిటెక్చరల్ సంస్థ వర్జిల్ + పార్టనర్స్ రూపొందించారు. -
జాన్వీ కపూర్కు లంబోర్గిని కారు గిఫ్ట్.. అందుకోసమేనా?
నచ్చినవారికి గిఫ్టులు ఇచ్చిపుచ్చుకోవడం మామూలే. ఎవరికి తోచిన రీతిలో వారు ఆయా బహుమతులు ఇస్తుంటారు. అయితే ఇక్కడ ఓ అమ్మాయి మాత్రం ఏకంగా కోట్లు విలువ చేసే లగ్జరీ కారును తన స్నేహితురాలికి గిఫ్ట్గా ఇచ్చింది. ఇంతకీ ఆ కారును అందుకుంది ఎవరో కాదు హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సింగర్, ఎంటర్ప్రెన్యూర్ అనన్య బిర్లా (Ananya Birla).. పర్పుల్ కలర్ లంబోర్గినిని జాన్వీకి శుక్రవారం నాడు గిఫ్ట్గా ఇచ్చింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో ఓ వ్యక్తి ఆ లంబోర్గిని కారును జాన్వీ ఇంటికి డ్రైవ్ చేసుకుని వెళ్లి ఇచ్చేశాడు. అంతేకాదు ఆ కారులో ఒక పెద్ద గిఫ్ట్ బాక్స్ కూడా ఉంది. ఇక లంబోర్గిని కారు విలువ దాదాపు రూ.5 కోట్లు.ఎవరీ అనన్య బిర్లా?బిజినెస్ టైకూన్ కుమార్ మంగళం- నీరజ బిర్లాల కూతురే అనన్య. ఈమె సింగర్ మాత్రమే కాదు ఎంటర్ప్రెన్యూర్ కూడా! తాజాగా ఆమె మేకప్ బ్రాండ్ను కూడా లాంచ్ చేసింది. దీనికి జాన్వీ ప్రచారకర్తగా ఉండనుందని, అందుకు కృతజ్ఞతగా ఈ బహుమతిని పంపించిందని తెలుస్తోంది.జాన్వీ సినిమాల విషయానికి వస్తే.. దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురిగా చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ధడక్ చిత్రంతో సినీప్రయాణం ఆరంభించింది. గుంజన్ సక్సేనా, రూహి, గుడ్ లక్ జెర్రీ, మిస్టర్ అండ్ మిసెస్ మహి వంటి సినిమాలు చేసింది. దేవర: పార్ట్ 1 చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రామ్చరణ్తో పెద్ది మూవీలో యాక్ట్ చేస్తోంది. అలాగే ఆమె చేతిలో పరమ సుందరి, సన్నీ సంస్కారీ కి తులసి కుమారి చిత్రాలున్నాయి. View this post on Instagram A post shared by Hashtag Magazine (@hashtagmagazine.in) View this post on Instagram A post shared by Ananya Birla (@ananyabirla)చదవండి: థియేటర్లలో ఆల్కహాల్ అమ్మకాలు.. తూలుతూ సినిమా చూడొచ్చు! -
కాస్మెటిక్స్ విభాగంలోకి అనన్య బిర్లా
ముంబై: వ్యాపార దిగ్గజం కుమార మంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లా (30) తాజాగా సౌందర్య సాధనాలు, కాస్మెటిక్స్ విభాగంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ ఏడాది కొత్త వెంచర్ ద్వారా పలు బ్యూటీ, పర్సనల్ కేర్ బ్రాండ్లను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టనున్నారు. అంతర్జాతీయ ఉత్పత్తులు, వ్యక్తిగత సంరక్షణ అంశాలపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ వినియోగదారులు, దేశీ బ్రాండ్ల నుంచి మరింతగా ఆశిస్తున్నట్లు అనన్య ఒక ప్రకటనలో తెలిపారు. వారి ఆకాంక్షలను తీర్చే విధంగా తమ ఉత్పత్తుల శ్రేణి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. అయితే, వెంచర్ పేరు, పెట్టుబడి ప్రణాళికలు మొదలైన వివరాలను వెల్లడించలేదు. ప్రస్తుతం ఏటా 10–11 శాతం వృద్ధి చెందుతున్న పర్సనల్ కేర్ మార్కెట్ 2028 నాటికి 34 బిలియన్ డాలర్లకు చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. 17 ఏళ్ల వయస్సులోనే అనన్య బిర్లా సూక్ష్మ రుణాల సంస్థ స్వతంత్ర మైక్రోఫిన్ను ప్రారంభించారు. ప్రస్తుతం ఇది దేశీయంగా రెండో అతి పెద్ద ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐగా కార్యకలాపాలు సాగిస్తోంది. గాయని, పాటల రచయిత కూడా అయిన అనన్య.. 62 బిలియన్ డాలర్ల ఆదిత్య బిర్లా గ్రూప్ బోర్డులో డైరెక్టరుగా ఉన్నారు. -
కొత్త బిజినెస్లోకి అడుగుపెట్టనున్న అనన్య బిర్లా (ఫోటోలు)
-
కొత్త బిజినెస్లోకి అనన్య బిర్లా: ఇషా అంబానీకి పోటీ!?
