breaking news
Anantalaksmi Ayurvedic College
-
ఆయుర్వేదానికి మొండిచేయి
కళాశాలలో ప్రవేశానికి అనుమతి ఇవ్వని సీసీఐఎం ఇప్పటికైనా మంత్రి, ఎంపీలు స్పందిస్తే ఫలితం పోచమ్మమైదాన్ : వరంగల్లోని అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాలకు గడ్డు రోజులు ముంచుకొస్తున్నాయి. గతంలో రెండేళ్ల పాటు ప్రవేశాలకు అనుమతి నిరాకరించిన సీపీఐఎం అధికారులు గుడ్డిలో మెల్ల అన్నట్లుగా గత ఏడాది మాత్రం షరతులతో కూడిన అనుమతి(కండీషనల్ పర్మిషన్) ఇచ్చారు. అయితే, అప్పట్లో బృందం గుర్తించిన ఏ లోపాన్ని కూడా ఇప్పటి వరకు సరిచేయకపోవడంతో ఈసారి అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు వరంగల్లోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో ప్రవేశాలకు అనుమతి ఇవ్వడం లేదని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ మెడిసిన్(సీసీఐఎం) బృందం కేంద్ర ఆరోగ్యశాఖ కార్యాలయానికి లేఖ సైతం పంపించింది. దీంతో జిల్లాలోని ఆయుర్వేద అభిమానులు, వైద్య విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ రెండేళ్లు అనుమతి లేదు.. పురాతన వైద్యవిధానమైన ఆయుర్వేదాన్ని పరిరక్షించుకునేందుకు కొత్తగా ఆయుర్వేద వైద్య విద్య కళాశాలలు ఏర్పాటుచేయకున్నా ఉన్న వాటిని సంరక్షించుకోవడంపై కూడా పాలకులు శ్రద్ధ చూపడం లేదు. తెలంగాణ జిల్లాల్లో హైదరాబాద్ తర్వాత వరంగల్లో మాత్రమే ఆయుర్వేద వైద్య కళాశాల ఉంది. 1956లో ఏర్పాటైన ఈ అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్య కళాశాలలో యాభై బీఏఎంఎస్ సీట్లు ఉన్నాయి. అనేక అసౌకర్యాలు రాజ్యమేలుతుండడంతో గతంలో రెండేళ్ల పాటు ప్రవేశాలకు అనుమతి లభించలేదు. అంటే వంద సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. గత విద్యాసంవత్సరం మాత్రం జిల్లా ఎంపీల చొరవతో కండీషనల్ పర్మిషన్ ఇచ్చారు. అయినా ఇప్పటి వరకు అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు మేల్కొనని కారణంగా ఈ సంవత్సరం మళ్లీ మొండిచేయి ఎదురైంది. వరంగల్ కళాశాలలో ప్రవేశాలకు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొన్న సీపీఐఎం బృందం హైదరాబాద్లోని ఆయుర్వేద వైద్య కళాశాలకు అనుమతి ఇస్తూ హియరింగ్ కోసం జూలై 8వ తేదీన ఢిల్లీకి రావాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యాలయానికి పంపించిన లేఖ వరంగల్లోని కళాశాల అనుబంధ ఆయుర్వేద ఆస్పత్రిలో రోగులకు సరైన వైద్యం అండడం లేదని, 100 బెడ్ల సామర్థమున్న ఆస్పత్రిలో సరిపడా సిబ్బంది లేరని, కళాశాలకు బస్సు సౌకర్యం లేదనే తదితర సమస్యలను ప్రస్తావించినట్లు సమాచారం. కేఎంసీ పరిస్థితే.. వరంగల్లోని కాకతీయ మెడికల్ కళాశాలలోని యాభై సీట్లకు ఈసారి ఎంసీఐ బృందం అనుమతి నిరాకరించిన విషయం విదితమే. ఈ మేరకు ప్రజాప్రతినిధులు, జిల్లా వైద్యులు సీట్లు తిరిగి సాధించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆయుర్వేద వైద్య కళాశాలకు సంబంధించి పట్టిం చుకునే వారు కరువవడం గమనార్హం. ఇప్పటికైనా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ టి.రాజయ్యతో పాటు జిల్లా ఎంపీలు స్పందించి అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాలలో ప్రవేశాలకు అనుమతి లభించేలా కృషి చేయాలని పలువురు కోరుతున్నారు. -
రాజన్నా.. ఇటూ చూడండి
అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాలకు ముంచుకొస్తున్న ముప్పు ఈ ఏడాది ప్రవేశాలపై నీలినీడలు వసతుల లేమిని గుర్తించిన సీసీఐఎం బృందం పోచమ్మమైదాన్ : రాష్ర్ట ఉప ముఖ్యమంత్రిగానే కాదు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా జిల్లాకు చెందిన డాక్టర్ టి.