breaking news
Amity law student
-
చెయ్యి అడ్డు తియ్యకుంటే మరిన్ని దెబ్బలు..!
లక్నో: యూపీ రాజధాని లక్నోలోని అమిటీ యూనివర్సిటీ లా కాలేజీ విద్యార్థిని క్లాస్మేట్స్ దూషిస్తూ దారుణంగా కొట్టారు. వర్సిటీ క్యాంపస్లోని పార్కు చేసి ఉన్న వాహనంలో ఆగస్ట్ 26వ తేదీన జరిగిన ఈ ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఓ మహిళ ఎడాపెడా చెంపదెబ్బలు కొడుతుండగా పక్కనే ఉన్న మరొకరు దూషణల పర్వం సాగిస్తున్నట్లుగా అందులో ఉంది. బాధిత విద్యార్థి శిఖర్ ముకేశ్ కేసర్వాని దెబ్బలను అడ్డుకునేందుకు ప్రయత్నించగా, ‘చెంపకు చెయ్యి అడ్డు తియ్యి..లేకపోతే మరిన్ని దెబ్బలు తగులుతాయి’అన్న హెచ్చరికలు సైతం రికార్డయ్యాయి. ఒకటిన్నర నిమిషాల వ్యవధిలో కనీసం 25, 30 సార్లు బాధితుడి చెంపలను వాయించారు. దాదాపు ముప్పావు గంటపాటు శిఖర్పై దాడి కొనసాగిందని, ఆ దెబ్బలకు అతడు భయంతో అనారోగ్యం పాలై అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నాడంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలేజీకి వస్తే చంపేస్తామని వాళ్లు బెదిరించారన్నారు. శిఖర్ ఫోన్ను కూడా పగులగొట్టారన్నారు. ఫిర్యాదు ఆధారంగా ఐదుగురిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు కారణాలు తెలియరాలేదు. వర్సిటీ కూడా దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు. -
రిప్లై ఇచ్చి వుంటే నా ఫ్రెండ్ బతికేవాడు!
న్యూఢిల్లీ: 'ఆమిటీ యూనివర్సిటీ ఫౌండర్- ప్రెసిడెంట్ డాక్టర్ అశోక్ చౌహాన్కు నా స్నేహితుడు గత మే నెలలో లేఖ రాశాడు. తను పరీక్షలు రాసేందుకు దయచేసి అనుమతించాలని కోరాడు. అంతేకాకుండా ఆయనకు ఓ ఈమెయిల్ కూడా పంపించాడు. ఒక సంవత్సరం చదువును నిలిపేస్తే తన జీవితం నాశనమవుతుందని పేర్కొన్నాడు. దానిని తాను మానసికంగా తట్టుకోలేనని పేర్కొన్నాడు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. నా స్నేహితుడి ఈమెయిల్కు సమాధానం ఇచ్చి ఉంటే ఈ రోజు నా స్నేహితుడు బతికి ఉండేవాడు'.. ఢిల్లీలోని ఆమిటీ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ రోహిల్లా (20) స్నేహితుడు రాఘవ శర్మ ఆవేదన ఇది. ఈ ఘటనపై రాఘవ శర్మ రాసిన లేఖను సుమోటోగా విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. న్యాయశాస్త్ర విద్యార్థి సుశాంత్ రోహిల్లా ఆత్మహత్యకు వేధింపులే కారణమన్న అనుమానం ఉందని పేర్కొంది. ఈ కేసులో తనకు సహాయం అందించడానికి ప్రఖ్యాత న్యాయకోవిదుడు ఫాలి నారీమన్ను సుప్రీంకోర్టు నియమించింది. ఆమిటీ వర్సిటీ లా స్కూల్లో చదువుతున్న సుశాంత్ రోహిల్లా గతనెల తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. తగినంత హాజరుశాతం లేదనే కారణంతో మూడో సంవత్సరం పరీక్షలు రాయనిచ్చేందుకు వర్సిటీ అధికారులు సుశాంత్ను అనుమతించలేదు. దీంతో తాను వైఫల్యం చెందిన భావన కలిగిందని సుశాంత్ తన ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు. ప్రొఫెసర్ల వేధింపుల కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని సహచర విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇందుకు కారణమైన ప్రొఫెసర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇటు సోషల్ మీడియాలోనూ, అటు క్యాంపస్లో నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ వివాదంలో ఇప్పటికే ఇద్దరు ప్రొఫెసర్లు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో సుశాంత్ ఆత్మహత్యకు కారణమైన ఆమిటీ వర్సిటీపై విచారణ జరుపాలని కోరుతూ అతని స్నేహితుడు, సహచర విద్యార్థి అయిన రాఘవ శర్మ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్కు లేఖ రాశారు. అతని లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)గా స్వీకరించిన సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. క్యాంపస్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రైవేటు యూనివర్సిటీ అయిన ఆమిటీకి సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. -
స్నేహితుడి లేఖతో సుప్రీంకోర్టు కదిలివచ్చింది!
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆమిటీ యూనివర్సిటీలో 20 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పందించింది. న్యాయశాస్త్ర విద్యార్థి సుశాంత్ రోహిల్లా ఆత్మహత్యకు వేధింపులే కారణమన్న అనుమానం ఉందని పేర్కొంది. ఈ కేసులో తనకు సహాయం అందించడానికి ప్రఖ్యాత న్యాయకోవిదుడు ఫాలి నారీమన్ను సుప్రీంకోర్టు నియమించింది. ఆమిటీ వర్సిటీ లా స్కూల్లో చదువుతున్న సుశాంత్ రోహిల్లా గతనెల తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. తగినంత హాజరుశాతం లేదనే కారణంతో మూడో సంవత్సరం పరీక్షలు రాయనిచ్చేందుకు వర్సిటీ అధికారులు సుశాంత్ను అనుమతించలేదు. దీంతో తాను వైఫల్యం చెందిన భావన కలిగిందని సుశాంత్ తన ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు. ప్రొఫెసర్ల వేధింపుల కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని సహచర విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇందుకు కారణమైన ప్రొఫెసర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇటు సోషల్ మీడియాలోనూ, అటు క్యాంపస్లో నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ వివాదంలో ఇప్పటికే ఇద్దరు ప్రొఫెసర్లు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో సుశాంత్ ఆత్మహత్యకు కారణమైన ఆమిటీ వర్సిటీపై విచారణ జరుపాలని కోరుతూ అతని స్నేహితుడు, సహచర విద్యార్థి అయిన రాఘవ శర్మ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్కు లేఖ రాశారు. అతని లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)గా స్వీకరించిన సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. క్యాంపస్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రైవేటు యూనివర్సిటీ అయిన ఆమిటీకి సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.