అందానికి ప్రాధాన్యత ఇచ్చేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో.. చాలామంది ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ జాబితాలోకి ఇప్పుడు భారతీయ ధనవంతులలో ఒకరు.. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ 'కుమార్ మంగళం బిర్లా' పెద్ద కుమార్తె 'అనన్య బిర్లా' (Ananya Birla) చేరనున్నారు. ఈమె బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు.ఫిబ్రవరి 5న, అనన్య బిర్లా ఒక బ్యూటీ బ్రాండ్ను ప్రారంభించాలనే తన ప్రణాళికలను వెల్లడించింది. ఇది టాటాస్, హిందుస్తాన్ యూనిలీవర్ (HUL), లోరియల్ (L'Oréal) వంటి వాటితో పాటు ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ 'తిరా'కు కూడా పోటీ ఇవ్వనున్నట్లు సమాచారం.భారతదేశంలో అందానికి సంబంధించిన ఉత్పత్తుల వినియోగం పెరుగుతోంది. కాబట్టి ఈ రంగం ఏటా 10-11 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. ఇది 2028 నాటికి 34 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా. దీనిని దృష్టిలో ఉంచుకుని మేకప్, సువాసనలతో సహా అన్ని విభాగాలలో వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని.. దశలవారీగా తమ వ్యాపారం ప్రారంభమవుతుందని అనన్య బిర్లా వెల్లడించారు.అనన్య బిర్లా ప్రారంభించనున్న వెంచర్ పేరు, అది ఏ బ్రాండ్స్ అందిస్తుందనే విషయాలు అధికారికంగా వెల్లడికాలేదు. ప్రపంచ స్థాయి ఉత్పత్తులను భారత మార్కెట్కు తీసుకురావడం లక్ష్యంగా ఈ వెంచర్ ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ఈమె ప్రారంభించనున్న వ్యాపారానికి బాలీవుడ్ నటి 'జాన్వీ కపూర్' బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం.అనన్య బిర్లాఅనన్య బిర్లా.. ఆదిత్య బిర్లా గ్రూప్ అధినేత, దేశంలో అత్యంత సంపన్నుల్లో ఒకరైన కుమార మంగళం బిర్లా కుమార్తె. సాంప్రదాయ వ్యాపారాలను విడిచిపెట్టి తనకంటూ సొంత మార్గాన్ని ఎంచుకుంది. ఒక్క బిజినెస్లోనే కాకుండా వివిధ రంగాల్లో రాణిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈమె కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు.. సింగర్, రైటర్ కూడా.అనన్య బిర్లా ముంబైలోని అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబేలో ప్రాథమిక విద్య పూర్తి చేసింది. ఆ తరువాత యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఉన్నత చదువులు చదివింది. చదువు పూర్తయిన తరువాత ప్రారంభించిన 'స్వతంత్ర మైక్రోఫైనాన్స్' సంస్థ గ్రామీణ ప్రాంతాల్లోని పేద, అల్పాదాయ వర్గాలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సేవలను అందిస్తోంది. ఈ సంస్థకు ఆమె సీఈవోగా కూడా ఉన్నారు. అలాగే క్యూరోకార్టే అనే లగ్జరీ ఈ-కామర్స్ సంస్థను కూడా ఆమె ప్రారంభించారు. హస్త కళాకృతులు, శిల్పకళా ఉత్పత్తులను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తోంది.ఇదీ చదవండి: రతన్ టాటా ఫ్రెండ్.. శంతనుకు టాటా మోటార్స్లో కీలక బాధ్యతలుస్వతంత్ర మైక్రోఫిన్అనన్య బిర్లా తన 17ఏళ్ల వయసులోనే.. మైక్రో లెండింగ్ కంపెనీ 'స్వతంత్ర మైక్రోఫిన్' ప్రారంభించింది. ఈ సంస్థ ఇప్పుడు దేశంలోని రెండో అతిపెద్ద ఎన్బీఎఫ్సీ ఎంఎఫ్ఐగా రికార్డ్ సృష్టించింది. అంతే కాకుండా ఈమె ఏఐ ప్లాట్ఫామ్ బీటా వెర్షన్ను కూడా ప్రారంభించింది. ఇప్పుడు ముచ్చటగా మూడో వెంచర్ ప్రారభించడానికి సిద్ధమైంది.