రాజయ్య ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే వరంగల్లోని కేఎంసీ, ఎంజీఎం ఆస్పత్రులను తనిఖీ చేసి సమస్యలను గుర్తించారు. వీటి పరిష్కారానికి నిధులు మంజూరు చేయిస్తానంటూ హామీ ఇచ్చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. వరంగల్లోని అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్య కళాశాలలో ఈ ఏడాది ప్రవేశాలకు అనుమతి లభించే అవకాశం లేదని ప్రచారం జరుగుతుండడంతో జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. వసతుల లేమి, సిబ్బంది కొరత కారణంగా గతంలో రెండేళ్ల పాటు ప్రవేశాలకు సెంట్రల్ కౌన్సి ల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్(సీసీఐఎం) అనుమతి నిరాకరించిన విషయం విదితమే. గత ఏడాది ఏదో ఓ విధంగా షరతులతో కూడిన అనుమతి(కండీషనల్) లభించింది. అప్పట్లో ఉన్న సమస్యల్లో హాస్టల్ సౌకర్యం మినహా మిగ తా ఏ ఒక్కటి కూడా పరిష్కారానికి నోచుకోకపోవడంతో ఈసారి ప్రవేశాలకు అనుమతి లభిస్తుందా, లేదా అనేది సందేహంగా మారింది. 1956లో ప్రారంభం వరంగల్లోని లేబర్ కాలనీలో 1956వ సంవత్సరంలో అ నంతలక్ష్మి ఆయుర్వేద కళాశాలను ప్రారంభించారు. బీఏఎంఎస్ కోర్సు కోసం ఏటా 50మంది విద్యార్థులకు ఈ కళాశాలలో ప్రవేశాలు కల్పిస్తారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్లో ఉన్న ఈ కళాశాల అభివృద్ధిపై గత పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ఎప్పటికప్పుడు సమస్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. సిబ్బంది కొరత... అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలను సి బ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్(సీసీఐఎం) నిబంధనల ప్రకారం 35 మంది సిబ్బంది ఉండాలి. కనీసం 30మందిని అయినా ని యమించాల్సి ఉండగా.. ప్రస్తుతం 25 మందే ఉన్నారు. ఈ కళాశాలలో విధులు నిర్వర్తిస్తున్న వారు బదిలీపై వెళ్తుండడం, ఉద్యోగ విరమణ చేస్తుండడమే తప్ప కొత్తగా వచ్చే వారు లేరు. ఫలితంగా అనాటమీ, కాయ చికిత్స, శాల్య, కౌమార భృతి, ద్రవ్యగుణ వంటి విభాగాల్లో ప్రొఫెసర్లు, అనాటమీ, ద్రవ్యగుణ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మౌలిక సిద్ధాంతాలు, అనాటమీ, శ్వస్త వృత్తం, కా య చికిత్స, పంచకర్మ విభాగాలకు అధ్యాపకులే లేరంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక కళాశాలకు బస్సు, సరైన ల్యాబ్, ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేవని గుర్తించిన సీసీఐఎం బృందం 2011-12, 2012-13 విద్యాసంవత్సరా ల్లో ప్రవేశాలకు అనుమతి ఇవ్వలేదు. 2013-14లో మాత్రం ఇక్కడి ప్రజాప్రతినిధుల ఒత్తిడితో కండీషనల్ అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పటి వరకు కేవలం హాస్టల్ వసతి మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే పూర్తయిన పర్యటన 2014-15 విద్యాసంవత్సరానికి అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాలకు ప్రవేశాల అనుమతి ఇచ్చేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో సీసీఐఎం బృందం పర్యటించింది. ఈ సందర్భంగా వారు అనేక సమస్యలు గుర్తించారు. అంటే గత ఏడాది పర్యటన తర్వాత ఇప్పటి వరకు కళాశాల అభివృద్ధి, సౌకర్యాల కల్పన, సిబ్బంది నియామకంపై పా లకులు ఎలాంటి చొరవ చూపలేదని తేటతెల్లమవుతోంది. గత ఏడాది ప్రవేశాలకు అనుమతి ఇచ్చే సమయంలో అప్పట్లో ఎమ్మెల్యేలుగా ఉన్న టి.రాజయ్య ఈ కళాశాలను సందర్శించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ర్టం ఏర్పడడమే కాకుండా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. జిల్లాకే చెందిన టి.రాజయ్య రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పటికే కేఎంసీ, ఎంజీఎం ఆస్పత్రుల్లో సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన దరిమిలా... ప్రాచీన వైద్యమైన ఆయుర్వేదాన్ని బతికించుకునేందుకు అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాలలోని సమస్యలను కూడా పరిష్కరించడమే కాకుండా ఈ ఏడాది ప్రవేశాలకు అనుమతి లభించేలా చొరవ చూపాలని జిల్లా వాసులు కోరుతున్నారు. లేనిపక్షంలో మరో పదిహేను రోజుల్లో ప్రారంభం కానున్న బీఏఎంఎస్ ప్రవేశాల ప్రక్రియలో వరంగల్లోని అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాల పేరు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.